ETV Bharat / business

చక్రవడ్డీ మాఫీపై సందేహాలకు ఆర్థిక శాఖ స్పష్టత

మారటోరియం కాలానికి రూ.2 కోట్ల లోపు రుణాలపై చక్రవడ్డీ మాఫీ చేస్తూ ప్రకటించిన పథకంపై మరింత స్పష్టతనిచ్చింది ఆర్థిక శాఖ. ఈ పథకంపై రుణగ్రహీతల్లో నెలకొన్న సందేహాలను తీర్చేందుకు తరచూ అడిగే ప్రశ్నల జాబితాను విడుదల చేసింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

author img

By

Published : Oct 28, 2020, 5:52 PM IST

centre clarify on interest waiving on loans
చక్రవడ్డీ మాఫీపై కేంద్రం మరింత స్పష్టత

కరోనా నేపథ్యంలో రుణాలపై విధించిన మారటోరియం కాలానికి వడ్డీపై వడ్డీ మాఫీ చేస్తూ ఆర్థిక శాఖ ఇటీవల ప్రకటన చేసింది. ఈ చక్రవడ్డీ మాఫీ పథకానికి సంబంధించి రుణగ్రహీతల్లో ఉన్న సందేహాలను నివృత్తి చేయాలని ఆర్థిక శాఖ నిర్ణయించింది. తరచూ అడిగిగన ప్రశ్నల (ఎఫ్​ఏక్యూ)ను విడుదల చేసింది.

అందులో ఈ ఏడాది ఫిబ్రవరి 29 నాటి లోన్ ఔట్​స్టాండింగ్​ను.. సాధారణ వడ్డీ, వడ్డీపై వడ్డీ మధ్య తేడా నగదును లెక్కించేందుకు రిఫరెన్స్​గా తీసుకోనున్నట్లు తెలిపింది.

రుణగ్రహీతలు ఎలాంటి దరఖాస్తు చేసుకోకుండానే మాఫీ అయిన చక్రవడ్డీ వారి ఖాతాల్లో జమ అవుతుందని ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. మారటోరియం అవకాశాన్ని వినియోగించుకోకుండా.. రుణాల ఈఎంఐలు చెల్లించిన వారికీ చక్రవడ్డీ మాఫీ పథకం వర్తిస్తుందని పేర్కొంది.

సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ ఈ నెల 23న.. మారటోరియం కాలనికి చక్రవడ్డీ మాఫీ చేస్తున్నట్లు ప్రకటించింది. రూ.2 కోట్లలోపు రుణాలకు ఈ పథకం వర్తిస్తుందని పేర్కొంది.

కేంద్రం ప్రకటించిన ఈ పథకాన్ని.. కచ్చితంగా అమలు చేయాలని ఆర్​బీఐ.. బ్యాంకులు, ఎన్​బీఎఫ్​సీలను మంగళవారం ఆదేశించింది. కేంద్రం విధించిన గడువులోపు (నవంబర్ 5 లోపు) బ్యాంకులు రుణ గ్రహీతల ఖాతాల్లో మాఫీ చేసిన చక్రవడ్డీని జమ చేయాలని సూచించింది.

కరోనా నేపథ్యంలో రుణాలపై విధించిన మారటోరియం కాలానికి వడ్డీపై వడ్డీ మాఫీ చేస్తూ ఆర్థిక శాఖ ఇటీవల ప్రకటన చేసింది. ఈ చక్రవడ్డీ మాఫీ పథకానికి సంబంధించి రుణగ్రహీతల్లో ఉన్న సందేహాలను నివృత్తి చేయాలని ఆర్థిక శాఖ నిర్ణయించింది. తరచూ అడిగిగన ప్రశ్నల (ఎఫ్​ఏక్యూ)ను విడుదల చేసింది.

అందులో ఈ ఏడాది ఫిబ్రవరి 29 నాటి లోన్ ఔట్​స్టాండింగ్​ను.. సాధారణ వడ్డీ, వడ్డీపై వడ్డీ మధ్య తేడా నగదును లెక్కించేందుకు రిఫరెన్స్​గా తీసుకోనున్నట్లు తెలిపింది.

రుణగ్రహీతలు ఎలాంటి దరఖాస్తు చేసుకోకుండానే మాఫీ అయిన చక్రవడ్డీ వారి ఖాతాల్లో జమ అవుతుందని ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. మారటోరియం అవకాశాన్ని వినియోగించుకోకుండా.. రుణాల ఈఎంఐలు చెల్లించిన వారికీ చక్రవడ్డీ మాఫీ పథకం వర్తిస్తుందని పేర్కొంది.

సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ ఈ నెల 23న.. మారటోరియం కాలనికి చక్రవడ్డీ మాఫీ చేస్తున్నట్లు ప్రకటించింది. రూ.2 కోట్లలోపు రుణాలకు ఈ పథకం వర్తిస్తుందని పేర్కొంది.

కేంద్రం ప్రకటించిన ఈ పథకాన్ని.. కచ్చితంగా అమలు చేయాలని ఆర్​బీఐ.. బ్యాంకులు, ఎన్​బీఎఫ్​సీలను మంగళవారం ఆదేశించింది. కేంద్రం విధించిన గడువులోపు (నవంబర్ 5 లోపు) బ్యాంకులు రుణ గ్రహీతల ఖాతాల్లో మాఫీ చేసిన చక్రవడ్డీని జమ చేయాలని సూచించింది.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.