కాళేశ్వరం ప్రాజెక్టుపై దాఖలైన పిటిషన్పై ఎన్జీటీలో విచారణ జరిగింది. పర్యావరణ అనుమతులు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయంటూ హయతుద్దీన్ పిటిషన్ వేశారు. అనుమతులను సవాల్ చేసే గడువు ముగిసిన తర్వాత పిటిషన్ వేశారని... కొట్టివేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. వ్యాజ్యం ఆలస్యమైనా.. నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు ఉన్నాయని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. పిటిషన్ను విచారించేందుకు ఎన్జీటీ అంగీకరించింది. ఆగస్టు 26 నుంచి వాదనలు విననుంది.
ఇదీ చూడండి: సాయంత్రానికి జూరాలను చేరనున్న కృష్ణమ్మ