ETV Bharat / business

ఫ్లాట్​గా ముగిసిన సూచీలు- సెన్సెక్స్​ నష్టాల్లో, నిఫ్టీ లాభాల్లో

author img

By

Published : Mar 27, 2020, 9:20 AM IST

Updated : Mar 27, 2020, 4:51 PM IST

SENSEX
భరోసా ఇచ్చిన ప్యాకేజీ- భారీ లాభాల్లో మార్కెట్లు

16:33 March 27

ఫ్లాట్​గా...

కరోనా ప్రభావంతో కుదేలవుతున్న ఆర్థిక వ్యవస్థను ఆదుకునేందుకు ఆర్​బీఐ వడ్డీ రేట్లను తగ్గించడం సహా కీలక నిర్ణయాలతో ముందుకొచ్చినప్పటికీ... వృద్ధిరేటు తగ్గుతుందనే భయాల మధ్య దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్​గా ముగిశాయి. 

బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ-సెన్సెక్స్ 131​ పాయింట్ల మేర నష్టపోయి 29,815  వద్ద ముగిసింది.

జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ- నిఫ్టీ 18 పాయింట్ల వృద్ధితో 8,660 వద్ద స్థిరపడింది.

కేంద్రం ప్రకటించిన రూ.1.70 లక్షల కోట్ల ఉద్దీపన పథకం అండతో గురువారం లాభాల్లో ముగిసిన సెన్సెక్స్‌.. శుక్రవారం నష్టాలతో ముగిసింది.  సామాన్యుడికి ఊరట కల్పిస్తూ ఆర్‌బీఐ ప్రకటించిన కొన్ని నిర్ణయాలు మదుపరులను మెప్పించలేకపోయాయి. రేట్ల కోత, మార్కెట్‌లోకి రూ.3.74 లక్షల కోట్లు చొప్పించేందుకు ఆర్‌బీఐ తీసుకున్న నిర్ణయాలు వారిని మెప్పించినా.. కొవిడ్‌-19 కారణంగా వృద్ధి రేటు అంచనాలను తగ్గించడం సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. ఒకానొక దశలో ట్రేడింగ్‌లో సుమారు 1700 పాయింట్ల లాభాల్లోకి వెళ్లిన సెన్సెక్స్‌ చివరికి నష్టాలతో ముగిసింది.

లాభాల్లో...

నిఫ్టీలో కోల్‌ ఇండియా, సిప్లా, యాక్సిస్‌ బ్యాంక్‌, ఐటీసీ షేర్లు లాభపడ్డాయి. బజాజ్‌ ఫైనాన్స్‌, హీరో మోటోకార్ప్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ షేర్లు నష్టాలు చవిచూశాయి.

రూపాయి...

డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.75.27గా ఉంది. 

15:31 March 27

ఫ్లాట్​గా...

కరోనా భయాల నడుమ ఆర్​బీఐ కీలక నిర్ణయాలతో అభయమిచ్చినప్పటికీ స్టాక్​ మార్కెట్లు ఫ్లాట్​గా ముగిశాయి. దేశంలో కొవిడ్​-19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మదుపరులు అప్రమత్తత పాటించారు. ఆరంభ లాభాల నుంచి మార్కెట్లు ఫ్లాట్​గా ముగించాయి. 

బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ-సెన్సెక్స్ 131​ పాయింట్ల మేర నష్టపోయి 29,815  వద్ద ముగిసింది.

జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ- నిఫ్టీ 18 పాయింట్ల వృద్ధితో 8,660 వద్ద స్థిరపడింది.

13:21 March 27

టాప్​ గేర్లో ఎస్ ​బ్యాంక్​...

రూ. 5,000 కోట్లు సమీకరించే ప్రతిపాదనకు రుణదాత డైరెక్టర్ల బోర్డు ఆమోదం తెలపడం వల్ల శుక్రవారం ఎస్​బ్యాంక్ షేర్లు 25 శాతం పెరిగాయి.

13:19 March 27

ఒక్క ప్రకటనతో...

కరోనా వల్ల​ వార్షిక జీడీపీ వృద్ధి రేటు గణనీయంగా తగ్గే ప్రమాదముందని ఆర్​బీఐ గవర్నర్​ శక్తికాంత దాస్​ ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన ఈ ప్రకటన చేసిన కాసేపటికే ఆరంభ లాభాల్ని కోల్పోయి నష్టాల్లోకి జారుకున్నాయి స్టాక్​మార్కెట్లు.

