ETV Bharat / offbeat

హైదరాబాద్ టూ శ్రీశైలం - తెలంగాణ టూరిజం సూపర్ ప్యాకేజీ! - HYDERABAD TO SRISAILAM TOUR

- రోడ్డు మార్గంలో శ్రీశైలం టూర్ - ఏసీ, నాన్ ఏసీ బస్సుల్లో జర్నీ

Hyderabad to Srisailam Tour
Hyderabad to Srisailam Tour (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 5, 2025, 3:39 PM IST

Hyderabad to Srisailam Tour : ఈ ప్రపంచం అందమైన పుస్తకం. అందులో మనకు వీలైనన్ని ఎక్కువ పేజీలు చదవాలి. అలా చదవాలంటే వీలైనన్ని కొత్త ప్రాంతాలను చూడాలి. టూర్లకు వెళ్లి రావాలి. ఇలా చేయడం ద్వారా కొత్త ప్రాంతాలను చూసిన అనుభూతి పొందడం మాత్రమే కాకుండా, రొటీన్ వర్క్​ నుంచి రిలీఫ్​ కూడా పొందవచ్చు. ఇలాంటి వాళ్లకోసమే తెలంగాణ టూరిజం శ్రీశైలం ప్యాకేజ్​ ఆపరేట్ చేస్తోంది. మరి, ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.

శ్రీశైలం టూర్​కు రెండు బస్సులు అందుబాటులో ఉన్నాయి. ఒకటి ఏసీ బస్సు, మరొకటి నాన్​-ఏసీ బస్సు. వాటి టికెట్ ధరలు ఇలా ఉన్నాయి.

AC బస్సు ప్యాకేజీ ఇలా :

పెద్దలకు ఛార్జీ = Rs.2,990

పిల్లలకు ఛార్జీ = Rs.2392

శ్రీశైలంలో వసతి నాన్ ఏసీలో ఉంటుంది.

నాన్ AC బస్సు ప్యాకేజీ ఇలా :

పెద్దలకు ఛార్జీ = Rs.2,000

పిల్లలకు ఛార్జీ = పిల్లలకు Rs.1,600

శ్రీశైలంలో వసతి నాన్ ఏసీలో ఉంటుంది.

టూర్ మొదలయ్యేది ఇలా :

  • హైదరాబాద్​లోని పర్యాటక్ భవన్ నుండి ఉదయం 8:30 గంటలకు బస్సు బయలుదేరుతుంది.
  • CRO బషీర్‌బాగ్ వద్ద ఆగి, అక్కడ ఉన్న ప్రయాణికులను కూడా ఎక్కించుకొని, ఉదయం 09.00 గంటలకు బయల్దేరుతుంది. మార్గం మధ్యలో మధ్యాహ్న భోజనం కోసం ఆగుతుంది.
  • సాయంత్రం 5:00 గంటలకు శ్రీశైలం చేరుకుంటారు. మార్గం మధ్యలోనే సాక్షి గణపతి ఆలయాన్ని దర్శించుకొని, ఆ తర్వాత నేరుగా హోటల్‌కు తీసుకెళ్తారు.
  • శ్రీశైలం హోటల్‌లో ప్రత్యేకంగా దుప్పట్లు ఏమీ ఇవ్వరు. పర్యాటకులు సొంత దుప్పట్లు తీసుకెళ్లాల్సి ఉంటుంది.
  • శ్రీశైల దర్శనం అదేరోజు సాయంత్రం లేదా తెల్లవారు జామున చేసుకోవాలి. అది టూరిస్టు ఇష్టానుసారం ఉంటుంది.

2వ రోజు ఇలా :

  • మరుసటి రోజు ఉదయం హోటల్ లోనే అల్పాహారం చేసిన తర్వాత బయలుదేరి, రోప్ వే (పాతాళ-గంగ) సందర్శనకు వెళ్తారు. అక్కడి నుంచి ఫలధార, ఆ తర్వాత పంచధార, అటు నుంచి శిఖరం, చివరగా ప్రతిష్ఠాత్మకమైన శ్రీశైలం డ్యామ్ ను సందర్శిస్తారు.
  • సందర్శన పూర్తయిన తర్వాత తిరిగి హైదరాబాద్​ ప్రయాణం మొదలవుతుంది. రాత్రి 7:00 గంటల వరకు నగరానికి చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది.

గమనిక: ఈ టూర్​ ప్యాకేజీలో బస్సు ఛార్జీలు, వసతి మాత్రమే కవర్ అవుతాయి. అక్కడ భోజనం, టెంపుల్​ దర్శనం, ఇతర ప్రాంతాల్లో టికెట్ల ఖర్చులు ఏవైనా ఉంటే అవి పర్యాటకులే భరించాల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి :

ఒకే ట్రిప్​లో యాదాద్రి, భద్రకాళి టెంపుల్​, రామప్ప దర్శనం - తక్కువ ధరకే తెలంగాణ టూరిజం ప్యాకేజీ

హైదరాబాద్ నుంచి కొత్త పర్యాటక ప్యాకేజీలు - ఉదయం వెళ్లి రాత్రికి తిరిగి వచ్చేలా ప్లాన్!

