ETV Bharat / business

ఫిబ్రవరిలో తగ్గిన ఎగుమతులు.. పెరిగిన వాణిజ్య లోటు

ఫిబ్రవరిలో దేశీయ ఎగుమతులు, దిగుమతులపై కేంద్ర వాణిజ్య శాఖ మంగళవారం వివరాలను వెల్లడించింది. ఎగుమతుల్లో స్వల్ప క్షీణత నమోదు కావడం వల్ల వాణిజ్య లోటు పెరిగినట్లు పేర్కొంది. దిగుమతులు 6.98 శాతం పెరిగాయని వెల్లడించింది.

author img

By

Published : Mar 2, 2021, 4:58 PM IST

trade deficit
ఫిబ్రవరిలో తగ్గిన ఎగుమతులు.. పెరిగిన వాణిజ్య లోటు

ఈ ఏడాది ఫిబ్రవరిలో దేశీయ ఎగుమతులు స్వల్పంగా 0.25 శాతం క్షీణించి.. 27.67 బిలియన్​ డాలర్లుగా నమోదయ్యాయి. కేంద్ర వాణిజ్య శాఖ మంగళవారం వెల్లడించిన గణాంకాల ద్వారా ఈ విషయం తెలిసింది. ఇదే నెలలో దిగుమతులు 6.98 శాతం పెరిగి.. 40.55 బిలియన్​ డాలర్లుగా నమోదైనట్లు వెల్లడించింది. దీంతో వాణిజ్య లోటు 12.32 బి.​ డాలర్లకు చేరిందని వాణిజ్య శాఖ పేర్కొంది. గతేడాది ఇదే సమయంలో వాణిజ్య లోటు 10.16 బిలియన్​ డాలర్లుగా ఉంది.

ఎగుమతులు.. దిగుమతులు

2020-21 సంవత్సరంలో ఏప్రిల్​- ఫిబ్రవరి మధ్య ఎగుమతులు, దిగుమతుల శాతం అంతకుముందు ఏడాదితో పోలిస్తే భారీగా తగ్గాయి. ఎగుమతుల విలువ 12.32 శాతం తగ్గి 255.92 బిలియన్​ డాలర్లుగా నమోదైంది. అంతకుముందు సంవత్సరం ఆ విలువ 291.87 బిలియన్​ డాలర్లుగా ఉంది.

ఏప్రిల్​-ఫిబ్రవరి మధ్య దిగుమతులు కూడా 23 శాతం తగ్గి.. 340.88 బి. డాలర్లుగా నమోదయ్యాయి.

తగ్గిన చమురు దిగుమతి..

ఫిబ్రవరి నెలలో చమురు దిగుమతి 16.63 శాతం తగ్గి.. 8.99 బిలియన్​ డాలర్లుగా నమోదైంది. ఏప్రిల్​ నుంచి ఫిబ్రవరి వరకు దిగుమతులు 40.18 శాతం తగ్గి.. 72.08 బిలియన్​ డాలర్లగా నమోదయ్యాయి.

ఎగుమతుల్లో ఐరన్​ ఓర్​, వరి, మాంసం, డెయిరీ, పౌల్ట్రీ, ఫార్మా మొదలైన రంగాలు వృద్ధిని కనబర్చాయి. పెట్రోలియమ్ ఉత్పత్తులు (-27.13 శాతం ), తోలు (-21.62 శాతం), జీడిపప్పు (-18.6 శాతం), వజ్రాలు (-11.18 శాతం), టీ (-2.49 శాతం), కాఫీ (-0.73 శాతం), ఇంజినీరింగ్​ ఉత్పత్తులు (-2.56 శాతం) నష్టాలను నమోదు చేశాయి.

ఇదీ చదవండి : బిలియనీర్ల క్లబ్​లోకి మరో 40 మంది భారతీయులు

ఈ ఏడాది ఫిబ్రవరిలో దేశీయ ఎగుమతులు స్వల్పంగా 0.25 శాతం క్షీణించి.. 27.67 బిలియన్​ డాలర్లుగా నమోదయ్యాయి. కేంద్ర వాణిజ్య శాఖ మంగళవారం వెల్లడించిన గణాంకాల ద్వారా ఈ విషయం తెలిసింది. ఇదే నెలలో దిగుమతులు 6.98 శాతం పెరిగి.. 40.55 బిలియన్​ డాలర్లుగా నమోదైనట్లు వెల్లడించింది. దీంతో వాణిజ్య లోటు 12.32 బి.​ డాలర్లకు చేరిందని వాణిజ్య శాఖ పేర్కొంది. గతేడాది ఇదే సమయంలో వాణిజ్య లోటు 10.16 బిలియన్​ డాలర్లుగా ఉంది.

ఎగుమతులు.. దిగుమతులు

2020-21 సంవత్సరంలో ఏప్రిల్​- ఫిబ్రవరి మధ్య ఎగుమతులు, దిగుమతుల శాతం అంతకుముందు ఏడాదితో పోలిస్తే భారీగా తగ్గాయి. ఎగుమతుల విలువ 12.32 శాతం తగ్గి 255.92 బిలియన్​ డాలర్లుగా నమోదైంది. అంతకుముందు సంవత్సరం ఆ విలువ 291.87 బిలియన్​ డాలర్లుగా ఉంది.

ఏప్రిల్​-ఫిబ్రవరి మధ్య దిగుమతులు కూడా 23 శాతం తగ్గి.. 340.88 బి. డాలర్లుగా నమోదయ్యాయి.

తగ్గిన చమురు దిగుమతి..

ఫిబ్రవరి నెలలో చమురు దిగుమతి 16.63 శాతం తగ్గి.. 8.99 బిలియన్​ డాలర్లుగా నమోదైంది. ఏప్రిల్​ నుంచి ఫిబ్రవరి వరకు దిగుమతులు 40.18 శాతం తగ్గి.. 72.08 బిలియన్​ డాలర్లగా నమోదయ్యాయి.

ఎగుమతుల్లో ఐరన్​ ఓర్​, వరి, మాంసం, డెయిరీ, పౌల్ట్రీ, ఫార్మా మొదలైన రంగాలు వృద్ధిని కనబర్చాయి. పెట్రోలియమ్ ఉత్పత్తులు (-27.13 శాతం ), తోలు (-21.62 శాతం), జీడిపప్పు (-18.6 శాతం), వజ్రాలు (-11.18 శాతం), టీ (-2.49 శాతం), కాఫీ (-0.73 శాతం), ఇంజినీరింగ్​ ఉత్పత్తులు (-2.56 శాతం) నష్టాలను నమోదు చేశాయి.

ఇదీ చదవండి : బిలియనీర్ల క్లబ్​లోకి మరో 40 మంది భారతీయులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.