ఉదయం 11.30 గంటలకు 30 షేర్ల సూచీ సెన్సెక్స్​ 407 పాయింట్లు కోల్పోయి 29,539 వద్ద ఉంది. నిఫ్టీ 9 వేల మార్కును కోల్పోయింది. 71 పాయింట్లు క్షీణించి 8,569 వద్ద నిలిచింది.

నష్టాల్లో...

30 షేర్ల బీఎస్​ఈలో భారతీ ఎయిర్​టెల్ భారీగా నష్టపోయింది. ​సంస్థ షేర్లు 6 శాతం నష్టపోయాయి. హెచ్​సీఎల్​ టెక్​, హీరో మోటోకార్ప్​, మారుతీ, ఏషియన్​ పెయింట్స్​, బజాజ్​ ఆటో నష్టాల బాట పట్టాయి.

లాభాల్లో...

యాక్సిస్​ బ్యాంక్​, ఇండస్​ఇండ్​ బ్యాంక్​, ఎన్​టీపీసీ, ఐసీఐసీఐ బ్యాంక్​, పవర్​గ్రిడ్​ లాభాల్లో ఉన్నాయి.

వడ్డీ రేట్లు భారీగా తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నప్పటికీ వార్షిక వృద్ధి రేటుపై ఆర్​బీఐ గవర్నర్​ ఆందోళన చెందడం మార్కెట్​ను నష్టాల్లోకి నెట్టాయని నిపుణులు అభిప్రాయపడ్డారు.

రూపాయి...

ఇంట్రాడేలో యూఎస్​ డాలర్​తో పోలిస్తే రూపాయి విలువ 81 పైసలు పెరిగి రూ.74.35 వద్ద ఉంది.

కీలక నిర్ణయాలు...

దేశ ఆర్థిక వ్యవస్థపై కరోనా వైరస్‌ తీవ్ర ప్రభావం చూపుతున్న నేపథ్యంలో ఆర్‌బీఐ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కీలక వడ్డీ రేట్లను భారీగా తగ్గించింది. రెపోరేటును 4.4 శాతానికి తగ్గించింది. 15 ఏళ్లలో ఇదే అత్యల్పం.  

వీటితో పాటు టెర్మ్​ లోన్స్​ నెలవారీ వాయిదాల చెల్లింపుపై 3 నెలల మారటోరియం విధించేందుకు బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలకు అనుమతి ఇచ్చింది.  

11:39 March 27

ఫ్లాట్​గా...

ఆర్​బీఐ గవర్నర్​ పలు కీలక ప్రకటనలు చేసిన తర్వాత మార్కెట్లు ఫ్లాట్​గా సాగుతున్నాయి. సెన్సెక్స్ 226 పాయింట్ల నష్టంతో 29 వేల 720 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 11 పాయింట్ల లాభంతో 8 వేల 652 వద్ద కొనసాగుతోంది.

10:45 March 27

తగ్గిన జోరు...

ఆర్​బీఐ గవర్నర్​ ప్రకటన తర్వాత మార్కెట్​ లాభాల జోరు తగ్గింది. సెన్సెక్స్ 118 పాయింట్లకుపైగా లాభంతో 30 వేల 65 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 124 పాయింట్ల లాభంతో 8 వేల 766 వద్ద కొనసాగుతోంది. 

10:22 March 27

ఆర్​బీఐ గవర్నర్​ ప్రకటన తర్వాత లాభాల జోరు కాస్త తగ్గింది. సెన్సెక్స్ 450 పాయింట్లకుపైగా లాభంతో 30 వేల 400 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 200 పాయింట్ల లాభంతో 8 వేల 850 వద్ద కొనసాగుతోంది. 

09:18 March 27

భరోసా ఇచ్చిన ప్యాకేజీ- భారీ లాభాల్లో మార్కెట్లు

స్టాక్​ మార్కెట్లు వరుసగా 4వ సెషన్​లో లాభాల్లో ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్​ 1000 పాయింట్లకుపైగా వృద్ధి చెంది 30 వేల 950 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ కూడా 370 పాయింట్ల లాభంతో 9 వేల 10 వద్ద ట్రేడవుతోంది.

