ETV Bharat / business

ఎల్​టీసీ క్యాష్ ఓచర్​పై కేంద్రం మరింత స్పష్టత

author img

By

Published : Nov 11, 2020, 4:33 PM IST

కరోనా సంక్షోభం నేపథ్యంలో వినియోగం పెంచేందుకు ప్రకటించిన ఎల్​టీసీ క్యాష్​ ఓచర్ పథకంపై నెలకొన్న సందేహాలకు కేంద్రం సమాధానం ఇచ్చింది. ఉద్యోగి జీవిత భాగస్వామి, ఇతర కుటుంబ సభ్యుల పేరిట జరిపే కొనుగోళ్లకు ఈ పథకం వర్తిస్తుందా లేదా అన్నదానికి స్పష్టమైన వివరణ ఇచ్చింది.

Cash Voucher Scheme full details
క్యాష్ ఓచర్​ పథకంపై కేంద్రం మరింత క్లారిటీ

ఎల్​టీసీ క్యాష్ ఓచర్ పథకానికి సంబంధించి ఉద్యోగుల్లో నెలకొన్న మరిన్ని సందేహాలకు సమాధానమిచ్చింది కేంద్ర ఆర్థిక శాఖ. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు తమ జీవిత భాగస్వామి సహా ఎల్​టీసీ ఫేర్​కు అర్హత ఉన్న ఇతర కుటుంబ సభ్యుల పేరిట వస్తు, సేవల కొనుగోలు జరిపి క్యాష్ ఓచర్​ను క్లెయిమ్ చేసుకునే వీలుందని వెల్లడించింది.

అయితే అక్టోబర్ 12 తర్వాతి నుంచి వచ్చే ఏడాది మర్చి 31లోపు జరిపిన కొనుగోళ్లకు మత్రమే ఈ పథకం వర్తిస్తుందని మరోసారి స్పష్టం చేసింది ఆర్థికశాఖ పరిధిలోని వ్యయాల విభాగం. అక్టోబర్​ 12 తర్వాత ఈఎంఐ సదుపాయంతో జరిపిన కొనుగోళ్లకూ ఈ పథకం వర్తిస్తుందని తాజా వివరణలో పేర్కొంది . ఇందుకు జీఎస్​టీ ఇన్​వాయిస్​ కూడా అవసరమవుతుందని తెలిపింది.

ఎల్​టీసీ క్యాష్ ఓచర్ పథకానికి సంబంధించి ఉద్యోగుల్లో నెలకొన్న మరిన్ని సందేహాలకు సమాధానమిచ్చింది కేంద్ర ఆర్థిక శాఖ. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు తమ జీవిత భాగస్వామి సహా ఎల్​టీసీ ఫేర్​కు అర్హత ఉన్న ఇతర కుటుంబ సభ్యుల పేరిట వస్తు, సేవల కొనుగోలు జరిపి క్యాష్ ఓచర్​ను క్లెయిమ్ చేసుకునే వీలుందని వెల్లడించింది.

అయితే అక్టోబర్ 12 తర్వాతి నుంచి వచ్చే ఏడాది మర్చి 31లోపు జరిపిన కొనుగోళ్లకు మత్రమే ఈ పథకం వర్తిస్తుందని మరోసారి స్పష్టం చేసింది ఆర్థికశాఖ పరిధిలోని వ్యయాల విభాగం. అక్టోబర్​ 12 తర్వాత ఈఎంఐ సదుపాయంతో జరిపిన కొనుగోళ్లకూ ఈ పథకం వర్తిస్తుందని తాజా వివరణలో పేర్కొంది . ఇందుకు జీఎస్​టీ ఇన్​వాయిస్​ కూడా అవసరమవుతుందని తెలిపింది.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.