ETV Bharat / business

ఆ రాష్ట్రాల ఆందోళనల మధ్య జీఎస్టీ మండలి భేటీ!

author img

By

Published : Oct 4, 2020, 2:43 PM IST

అక్టోబర్​ 5న(సోమవారం) వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) మండలి 42వ సమావేశం జరగనుంది. అయితే.. జీఎస్టీ పరిహారంపై కేంద్ర ప్రభుత్వంతో విభేదిస్తున్న రాష్ట్రాలు ఈ సమావేశంలో తమ నిరసన తెలిపే అవకాశం ఉంది. ఈ క్రమంలో భేటీ రసాబాసగా మారే అవకాశం లేకపోలేదు.

GST Council meet
జీఎస్టీ మండలి

వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) మండలి సోమవారం సమావేశం కానుంది. అయితే.. రాష్ట్రాలకు ఇవ్వాల్సిన జీఎస్టీ పరిహారంపై కేంద్ర ప్రభుత్వంతో భాజపాయేతర రాష్ట్రాలు విభేదిస్తున్న నేపథ్యంలో ఈ సమావేశం వాడీవేడిగా సాగనుంది.

దేశంలోని భాజపా పాలిత 21 రాష్ట్రాలు.. పరిహారంపై కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనకు అంగీకరించాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీఎస్టీ ఆదాయ లోటును తీర్చుకునేందుకు రూ.97 వేల కోట్లు అప్పుగా తీసుకునేందుకు సమ్మతించాయి. కానీ, బంగాల్​, పంజాబ్​, కేరళ వంటి భాజపాయేతర పార్టీల నేతృత్వంలోని రాష్ట్రాలు అందుకు అంగీకరించటం లేదు.

అక్టోబర్​ 5న జరిగే 42వ జీఎస్టీ మండలి సమావేశంలో విపక్షాల నేతృత్వంలోని రాష్ట్రాలు.. కేంద్రం ప్రతిపాదనపై అభ్యంతరం తెలిపే అవకాశం ఉందని అధికారవర్గాలు తెలిపాయి. ప్రత్యామ్నాయ మార్గాలను సూచించాలని డిమాండ్​ చేయొచ్చని పేర్కొన్నాయి.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రాలు రూ.2.35 లక్షల కోట్ల మేర జీఎస్టీ ఆదాయ లోటును ఎదుర్కొంటున్నాయి. అయితే.. కేంద్ర ప్రభుత్వం లెక్కల ప్రకారం రూ.97వేల కోట్లు జీఎస్టీ అమలు వల్ల లోటుగా పరిగణించగా.. మిగతా రూ.1.38 లక్షల కోట్లు కరోనా మహమ్మారి ప్రభావంతో నష్టపోయినట్లు పేర్కొంది. ఈ క్రమంలో రాష్ట్రాలకు కేంద్రం రెండు ప్రతిపాదనలు చేసింది. ఆర్బీఐ కల్పించే ప్రత్యేక విండో ద్వారా రూ.97 వేల కోట్లను రుణంగా తీసుకోవటం లేదా.. మొత్తం రూ.2.35 కోట్లను మార్కెట్​ నుంచి సేకరించుకోవచ్చని సూచించింది.

ఇదీ చూడండి: దారి తప్పిన పన్ను 'పరిహారం'.. ప్రభుత్వాల మధ్య అంతరం

వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) మండలి సోమవారం సమావేశం కానుంది. అయితే.. రాష్ట్రాలకు ఇవ్వాల్సిన జీఎస్టీ పరిహారంపై కేంద్ర ప్రభుత్వంతో భాజపాయేతర రాష్ట్రాలు విభేదిస్తున్న నేపథ్యంలో ఈ సమావేశం వాడీవేడిగా సాగనుంది.

దేశంలోని భాజపా పాలిత 21 రాష్ట్రాలు.. పరిహారంపై కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనకు అంగీకరించాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీఎస్టీ ఆదాయ లోటును తీర్చుకునేందుకు రూ.97 వేల కోట్లు అప్పుగా తీసుకునేందుకు సమ్మతించాయి. కానీ, బంగాల్​, పంజాబ్​, కేరళ వంటి భాజపాయేతర పార్టీల నేతృత్వంలోని రాష్ట్రాలు అందుకు అంగీకరించటం లేదు.

అక్టోబర్​ 5న జరిగే 42వ జీఎస్టీ మండలి సమావేశంలో విపక్షాల నేతృత్వంలోని రాష్ట్రాలు.. కేంద్రం ప్రతిపాదనపై అభ్యంతరం తెలిపే అవకాశం ఉందని అధికారవర్గాలు తెలిపాయి. ప్రత్యామ్నాయ మార్గాలను సూచించాలని డిమాండ్​ చేయొచ్చని పేర్కొన్నాయి.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రాలు రూ.2.35 లక్షల కోట్ల మేర జీఎస్టీ ఆదాయ లోటును ఎదుర్కొంటున్నాయి. అయితే.. కేంద్ర ప్రభుత్వం లెక్కల ప్రకారం రూ.97వేల కోట్లు జీఎస్టీ అమలు వల్ల లోటుగా పరిగణించగా.. మిగతా రూ.1.38 లక్షల కోట్లు కరోనా మహమ్మారి ప్రభావంతో నష్టపోయినట్లు పేర్కొంది. ఈ క్రమంలో రాష్ట్రాలకు కేంద్రం రెండు ప్రతిపాదనలు చేసింది. ఆర్బీఐ కల్పించే ప్రత్యేక విండో ద్వారా రూ.97 వేల కోట్లను రుణంగా తీసుకోవటం లేదా.. మొత్తం రూ.2.35 కోట్లను మార్కెట్​ నుంచి సేకరించుకోవచ్చని సూచించింది.

ఇదీ చూడండి: దారి తప్పిన పన్ను 'పరిహారం'.. ప్రభుత్వాల మధ్య అంతరం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.