కరోనా లాక్​డౌన్​ సమయంలో పేదలు, మధ్యతరగతి ప్రజలకు అండగా నిలిచేలా కేంద్రప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించడం మదుపర్ల సెంటిమెంటుపై సానుకూల ప్రభావం చూపడమే నేటి లాభాలకు ప్రధాన కారణం.

16:33 March 27

ఫ్లాట్​గా...

కరోనా ప్రభావంతో కుదేలవుతున్న ఆర్థిక వ్యవస్థను ఆదుకునేందుకు ఆర్​బీఐ వడ్డీ రేట్లను తగ్గించడం సహా కీలక నిర్ణయాలతో ముందుకొచ్చినప్పటికీ... వృద్ధిరేటు తగ్గుతుందనే భయాల మధ్య దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్​గా ముగిశాయి. 

బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ-సెన్సెక్స్ 131​ పాయింట్ల మేర నష్టపోయి 29,815  వద్ద ముగిసింది.

జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ- నిఫ్టీ 18 పాయింట్ల వృద్ధితో 8,660 వద్ద స్థిరపడింది.

కేంద్రం ప్రకటించిన రూ.1.70 లక్షల కోట్ల ఉద్దీపన పథకం అండతో గురువారం లాభాల్లో ముగిసిన సెన్సెక్స్‌.. శుక్రవారం నష్టాలతో ముగిసింది.  సామాన్యుడికి ఊరట కల్పిస్తూ ఆర్‌బీఐ ప్రకటించిన కొన్ని నిర్ణయాలు మదుపరులను మెప్పించలేకపోయాయి. రేట్ల కోత, మార్కెట్‌లోకి రూ.3.74 లక్షల కోట్లు చొప్పించేందుకు ఆర్‌బీఐ తీసుకున్న నిర్ణయాలు వారిని మెప్పించినా.. కొవిడ్‌-19 కారణంగా వృద్ధి రేటు అంచనాలను తగ్గించడం సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. ఒకానొక దశలో ట్రేడింగ్‌లో సుమారు 1700 పాయింట్ల లాభాల్లోకి వెళ్లిన సెన్సెక్స్‌ చివరికి నష్టాలతో ముగిసింది.

లాభాల్లో...

నిఫ్టీలో కోల్‌ ఇండియా, సిప్లా, యాక్సిస్‌ బ్యాంక్‌, ఐటీసీ షేర్లు లాభపడ్డాయి. బజాజ్‌ ఫైనాన్స్‌, హీరో మోటోకార్ప్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ షేర్లు నష్టాలు చవిచూశాయి.

రూపాయి...

డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.75.27గా ఉంది. 

15:31 March 27

ఫ్లాట్​గా...

కరోనా భయాల నడుమ ఆర్​బీఐ కీలక నిర్ణయాలతో అభయమిచ్చినప్పటికీ స్టాక్​ మార్కెట్లు ఫ్లాట్​గా ముగిశాయి. దేశంలో కొవిడ్​-19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మదుపరులు అప్రమత్తత పాటించారు. ఆరంభ లాభాల నుంచి మార్కెట్లు ఫ్లాట్​గా ముగించాయి. 

బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ-సెన్సెక్స్ 131​ పాయింట్ల మేర నష్టపోయి 29,815  వద్ద ముగిసింది.

జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ- నిఫ్టీ 18 పాయింట్ల వృద్ధితో 8,660 వద్ద స్థిరపడింది.

13:21 March 27

టాప్​ గేర్లో ఎస్ ​బ్యాంక్​...

రూ. 5,000 కోట్లు సమీకరించే ప్రతిపాదనకు రుణదాత డైరెక్టర్ల బోర్డు ఆమోదం తెలపడం వల్ల శుక్రవారం ఎస్​బ్యాంక్ షేర్లు 25 శాతం పెరిగాయి.

13:19 March 27

ఒక్క ప్రకటనతో...

కరోనా వల్ల​ వార్షిక జీడీపీ వృద్ధి రేటు గణనీయంగా తగ్గే ప్రమాదముందని ఆర్​బీఐ గవర్నర్​ శక్తికాంత దాస్​ ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన ఈ ప్రకటన చేసిన కాసేపటికే ఆరంభ లాభాల్ని కోల్పోయి నష్టాల్లోకి జారుకున్నాయి స్టాక్​మార్కెట్లు.

