ETV Bharat / business

మార్కెట్ల రికార్డు నష్టాలకు కారణాలివే!

దేశ వ్యాప్తంగా కరోనా కేసులు ఒక్క రోజులో లక్ష దాటాయి. ఈ ప్రభావం దేశీయ స్టాక్‌ మార్కెట్లపై తీవ్రంగా పడింది. దీనితో సూచీలు రికార్డు స్థాయి నష్టాల్లో ట్రేడవుతున్నాయి. భారీ నష్టాలకు నిపుణులు చెబుతున్న కారణాలు ఇలా ఉన్నాయి.

author img

By

Published : Apr 5, 2021, 1:11 PM IST

With rising corona cases the stock markets are heading towards huge losses
భారీ నష్టాల్లో మార్కెట్లు.. కారణాలివే!

కరోనా భయాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. బీఎస్​ఈ-సెన్సెక్స్‌ 1000 పాయింట్లకు పైగా కోల్పోయి 49,009 వద్ద కొనసాగుతోంది. ఎన్​ఎస్​ఈ- నిఫ్టీ 280 పాయింట్లకు పైగా నష్టపోయి 14,580 వద్ద ట్రేడవుతోంది. ఈ స్థాయి నష్టాలకు కారణాలు ఇలా ఉన్నాయి.

  • దేశీయంగా కరోనా కేసులు భారీస్థాయిలో వెలుగు చూడడం. మదుపరులను ఆందోళనకు గురిచేస్తోంది.
  • దేశవ్యాప్తంగా కొవిడ్​ విజృంభణతో ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. మరోసారి లాక్​డౌన్​ పెట్టొచ్చన్న అంచనాలతో మదుపరులు అమ్మకాలకు మొగ్గు చూపుతున్నారు.
  • దేశ జీడీపీలో 13 శాతం వాటా ఉన్న మహారాష్ట్రలో వారాంతాల్లో లాక్​డౌన్​ విధించడం స్వదేశీ సంస్థాగత మదుపరుల సెంటిమెంట్​ను దెబ్బతీసింది.అంతర్జాతీయంగా కూడా పెరుగుతోన్న కరోనా కేసులు విదేశీ సంస్థాగత మదుపరులను వెనకడుగు వేసేలా చేశాయి.
  • మార్కెట్లకు ఊతం ఇచ్చే అంశం ఒక్కటి కూడా లేకపోవడం నష్టాలకు ప్రధాన కారణంగా చెప్పవచ్చు.
  • ఆర్​బీఐ ఎంపీసీ సమీక్షకు సంబంధించి సానుకూల అంచనాలు లేకపోవడం కూడా నష్టాలకు మరో కారణంగా తెలుస్తోంది.
  • నెలవారీ సేవా రంగ పీఎంఐ మళ్లీ తగ్గితే.. మార్కెట్​ మరింత పడిపోయే ప్రమాదం ఉందని నిపుణుల అంచనా.
  • భారీ నష్టాలతో బీఎస్​ఈ మదుపరుల సంపద (మిడ్​ సెషన్​ ముందు వరకు) రూ.4.54 లక్షల కోట్లు ఆవిరైంది.
  • ప్రస్తుత సెషన్​లో సెన్సెక్స్ అత్యధికంగా 1449 పాయింట్లు పతనమవడం కొసమెరుపు

ఇదీ చూడండి: భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు- సెన్సెక్స్ 1350 మైనస్

కరోనా భయాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. బీఎస్​ఈ-సెన్సెక్స్‌ 1000 పాయింట్లకు పైగా కోల్పోయి 49,009 వద్ద కొనసాగుతోంది. ఎన్​ఎస్​ఈ- నిఫ్టీ 280 పాయింట్లకు పైగా నష్టపోయి 14,580 వద్ద ట్రేడవుతోంది. ఈ స్థాయి నష్టాలకు కారణాలు ఇలా ఉన్నాయి.

  • దేశీయంగా కరోనా కేసులు భారీస్థాయిలో వెలుగు చూడడం. మదుపరులను ఆందోళనకు గురిచేస్తోంది.
  • దేశవ్యాప్తంగా కొవిడ్​ విజృంభణతో ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. మరోసారి లాక్​డౌన్​ పెట్టొచ్చన్న అంచనాలతో మదుపరులు అమ్మకాలకు మొగ్గు చూపుతున్నారు.
  • దేశ జీడీపీలో 13 శాతం వాటా ఉన్న మహారాష్ట్రలో వారాంతాల్లో లాక్​డౌన్​ విధించడం స్వదేశీ సంస్థాగత మదుపరుల సెంటిమెంట్​ను దెబ్బతీసింది.అంతర్జాతీయంగా కూడా పెరుగుతోన్న కరోనా కేసులు విదేశీ సంస్థాగత మదుపరులను వెనకడుగు వేసేలా చేశాయి.
  • మార్కెట్లకు ఊతం ఇచ్చే అంశం ఒక్కటి కూడా లేకపోవడం నష్టాలకు ప్రధాన కారణంగా చెప్పవచ్చు.
  • ఆర్​బీఐ ఎంపీసీ సమీక్షకు సంబంధించి సానుకూల అంచనాలు లేకపోవడం కూడా నష్టాలకు మరో కారణంగా తెలుస్తోంది.
  • నెలవారీ సేవా రంగ పీఎంఐ మళ్లీ తగ్గితే.. మార్కెట్​ మరింత పడిపోయే ప్రమాదం ఉందని నిపుణుల అంచనా.
  • భారీ నష్టాలతో బీఎస్​ఈ మదుపరుల సంపద (మిడ్​ సెషన్​ ముందు వరకు) రూ.4.54 లక్షల కోట్లు ఆవిరైంది.
  • ప్రస్తుత సెషన్​లో సెన్సెక్స్ అత్యధికంగా 1449 పాయింట్లు పతనమవడం కొసమెరుపు

ఇదీ చూడండి: భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు- సెన్సెక్స్ 1350 మైనస్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.