ETV Bharat / business

నమస్తే ట్రంప్: ఆతిథ్యం సరే.. మరి ఒప్పందాల మాటేంటి?

author img

By

Published : Feb 23, 2020, 6:16 PM IST

Updated : Mar 2, 2020, 7:50 AM IST

యావత్​ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అగ్రరాజ్య అధ్యక్షుడి భారత పర్యటనకు సోమవారం తెరలేవనుంది. శ్వేతసౌధాధిపతికి ఘన స్వాగతం పలికేందుకు దిల్లీ, అహ్మదాబాద్‌, ఆగ్రా ఇప్పటికే ముస్తాబయ్యాయి. ఆతిథ్యం విషయం పక్కన పడితే ఇరుదేశాల మధ్య జరగాల్సి ఒప్పందాలు చాలానే ఉన్నాయి. అవేంటో చూద్దాం.

DEALS BETWEEN INDIA AND AMERICA
నమస్తే ట్రంప్: ఆతిథ్యం సరే.. మరి ఒప్పందాల మాటేంటి?

వివిధ అంతర్జాతీయ వేదికలపై భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సమావేశమైనప్పుడు పరస్పరం ప్రశంసించుకోవడం గతంలో అనేక సందర్భాల్లో చూశాం. ప్రపంచంలో రెండు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాల మధ్య పెనవేసుకుంటున్న బలమైన అనుబంధానికి ఇది ఓ నిదర్శనం.

భారత్​లో రెండురోజుల ట్రంప్‌ పర్యటన ఇరుదేశాల మధ్య వ్యూహాత్మక అనుబంధాన్ని మరింత బలోపేతం చేయనుంది. అదే సమయంలో రక్షణ, అంతరిక్షం సహా పలు రంగాల్లో కీలక ద్వైపాక్షిక ఒప్పందాలు కుదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఇరుదేశాల మధ్య ఏటా 12 వేలకోట్ల డాలర్ల విలువైన వాణిజ్యం జరుగుతోంది.

కీలక ఒప్పందాలేంటి..?

డొనాల్డ్‌ ట్రంప్‌ ఒక దేశాధ్యక్షుడు మాత్రమే కాదు... స్వయంగా అతిపెద్ద వ్యాపార వేత్త. భారత్‌లో ఆయన భారీ పెట్టుబడులు పెట్టారు. అందుకే ఉత్పత్తుల నాణ్యతా ప్రమాణాలు, మేధో సంపత్తి హక్కులు వంటి కొన్ని అంశాలను మినహాయిస్తే ఇరు దేశాల మధ్య వాణిజ్యానుబంధం చెప్పుకోదగిన విధంగానే ఉంది.

ఈ బంధాన్ని మరింత బలోపేతం చేస్తూ... ట్రంప్​ పర్యటన సందర్భంగా భారత్​-అమెరికా ఇంకెలాంటి ఒప్పందాలు కుదుర్చుకుంటాయన్నదే అసలు ప్రశ్న.

రక్షణ కొనుగోళ్లకు సై

ఆకాశ మార్గంలో శత్రువులు చేసే దాడులను తిప్పికొట్టడంలో దోహదపడగల 'సమీకృత గగనతల రక్షణ ఆయుధ వ్యవస్థ(ఐఏడీడబ్ల్యూఎస్‌)'ను భారత్‌కు విక్రయించేందుకు అమెరికా ఇటీవలే సమ్మతించింది. 186 కోట్ల డాలర్ల విలువైన ఈ ఒప్పందానికి సంబంధించిన దస్త్రాలపై ట్రంప్‌ పర్యటనలో ఇరుదేశాలు సంతకాలు చేసే అవకాశాలున్నాయి.

అమెరికా సంస్థ 'లాక్‌హీడ్‌ మార్టిన్‌' నుంచి నౌకాదళం కోసం 24 బహుళ ప్రయోజనకర 'ఎంహెచ్‌-60ఆర్‌' సీహాక్‌ హెలికాప్టర్లను కొనుగోలు చేసే ఒప్పందం కూడా ఖరారయ్యే అవకాశముంది. ఈ ఒప్పందం విలువ సుమారు 260 కోట్ల డాలర్లు ఉంటుందని అంచనా.

