ETV Bharat / business

'పెట్రోల్​పై రూ.8.5 ఎక్సైజ్​ సుంకం తగ్గించొచ్చు'

author img

By

Published : Mar 3, 2021, 6:44 PM IST

దేశంలో చమురు ధరలు భగ్గుమంటున్న నేపథ్యంలో.. ప్రభుత్వం ఎక్సైజ్​ సుంకాన్ని తగ్గించే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. లీటరు పెట్రోల్​, డీజిల్​పై రూ. 8.5 ఎక్సైజ్​ సుంకాన్ని తగ్గించినా ప్రభుత్వం అంచనా వేసిన ఆదాయం వస్తుందని చెబుతున్నారు.

Govt can cut excise duty on petrol and diesel by Rs 8.5 a litre
'చమురు ధరపై రూ.8.5 ఎక్సైజ్​ సుంకం తగ్గింపే సబబు'

దేశంలో చమురు ధరలు ఆకాశాన్నంటాయి. ఈ నేపథ్యంలో పెట్రోల్​, డీజిల్​పై ఎక్సైజ్​ సుంకం రూ. 8.5 వరకు తగ్గించే అవకాశం ప్రభుత్వం చేతుల్లో ఉందని నిపుణులు చెబుతున్నారు. సుంకం తగ్గించినా చమురుపై విధించే పన్ను ద్వారా వచ్చే ఆదాయాలపై ప్రభావం ఉండబోదని అంటున్నారు.

"ఎక్సైజ్​ సుంకాలను తగ్గించకపోతే.. 2022 ఆర్థిక సంవత్సరంలో(ఏప్రిల్​ 2021-మార్చి 2022) ప్రభుత్వ ఆదాయం రూ.4.35 లక్షల కోట్లుగా ఉంటుంది. ఇది ప్రభుత్వం 2021 బడ్జెట్లో అంచనా వేసిన రూ. 3.2 లక్షల కోట్ల ఆదాయం కన్నా ఎక్కువ. ఒకవేళ 2021 ఏప్రిల్​ 1 లోగా లీటరు పెట్రోల్​, డీజిల్​పై రూ. 8.5 ఎక్సైజ్​ సుంకాన్ని తగ్గించినా.. ప్రభుత్వం అంచనా వేసిన ఆదాయం వస్తుంది" అని ఐసీఐసీఐ సెక్యూరిటీస్​ పేర్కొంది.

2020 మార్చి-మే మధ్యలో లీటరు పెట్రోల్​పై రూ. 13, లీటరు డీజిల్​పై రూ. 16 చొప్పున ఎక్సైజ్​ సుంకాన్ని పెంచింది కేంద్రం. ప్రస్తుతం లీటరు పెట్రోల్​పై రూ. 31.8, డీజిల్​పై రూ. 32.9 సుంకాన్ని విధిస్తున్నారు.

గత 9 నెలల నుంచి చమురు ధరలు పెరుగుతున్నాయి. ఈ తరుణంలో ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎక్సైజ్​ సుంకాలను తగ్గించాలని పలు వర్గాల నుంచి డిమాండ్ వినిపిస్తోంది.

ఇదీ చదవండి:తగ్గిన పసిడి ధర.. వెండి కాస్త ప్రియం

దేశంలో చమురు ధరలు ఆకాశాన్నంటాయి. ఈ నేపథ్యంలో పెట్రోల్​, డీజిల్​పై ఎక్సైజ్​ సుంకం రూ. 8.5 వరకు తగ్గించే అవకాశం ప్రభుత్వం చేతుల్లో ఉందని నిపుణులు చెబుతున్నారు. సుంకం తగ్గించినా చమురుపై విధించే పన్ను ద్వారా వచ్చే ఆదాయాలపై ప్రభావం ఉండబోదని అంటున్నారు.

"ఎక్సైజ్​ సుంకాలను తగ్గించకపోతే.. 2022 ఆర్థిక సంవత్సరంలో(ఏప్రిల్​ 2021-మార్చి 2022) ప్రభుత్వ ఆదాయం రూ.4.35 లక్షల కోట్లుగా ఉంటుంది. ఇది ప్రభుత్వం 2021 బడ్జెట్లో అంచనా వేసిన రూ. 3.2 లక్షల కోట్ల ఆదాయం కన్నా ఎక్కువ. ఒకవేళ 2021 ఏప్రిల్​ 1 లోగా లీటరు పెట్రోల్​, డీజిల్​పై రూ. 8.5 ఎక్సైజ్​ సుంకాన్ని తగ్గించినా.. ప్రభుత్వం అంచనా వేసిన ఆదాయం వస్తుంది" అని ఐసీఐసీఐ సెక్యూరిటీస్​ పేర్కొంది.

2020 మార్చి-మే మధ్యలో లీటరు పెట్రోల్​పై రూ. 13, లీటరు డీజిల్​పై రూ. 16 చొప్పున ఎక్సైజ్​ సుంకాన్ని పెంచింది కేంద్రం. ప్రస్తుతం లీటరు పెట్రోల్​పై రూ. 31.8, డీజిల్​పై రూ. 32.9 సుంకాన్ని విధిస్తున్నారు.

గత 9 నెలల నుంచి చమురు ధరలు పెరుగుతున్నాయి. ఈ తరుణంలో ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎక్సైజ్​ సుంకాలను తగ్గించాలని పలు వర్గాల నుంచి డిమాండ్ వినిపిస్తోంది.

ఇదీ చదవండి:తగ్గిన పసిడి ధర.. వెండి కాస్త ప్రియం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.