ETV Bharat / city

జలవిహార్​లో సందడిగా అలయ్​ బలాయ్​

హిమాచల్​ గవర్నర్​ బండారు దత్తాత్రేయ తనకు మార్గదర్శకులని రాష్ట్ర గవర్నర్​ తమిళిసై సౌందరరాజన్​ అన్నారు. రాజకీయాలకతీతంగా అన్నిపార్టీల నేతలు ఒక తాటిపైకి రావడం గొప్పవిషయమని కొనియాడారు. జలవిహార్​లో దత్తన్న నిర్వహించిన అలయ్​ బలాయ్​కు అన్ని పార్టీల నేతలు హాజరయ్యారు.

author img

By

Published : Oct 10, 2019, 2:24 PM IST

జలవిహార్​లో అలయ్​ బలాయ్​ కార్యక్రమం
జలవిహార్​లో అలయ్​ బలాయ్​ కార్యక్రమం

తెలంగాణ గవర్నర్​గా రావడం అదృష్టంగా భావిస్తున్నానని తమిళిసై సౌందరరాజన్​ అన్నారు. హైదరాబాద్​ జలవిహార్​లో అలయ్​ బలాయ్​ కార్యక్రమానికి హాజరయ్యారు. రాజకీయాలకతీతంగా అన్నిపార్టీల వారు ఒకతాటిపైకి రావడం గొప్ప విషయమని కొనియాడారు.

15 ఏళ్లుగా అలయ్​ బలాయ్​ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని హిమాచల్​ గవర్నర్​ బండారు దత్తాత్రేయ అన్నారు. ప్రజలు శాంతి, సామరస్యంగా ఉండాలని కోరుకున్నారు. తెలంగాణ, హిమాచల్​ప్రదేశ్​లను పర్యటకంగా అనుసంధానం చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు. అవినీతి, ప్లాస్టిక్​ భూతాన్ని దేశం పొలిమేరకు తరమాలని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమానికి హాజరైన కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, తెదేపా నేత ఎల్​రమణ, కాంగ్రెస్​ నేత వీహెచ్, మహారాష్ట్ర మాజీ గవర్నర్​ విద్యా సాగర్​రావు, మండలి ఛైర్మన్​ గుత్తా సుఖేందర్​రెడ్డి తదితర భాజపా, తెరాస, కాంగ్రెస్​, తెదేపా నేతలకు శాలువా కప్పి అలయ్​ బలాయ్​ చేసుకున్నారు బండారు దత్తాత్రేయ.

జలవిహార్​లో అలయ్​ బలాయ్​ కార్యక్రమం

తెలంగాణ గవర్నర్​గా రావడం అదృష్టంగా భావిస్తున్నానని తమిళిసై సౌందరరాజన్​ అన్నారు. హైదరాబాద్​ జలవిహార్​లో అలయ్​ బలాయ్​ కార్యక్రమానికి హాజరయ్యారు. రాజకీయాలకతీతంగా అన్నిపార్టీల వారు ఒకతాటిపైకి రావడం గొప్ప విషయమని కొనియాడారు.

15 ఏళ్లుగా అలయ్​ బలాయ్​ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని హిమాచల్​ గవర్నర్​ బండారు దత్తాత్రేయ అన్నారు. ప్రజలు శాంతి, సామరస్యంగా ఉండాలని కోరుకున్నారు. తెలంగాణ, హిమాచల్​ప్రదేశ్​లను పర్యటకంగా అనుసంధానం చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు. అవినీతి, ప్లాస్టిక్​ భూతాన్ని దేశం పొలిమేరకు తరమాలని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమానికి హాజరైన కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, తెదేపా నేత ఎల్​రమణ, కాంగ్రెస్​ నేత వీహెచ్, మహారాష్ట్ర మాజీ గవర్నర్​ విద్యా సాగర్​రావు, మండలి ఛైర్మన్​ గుత్తా సుఖేందర్​రెడ్డి తదితర భాజపా, తెరాస, కాంగ్రెస్​, తెదేపా నేతలకు శాలువా కప్పి అలయ్​ బలాయ్​ చేసుకున్నారు బండారు దత్తాత్రేయ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.