ETV Bharat / business

సెన్సెక్స్ 383 ప్లస్​- 15,700కి చేరువలో నిఫ్టీ - షేర్ మార్కెట్ అప్​డేట్స్

స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. గురువారం సెషన్​లో సెన్సెక్స్ (Sensex Today) 383 పాయింట్లు పెరిగి.. 52,200 మార్క్ దాటింది. నిఫ్టీ (Nifty Today) 114 పాయింట్లు బలపడి.. 15,700లకు చేరువైంది. ఆర్థిక, లోహ రంగాలు లాభాలకు దన్నుగా నిలిచాయి.

Share market new Telugu
స్టాక్స్​ అప్​డేట్స్
author img

By

Published : Jun 3, 2021, 3:45 PM IST

స్టాక్ మార్కెట్లు గురువారం లాభాలతో ముగిశాయి. బీఎస్​ఈ- సెన్సెక్స్ (Sensex today) 383 పాయింట్లు పెరిగి 52,232 వద్ద స్థిరపడింది. ఎన్​ఎస్​ఈ-నిఫ్టీ (Nifty today) 114 పాయింట్ల లాభంతో 15,690 వద్దకు చేరింది.

ఆర్​బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ సమీక్ష నిర్ణయాలు శుక్రవారం వెల్లడికానున్న నేపథ్యంలో సానుకూలతలు పెరిగినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. దీనికి తోడు దేశంలో వ్యాక్సినేషన్​ విషయంలో పురోగతి మార్కెట్లకు ఊతమందించినట్లు వివరిస్తున్నారు.

రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి హెవీ వెయిట్​ షేర్లు, ఆర్థిక, లోహ రంగాలు కూడా లాభాలకు దన్నుగా నిలిచినట్లు తెలుస్తోంది.

ఇంట్రాడే సాగిందిలా..

సెన్సెక్స్ 52,273 పాయింట్ల అత్యధిక స్థాయి, 51,942 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.

నిఫ్టీ 15,705 పాయింట్ల గరిష్ఠ స్థాయి, 15,394 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.

లాభనష్టాల్లోనివి ఇవే..

టైటాన్​, ఓఎన్​జీసీ, ఎల్​&టీ, యాక్సిస్​ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు లాభాలను గడించాయి.

ఇండస్​ఇండ్ బ్యాంక్, బజాజ్ ఆటో, వవర్​గ్రిడ్​, హెచ్​సీఎల్​టెక్​, పవర్​గ్రిడ్​ షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి.

ఇతర మార్కెట్లు

ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లలో నిక్కీ, కోస్పీ సూచీలు లాభాలతో ముగిశాయి. షాంఘై, హాంగ్​సెంగ్​ సూచీలు నష్టాలను నమోదు చేశాయి.

ఇదీ చదవండి:రూ.14 లక్షల కోట్లపైకి రిలయన్స్ ఎం-క్యాప్​

స్టాక్ మార్కెట్లు గురువారం లాభాలతో ముగిశాయి. బీఎస్​ఈ- సెన్సెక్స్ (Sensex today) 383 పాయింట్లు పెరిగి 52,232 వద్ద స్థిరపడింది. ఎన్​ఎస్​ఈ-నిఫ్టీ (Nifty today) 114 పాయింట్ల లాభంతో 15,690 వద్దకు చేరింది.

ఆర్​బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ సమీక్ష నిర్ణయాలు శుక్రవారం వెల్లడికానున్న నేపథ్యంలో సానుకూలతలు పెరిగినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. దీనికి తోడు దేశంలో వ్యాక్సినేషన్​ విషయంలో పురోగతి మార్కెట్లకు ఊతమందించినట్లు వివరిస్తున్నారు.

రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి హెవీ వెయిట్​ షేర్లు, ఆర్థిక, లోహ రంగాలు కూడా లాభాలకు దన్నుగా నిలిచినట్లు తెలుస్తోంది.

ఇంట్రాడే సాగిందిలా..

సెన్సెక్స్ 52,273 పాయింట్ల అత్యధిక స్థాయి, 51,942 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.

నిఫ్టీ 15,705 పాయింట్ల గరిష్ఠ స్థాయి, 15,394 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.

లాభనష్టాల్లోనివి ఇవే..

టైటాన్​, ఓఎన్​జీసీ, ఎల్​&టీ, యాక్సిస్​ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు లాభాలను గడించాయి.

ఇండస్​ఇండ్ బ్యాంక్, బజాజ్ ఆటో, వవర్​గ్రిడ్​, హెచ్​సీఎల్​టెక్​, పవర్​గ్రిడ్​ షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి.

ఇతర మార్కెట్లు

ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లలో నిక్కీ, కోస్పీ సూచీలు లాభాలతో ముగిశాయి. షాంఘై, హాంగ్​సెంగ్​ సూచీలు నష్టాలను నమోదు చేశాయి.

ఇదీ చదవండి:రూ.14 లక్షల కోట్లపైకి రిలయన్స్ ఎం-క్యాప్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.