సంక్షిప్త సందేశాల దిగ్గజం వాట్సాప్ మరో సరికొత్త అప్డేట్ను తీసుకువచ్చింది. వాట్సాప్ గ్రూపునకు సంబంధించి ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న గోప్యత సెట్టింగ్ను అందుబాటులోకి తెచ్చింది.
గ్రూప్ ప్రైవసీతో లాభాలేంటి..?
ప్రసుతం ఎవరి దగ్గర మీ ఫోన్ నెంబర్ ఉన్నా.. వారు మిమ్మల్ని ఏదైనా వాట్సాప్ గ్రూపులో సభ్యులుగా చేర్చొచ్చు. కొన్ని సార్లు గుర్తు తెలియని వ్యక్తులూ.. గ్రూపుల్లో చేర్చడం వీలవతుంది. అయితే కొత్త ఫీచర్తో ఈ సమస్యకు చెక్పడనుంది.
తాజా అప్డేట్తో గ్రూపులో మిమ్మల్ని ఎవరు చేర్చాలి అనేది మీరే నిర్ణయించుకోవచ్చు. అదెలా అంటే కొత్త అప్డేట్ సెట్టింగ్గుల్లో గ్రూప్ ప్రైవసీ సదుపాయాన్ని తీసుకువచ్చింది వాట్సాప్. ప్రైవసీ సెట్టింగుల్లో.. గ్రూపు అడ్మిన్పై క్లిక్ చేసి.. అందులో ఎవిరీవన్, మై కాంటాక్ట్స్, మై కాంటాక్ట్స్ ఎక్సెప్ట్ అనే మూడు ఆప్షన్లలో ఏదో ఒకదాన్ని ఎంపిక చేసుకోవాలి.
- ఎవిరీవన్ను ఎంపిక చేసుకుంటే.. ఎవరైనా మిమ్మల్ని గ్రూపులో చేర్చెందుకు వీలుంటుంది.
- మై కాంటాక్ట్స్ ఎంపిక చేసుకుంటే.. మీ ఫోన్బుక్లో నంబర్ సేవ్ చేసుకున్న వ్యక్తులు తప్ప ఇతరులెవ్వరూ మిమ్మల్ని గ్రూపుల్లో చేర్చడం వీలుకాదు.
- మై కాంటాక్ట్స్ ఎక్సెప్ట్తో.. మీరు నంబర్ సేవ్ చేసుకున్న వారిలోనూ.. ఎవరు మిమ్మల్ని గ్రూపులో చేర్చాలి.. ఎవరు చేర్చకూడదు అనేది నిర్ణయించొచ్చు.
ఇలా గ్రూపుల్లో మిమ్మల్ని సభ్యులుగా చేర్చడం వీలుకాని అడ్మిన్లకూ.. ఓ సదుపాయాన్ని తీసుకువచ్చింది వాట్సాప్. ఎవరైతే అడ్మిన్ మిమ్మల్ని గ్రూప్లో చేర్చలనుకుంటారో.. వారు గ్రూప్లోకి చేర్చే అభ్యర్థన లింక్ను మీకు వ్యక్తిగతంగా పంపించ వచ్చు. ఆ లింక్ ద్వారా మీరు గ్రూపులోకి చేరాలా, వద్దా అనేది నిర్ణయించుకోవచ్చు.
ప్రస్తుతం వాట్సాప్ ఐఓఎస్ 2.19.110.20, వాట్సాప్ ఆండ్రాయిడ్ 2.19.298 బీటా వెర్షన్ యూజర్లకు మత్రమే ఈ కొత్త అప్డేట్ అందుబాటులో ఉంది. త్వరలోనే అందరు యూజర్లకు ఈ అప్డేట్ తీసుకురానుంది వాట్సాప్.
ఇదీ చూడండి: ఇన్ఫోసిస్కు ఏమైంది..? ఎందుకీ నష్టాలు...?