Hyderabad to Srisailam Tour : ఈ ప్రపంచం అందమైన పుస్తకం. అందులో మనకు వీలైనన్ని ఎక్కువ పేజీలు చదవాలి. అలా చదవాలంటే వీలైనన్ని కొత్త ప్రాంతాలను చూడాలి. టూర్లకు వెళ్లి రావాలి. ఇలా చేయడం ద్వారా కొత్త ప్రాంతాలను చూసిన అనుభూతి పొందడం మాత్రమే కాకుండా, రొటీన్ వర్క్​ నుంచి రిలీఫ్​ కూడా పొందవచ్చు. ఇలాంటి వాళ్లకోసమే తెలంగాణ టూరిజం శ్రీశైలం ప్యాకేజ్​ ఆపరేట్ చేస్తోంది. మరి, ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.

శ్రీశైలం టూర్​కు రెండు బస్సులు అందుబాటులో ఉన్నాయి. ఒకటి ఏసీ బస్సు, మరొకటి నాన్​-ఏసీ బస్సు. వాటి టికెట్ ధరలు ఇలా ఉన్నాయి.

AC బస్సు ప్యాకేజీ ఇలా :

పెద్దలకు ఛార్జీ = Rs.2,990

పిల్లలకు ఛార్జీ = Rs.2392

శ్రీశైలంలో వసతి నాన్ ఏసీలో ఉంటుంది.

నాన్ AC బస్సు ప్యాకేజీ ఇలా :

పెద్దలకు ఛార్జీ = Rs.2,000

పిల్లలకు ఛార్జీ = పిల్లలకు Rs.1,600

శ్రీశైలంలో వసతి నాన్ ఏసీలో ఉంటుంది.

టూర్ మొదలయ్యేది ఇలా :

  • హైదరాబాద్​లోని పర్యాటక్ భవన్ నుండి ఉదయం 8:30 గంటలకు బస్సు బయలుదేరుతుంది.
  • CRO బషీర్‌బాగ్ వద్ద ఆగి, అక్కడ ఉన్న ప్రయాణికులను కూడా ఎక్కించుకొని, ఉదయం 09.00 గంటలకు బయల్దేరుతుంది. మార్గం మధ్యలో మధ్యాహ్న భోజనం కోసం ఆగుతుంది.
  • సాయంత్రం 5:00 గంటలకు శ్రీశైలం చేరుకుంటారు. మార్గం మధ్యలోనే సాక్షి గణపతి ఆలయాన్ని దర్శించుకొని, ఆ తర్వాత నేరుగా హోటల్‌కు తీసుకెళ్తారు.
  • శ్రీశైలం హోటల్‌లో ప్రత్యేకంగా దుప్పట్లు ఏమీ ఇవ్వరు. పర్యాటకులు సొంత దుప్పట్లు తీసుకెళ్లాల్సి ఉంటుంది.
  • శ్రీశైల దర్శనం అదేరోజు సాయంత్రం లేదా తెల్లవారు జామున చేసుకోవాలి. అది టూరిస్టు ఇష్టానుసారం ఉంటుంది.

2వ రోజు ఇలా :

  • మరుసటి రోజు ఉదయం హోటల్ లోనే అల్పాహారం చేసిన తర్వాత బయలుదేరి, రోప్ వే (పాతాళ-గంగ) సందర్శనకు వెళ్తారు. అక్కడి నుంచి ఫలధార, ఆ తర్వాత పంచధార, అటు నుంచి శిఖరం, చివరగా ప్రతిష్ఠాత్మకమైన శ్రీశైలం డ్యామ్ ను సందర్శిస్తారు.
  • సందర్శన పూర్తయిన తర్వాత తిరిగి హైదరాబాద్​ ప్రయాణం మొదలవుతుంది. రాత్రి 7:00 గంటల వరకు నగరానికి చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది.

గమనిక: ఈ టూర్​ ప్యాకేజీలో బస్సు ఛార్జీలు, వసతి మాత్రమే కవర్ అవుతాయి. అక్కడ భోజనం, టెంపుల్​ దర్శనం, ఇతర ప్రాంతాల్లో టికెట్ల ఖర్చులు ఏవైనా ఉంటే అవి పర్యాటకులే భరించాల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి :

ఒకే ట్రిప్​లో యాదాద్రి, భద్రకాళి టెంపుల్​, రామప్ప దర్శనం - తక్కువ ధరకే తెలంగాణ టూరిజం ప్యాకేజీ

హైదరాబాద్ నుంచి కొత్త పర్యాటక ప్యాకేజీలు - ఉదయం వెళ్లి రాత్రికి తిరిగి వచ్చేలా ప్లాన్!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.