అమెరికా రక్షణ రంగానికి చెందిన మరో కీలక సంస్థ 'బోయింగ్‌' భారత వైమానిక దళానికి తమ 'ఎఫ్‌-15ఈఎక్స్‌ ఈగల్‌' యుద్ధ విమానాలను విక్రయించాలని భావిస్తోంది. వాటి ఎగుమతికి అనుమతులు మంజూరు చేయాలని అధికార వర్గాలను బోయింగ్‌ తాజాగా కోరింది. ఈ అంశం కూడా ట్రంప్‌ పర్యటనలో ఇరుదేశాల మధ్య చర్చకు వచ్చే అవకాశముంది.

వాణిజ్య ఒప్పందం లేనట్లే!

వాణిజ్యం, సుంకాల విషయంలో భారత్‌, అమెరికా మధ్య కొంతకాలంగా భేదాభిప్రాయాలు కొనసాగుతున్నాయి. అమెరికా ఉత్పత్తులపై భారత్‌ దిమ్మతిరిగిపోయేలా సుంకాలు వేస్తోందని, వాటిని తగ్గించాలని ఆ దేశం డిమాండ్‌ చేస్తోంది.

ట్రంప్​ మనసులో ఏముంది?

ఇప్పటికే ఎన్నోసార్లు భారత్‌ను సుంకాల రారాజుగా అభివర్ణించారు ట్రంప్. మరోసారి ఇటీవల అదే తరహా వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలోనే అత్యధిక సుంకాలు విధిస్తున్న దేశాల్లో భారత్ ఒకటని ఆరోపించారు.

వాణిజ్య ఒప్పందం ఇప్పుడు ఉండకపోవచ్చని విస్పష్ట సంకేతాలు ఇచ్చారు ట్రంప్. ఒప్పందం భారీ స్థాయిలో ఉంటుందని, అయితే అది అమెరికా అధ్యక్ష ఎన్నికల ముందా, తర్వాతా చెప్పలేమని వ్యాఖ్యానించారు.

ప్యాకేజీ అయినా ఉంటుందా?

డొనాల్డ్​ ట్రంప్​ భారత్​ పర్యటన నేపథ్యంలో వాణిజ్య ఒప్పందంపై దేశం భారీ ఆశలు పెట్టుకుంది. అయితే ప్రస్తుతానికి ఒప్పందానికి బదులు వాణిజ్య ప్యాకేజీతోనే భారత్​ సరిపెట్టుకోవాల్సి ఉంటుందని నిపుణులు అంచనా.

వివిధ అంతర్జాతీయ వేదికలపై భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సమావేశమైనప్పుడు పరస్పరం ప్రశంసించుకోవడం గతంలో అనేక సందర్భాల్లో చూశాం. ప్రపంచంలో రెండు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాల మధ్య పెనవేసుకుంటున్న బలమైన అనుబంధానికి ఇది ఓ నిదర్శనం.

భారత్​లో రెండురోజుల ట్రంప్‌ పర్యటన ఇరుదేశాల మధ్య వ్యూహాత్మక అనుబంధాన్ని మరింత బలోపేతం చేయనుంది. అదే సమయంలో రక్షణ, అంతరిక్షం సహా పలు రంగాల్లో కీలక ద్వైపాక్షిక ఒప్పందాలు కుదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఇరుదేశాల మధ్య ఏటా 12 వేలకోట్ల డాలర్ల విలువైన వాణిజ్యం జరుగుతోంది.

కీలక ఒప్పందాలేంటి..?

డొనాల్డ్‌ ట్రంప్‌ ఒక దేశాధ్యక్షుడు మాత్రమే కాదు... స్వయంగా అతిపెద్ద వ్యాపార వేత్త. భారత్‌లో ఆయన భారీ పెట్టుబడులు పెట్టారు. అందుకే ఉత్పత్తుల నాణ్యతా ప్రమాణాలు, మేధో సంపత్తి హక్కులు వంటి కొన్ని అంశాలను మినహాయిస్తే ఇరు దేశాల మధ్య వాణిజ్యానుబంధం చెప్పుకోదగిన విధంగానే ఉంది.