ఉదయం 11.30 గంటలకు 30 షేర్ల సూచీ సెన్సెక్స్​ 407 పాయింట్లు కోల్పోయి 29,539 వద్ద ఉంది. నిఫ్టీ 9 వేల మార్కును కోల్పోయింది. 71 పాయింట్లు క్షీణించి 8,569 వద్ద నిలిచింది.

నష్టాల్లో...

30 షేర్ల బీఎస్​ఈలో భారతీ ఎయిర్​టెల్ భారీగా నష్టపోయింది. ​సంస్థ షేర్లు 6 శాతం నష్టపోయాయి. హెచ్​సీఎల్​ టెక్​, హీరో మోటోకార్ప్​, మారుతీ, ఏషియన్​ పెయింట్స్​, బజాజ్​ ఆటో నష్టాల బాట పట్టాయి.

లాభాల్లో...

యాక్సిస్​ బ్యాంక్​, ఇండస్​ఇండ్​ బ్యాంక్​, ఎన్​టీపీసీ, ఐసీఐసీఐ బ్యాంక్​, పవర్​గ్రిడ్​ లాభాల్లో ఉన్నాయి.

వడ్డీ రేట్లు భారీగా తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నప్పటికీ వార్షిక వృద్ధి రేటుపై ఆర్​బీఐ గవర్నర్​ ఆందోళన చెందడం మార్కెట్​ను నష్టాల్లోకి నెట్టాయని నిపుణులు అభిప్రాయపడ్డారు.

రూపాయి...

ఇంట్రాడేలో యూఎస్​ డాలర్​తో పోలిస్తే రూపాయి విలువ 81 పైసలు పెరిగి రూ.74.35 వద్ద ఉంది.

కీలక నిర్ణయాలు...

దేశ ఆర్థిక వ్యవస్థపై కరోనా వైరస్‌ తీవ్ర ప్రభావం చూపుతున్న నేపథ్యంలో ఆర్‌బీఐ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కీలక వడ్డీ రేట్లను భారీగా తగ్గించింది. రెపోరేటును 4.4 శాతానికి తగ్గించింది. 15 ఏళ్లలో ఇదే అత్యల్పం.  

వీటితో పాటు టెర్మ్​ లోన్స్​ నెలవారీ వాయిదాల చెల్లింపుపై 3 నెలల మారటోరియం విధించేందుకు బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలకు అనుమతి ఇచ్చింది.  

11:39 March 27

ఫ్లాట్​గా...

ఆర్​బీఐ గవర్నర్​ పలు కీలక ప్రకటనలు చేసిన తర్వాత మార్కెట్లు ఫ్లాట్​గా సాగుతున్నాయి. సెన్సెక్స్ 226 పాయింట్ల నష్టంతో 29 వేల 720 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 11 పాయింట్ల లాభంతో 8 వేల 652 వద్ద కొనసాగుతోంది.

10:45 March 27

తగ్గిన జోరు...

ఆర్​బీఐ గవర్నర్​ ప్రకటన తర్వాత మార్కెట్​ లాభాల జోరు తగ్గింది. సెన్సెక్స్ 118 పాయింట్లకుపైగా లాభంతో 30 వేల 65 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 124 పాయింట్ల లాభంతో 8 వేల 766 వద్ద కొనసాగుతోంది. 

10:22 March 27

ఆర్​బీఐ గవర్నర్​ ప్రకటన తర్వాత లాభాల జోరు కాస్త తగ్గింది. సెన్సెక్స్ 450 పాయింట్లకుపైగా లాభంతో 30 వేల 400 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 200 పాయింట్ల లాభంతో 8 వేల 850 వద్ద కొనసాగుతోంది. 

09:18 March 27

భరోసా ఇచ్చిన ప్యాకేజీ- భారీ లాభాల్లో మార్కెట్లు

స్టాక్​ మార్కెట్లు వరుసగా 4వ సెషన్​లో లాభాల్లో ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్​ 1000 పాయింట్లకుపైగా వృద్ధి చెంది 30 వేల 950 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ కూడా 370 పాయింట్ల లాభంతో 9 వేల 10 వద్ద ట్రేడవుతోంది.

కరోనా లాక్​డౌన్​ సమయంలో పేదలు, మధ్యతరగతి ప్రజలకు అండగా నిలిచేలా కేంద్రప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించడం మదుపర్ల సెంటిమెంటుపై సానుకూల ప్రభావం చూపడమే నేటి లాభాలకు ప్రధాన కారణం.

Last Updated : Mar 27, 2020, 4:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.