ఎస్ బ్యాంక్ మనీలాండరింగ్ కేసుతో సంబంధం ఉన్న కాక్స్ అండ్ కింగ్స్ సంస్థ కార్యాలయాల్లో ఈడీ దాడులు నిర్వహించింది. ముంబయిలోని ఈ ట్రావెల్ సంస్థకు చెందిన 5 ప్రాంతాల్లో సోదాలు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ కేసులో మరిన్ని సాక్ష్యాల కోసమే దాడులు చేసినట్లు స్పష్టం చేశారు.
ఎస్ బ్యాంకు నుంచి అధికంగా రుణాలు పొందిన సంస్థల్లో కాక్స్ అండ్ కింగ్స్ ఒకటి. ఈ సంస్థకు సుమారు రూ.2,260 కోట్లు ఎస్ బ్యాంకు రుణంగా అందించినట్లు తేలింది.
అనేక కార్పొరేటు సంస్థలపై..
ఈ కేసులో ఎస్ బ్యాంక్తోపాటు అనేక ఇతర పెద్ద కార్పొరేట్ గ్రూపులను ఈడీ విచారిస్తోంది. బ్యాంక్ జారీ చేసిన భారీ రుణాలు నిరర్ధక ఆస్తులుగా మారినట్లు గుర్తించింది.
ఎస్ బ్యాంకు కుంభకోణంలో సహ వ్యవస్థాపకుడు రానా కపూర్ను మార్చిలో అరెస్టు చేసింది ఈడీ. ముంబయిలోని ప్రత్యేక కోర్టులో ఆయనపై ఇటీవల తొలి ఛార్జిషీటు దాఖలు చేసింది.
ఇదీ చూడండి: ఎస్ బ్యాంక్పై ఆంక్షలు ఎత్తివేత- సేవలు పునరుద్ధరణ