ఈ బంధాన్ని మరింత బలోపేతం చేస్తూ... ట్రంప్​ పర్యటన సందర్భంగా భారత్​-అమెరికా ఇంకెలాంటి ఒప్పందాలు కుదుర్చుకుంటాయన్నదే అసలు ప్రశ్న.

రక్షణ కొనుగోళ్లకు సై

ఆకాశ మార్గంలో శత్రువులు చేసే దాడులను తిప్పికొట్టడంలో దోహదపడగల 'సమీకృత గగనతల రక్షణ ఆయుధ వ్యవస్థ(ఐఏడీడబ్ల్యూఎస్‌)'ను భారత్‌కు విక్రయించేందుకు అమెరికా ఇటీవలే సమ్మతించింది. 186 కోట్ల డాలర్ల విలువైన ఈ ఒప్పందానికి సంబంధించిన దస్త్రాలపై ట్రంప్‌ పర్యటనలో ఇరుదేశాలు సంతకాలు చేసే అవకాశాలున్నాయి.

అమెరికా సంస్థ 'లాక్‌హీడ్‌ మార్టిన్‌' నుంచి నౌకాదళం కోసం 24 బహుళ ప్రయోజనకర 'ఎంహెచ్‌-60ఆర్‌' సీహాక్‌ హెలికాప్టర్లను కొనుగోలు చేసే ఒప్పందం కూడా ఖరారయ్యే అవకాశముంది. ఈ ఒప్పందం విలువ సుమారు 260 కోట్ల డాలర్లు ఉంటుందని అంచనా.

అమెరికా రక్షణ రంగానికి చెందిన మరో కీలక సంస్థ 'బోయింగ్‌' భారత వైమానిక దళానికి తమ 'ఎఫ్‌-15ఈఎక్స్‌ ఈగల్‌' యుద్ధ విమానాలను విక్రయించాలని భావిస్తోంది. వాటి ఎగుమతికి అనుమతులు మంజూరు చేయాలని అధికార వర్గాలను బోయింగ్‌ తాజాగా కోరింది. ఈ అంశం కూడా ట్రంప్‌ పర్యటనలో ఇరుదేశాల మధ్య చర్చకు వచ్చే అవకాశముంది.

వాణిజ్య ఒప్పందం లేనట్లే!

వాణిజ్యం, సుంకాల విషయంలో భారత్‌, అమెరికా మధ్య కొంతకాలంగా భేదాభిప్రాయాలు కొనసాగుతున్నాయి. అమెరికా ఉత్పత్తులపై భారత్‌ దిమ్మతిరిగిపోయేలా సుంకాలు వేస్తోందని, వాటిని తగ్గించాలని ఆ దేశం డిమాండ్‌ చేస్తోంది.

ట్రంప్​ మనసులో ఏముంది?

ఇప్పటికే ఎన్నోసార్లు భారత్‌ను సుంకాల రారాజుగా అభివర్ణించారు ట్రంప్. మరోసారి ఇటీవల అదే తరహా వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలోనే అత్యధిక సుంకాలు విధిస్తున్న దేశాల్లో భారత్ ఒకటని ఆరోపించారు.

వాణిజ్య ఒప్పందం ఇప్పుడు ఉండకపోవచ్చని విస్పష్ట సంకేతాలు ఇచ్చారు ట్రంప్. ఒప్పందం భారీ స్థాయిలో ఉంటుందని, అయితే అది అమెరికా అధ్యక్ష ఎన్నికల ముందా, తర్వాతా చెప్పలేమని వ్యాఖ్యానించారు.

ప్యాకేజీ అయినా ఉంటుందా?

డొనాల్డ్​ ట్రంప్​ భారత్​ పర్యటన నేపథ్యంలో వాణిజ్య ఒప్పందంపై దేశం భారీ ఆశలు పెట్టుకుంది. అయితే ప్రస్తుతానికి ఒప్పందానికి బదులు వాణిజ్య ప్యాకేజీతోనే భారత్​ సరిపెట్టుకోవాల్సి ఉంటుందని నిపుణులు అంచనా.

Last Updated : Mar 2, 2020, 7:50 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.