ETV Bharat / city

AP Governor: గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్​ను పరామర్శించిన ఏపీ సీఎం జగన్

ఏపీ ముఖ్యమంత్రి జగన్​.. గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్​తో ఫోన్​లో(CM Jagan talk to governor biswabhusan) మాట్లాడారు. ఆయన త్వరగా కోలుకోవాలని(ap governor tested covid positive) ఆకాంక్షించారు.

author img

By

Published : Nov 18, 2021, 5:56 PM IST

governor biswabhusan
governor biswabhusan

గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్​ను ఏపీ ముఖ్యమంత్రి జగన్ పరామర్శించారు. శాసనసభ విరామ సమయంలో గవర్నర్​తో ఫోన్‌లో(CM Jagan talk to governor biswabhusan) మాట్లాడిన సీఎం.. ఆయన ఆరోగ్య పరిస్ధితిపై ఆరా తీశారు. బుధవారమే వైద్యులతో గవర్నర్​ ఆరోగ్య పరిస్థితిపై మాట్లాడారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు(ap Governor Biswabhusan Harichandan news) పేర్కొన్నారు.

గవర్నర్‌ దంపతులకు కొవిడ్ పాజిటివ్​..

ఏపీ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌, ఆయన సతీమణి సుప్రవ హరిచందన్‌లు కొవిడ్‌ బారిన(ap governor biswabhusan and his wife tested covid positive) పడ్డారు. ఇటీవల దిల్లీ పర్యటన ముగించుకొని విజయవాడ చేరుకున్న గవర్నర్‌ రెండు రోజులుగా జలుబు, దగ్గుతో బాధపడుతున్నారు. దీంతో గవర్నర్‌ దంపతులకు ఈ నెల 15న ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు నిర్వహించగా కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణైంది. హైదరాబాద్‌లోని ఏషియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రోఎంటరాలజీ(ఏఐజీ)కి వారిని తరలించాలని రాజ్‌భవన్‌ మంగళవారమే ప్రత్యేక విమానం ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఆ ప్రక్రియ వెంటనే కుదరకపోవటంతో రాజ్‌భవన్‌ వర్గాలు ప్రధానమంత్రి కార్యాలయాన్ని సంప్రదించాయి. వారు బుధవారం హుటాహుటిన సైనిక విమానాన్ని హైదరాబాద్‌ నుంచి విజయవాడకు పంపించారు. ఆ ప్రత్యేక విమానంలో గవర్నర్‌ దంపతులు మధ్యాహ్నం ఒంటిగంటకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి నేరుగా గచ్చిబౌలిలోని ఏఐజీకి అంబులెన్సులో(ap governor tested covid positive) వెళ్లారు.

ఆరోగ్యం నిలకడగా ఉంది: ఏఐజీ ఆసుపత్రి

88 ఏళ్ల వయసున్న గవర్నర్‌కు కొవిడ్‌(ap governor biswabhusan suffering with covid) మధ్యస్థ లక్షణాలు ఉండడం, ఇతర అనుబంధ అనారోగ్య సమస్యలతో బాధపడుతుండటంతో ప్రత్యేక నిపుణుల బృందం చికిత్స అందిస్తోంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం పూర్తి నిలకడగా ఉందని, ఆక్సిజన్‌ స్థాయిల్లో ఎలాంటి ఇబ్బందీ లేదని బుధవారం సాయంత్రం ఏఐజీ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌లో పేర్కొంది. గవర్నర్‌ సతీమణికి కొవిడ్‌ సోకినప్పటికీ ఆమెలో స్వల్ప లక్షణాలే ఉన్నాయి.

రాజ్‌భవన్‌లో మరో పదిమందికిరాజ్‌భవన్‌లో పనిచేసే అధికారుల్లో కొందరితో పాటు, గవర్నర్‌ వ్యక్తిగత సహాయ సిబ్బందికి కలిపి మొత్తం పది మందికి కొవిడ్‌ సోకింది. ఈ నేపథ్యంలో రాజ్‌భవన్‌లో పనిచేసే సిబ్బంది అందరికీ కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు.

ఇదీ చూడండి: ఇక కొత్తగా బాయిల్డ్ రైస్ తీసుకోం: కేంద్ర ప్రభుత్వ వర్గాలు

గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్​ను ఏపీ ముఖ్యమంత్రి జగన్ పరామర్శించారు. శాసనసభ విరామ సమయంలో గవర్నర్​తో ఫోన్‌లో(CM Jagan talk to governor biswabhusan) మాట్లాడిన సీఎం.. ఆయన ఆరోగ్య పరిస్ధితిపై ఆరా తీశారు. బుధవారమే వైద్యులతో గవర్నర్​ ఆరోగ్య పరిస్థితిపై మాట్లాడారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు(ap Governor Biswabhusan Harichandan news) పేర్కొన్నారు.

గవర్నర్‌ దంపతులకు కొవిడ్ పాజిటివ్​..

ఏపీ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌, ఆయన సతీమణి సుప్రవ హరిచందన్‌లు కొవిడ్‌ బారిన(ap governor biswabhusan and his wife tested covid positive) పడ్డారు. ఇటీవల దిల్లీ పర్యటన ముగించుకొని విజయవాడ చేరుకున్న గవర్నర్‌ రెండు రోజులుగా జలుబు, దగ్గుతో బాధపడుతున్నారు. దీంతో గవర్నర్‌ దంపతులకు ఈ నెల 15న ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు నిర్వహించగా కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణైంది. హైదరాబాద్‌లోని ఏషియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రోఎంటరాలజీ(ఏఐజీ)కి వారిని తరలించాలని రాజ్‌భవన్‌ మంగళవారమే ప్రత్యేక విమానం ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఆ ప్రక్రియ వెంటనే కుదరకపోవటంతో రాజ్‌భవన్‌ వర్గాలు ప్రధానమంత్రి కార్యాలయాన్ని సంప్రదించాయి. వారు బుధవారం హుటాహుటిన సైనిక విమానాన్ని హైదరాబాద్‌ నుంచి విజయవాడకు పంపించారు. ఆ ప్రత్యేక విమానంలో గవర్నర్‌ దంపతులు మధ్యాహ్నం ఒంటిగంటకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి నేరుగా గచ్చిబౌలిలోని ఏఐజీకి అంబులెన్సులో(ap governor tested covid positive) వెళ్లారు.

ఆరోగ్యం నిలకడగా ఉంది: ఏఐజీ ఆసుపత్రి

88 ఏళ్ల వయసున్న గవర్నర్‌కు కొవిడ్‌(ap governor biswabhusan suffering with covid) మధ్యస్థ లక్షణాలు ఉండడం, ఇతర అనుబంధ అనారోగ్య సమస్యలతో బాధపడుతుండటంతో ప్రత్యేక నిపుణుల బృందం చికిత్స అందిస్తోంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం పూర్తి నిలకడగా ఉందని, ఆక్సిజన్‌ స్థాయిల్లో ఎలాంటి ఇబ్బందీ లేదని బుధవారం సాయంత్రం ఏఐజీ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌లో పేర్కొంది. గవర్నర్‌ సతీమణికి కొవిడ్‌ సోకినప్పటికీ ఆమెలో స్వల్ప లక్షణాలే ఉన్నాయి.

రాజ్‌భవన్‌లో మరో పదిమందికిరాజ్‌భవన్‌లో పనిచేసే అధికారుల్లో కొందరితో పాటు, గవర్నర్‌ వ్యక్తిగత సహాయ సిబ్బందికి కలిపి మొత్తం పది మందికి కొవిడ్‌ సోకింది. ఈ నేపథ్యంలో రాజ్‌భవన్‌లో పనిచేసే సిబ్బంది అందరికీ కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు.

ఇదీ చూడండి: ఇక కొత్తగా బాయిల్డ్ రైస్ తీసుకోం: కేంద్ర ప్రభుత్వ వర్గాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.