ETV Bharat / business

పేటీఎం, ఫోన్​పే మధ్య ట్విట్టర్​ వార్​- కారణం అదే...

author img

By

Published : Mar 6, 2020, 6:45 PM IST

Updated : Mar 6, 2020, 8:43 PM IST

ఎస్​ బ్యాంక్​ సంక్షోభం దేశంలోని దిగ్గజ డిజిటల్ పేమెంట్​ సర్వీస్​​ సంస్థలైన పేటీఎం, ఫోన్​పే మధ్య ట్విట్టర్​ వార్​కు దారితీసింది. నెట్టింట సరదా చర్చకు కారణమైంది.

twitter war between paytm and phone pay
పేటీఎం, ఫోన్​పే ట్విట్టర్ వార్

డిజిటల్ వాలెట్, పేమెంట్ సంస్థలు పేటీఎం పేమెంట్​ బ్యాంక్, ఫోన్​పే ట్విట్టర్​ వేదికగా పరస్పరం విమర్శలు చేసుకున్నాయి. ఎస్​ బ్యాంక్​ లావాదేవీలపై ఆర్బీఐ పరిమితులు విధించడం ఇందుకు కారణమైంది.

అలా మొదలు...

ఫ్లిప్​కార్ట్​​కు చెందిన డిజిటల్ పేమెంట్ సంస్థ ఫోన్​పేకు లావాదేవీల సేవలను ఎస్​ బ్యాంక్ అందిస్తోంది. అయితే ఎస్​ బ్యాంక్ లావాదేవీలపై పరిమితులు విధిస్తూ ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ఫోన్​పే సేవలు తాత్కాలికంగా నిలిచిపోయాయి.

దీనిపై ఫోన్​పే ప్రత్యర్థి సంస్థ పేటీఎం ట్విట్టర్​ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించింది.

"ప్రియమైన ఫోన్​పే... మిమ్మల్ని పేటీఎం పేమెంట్​ బ్యాంక్​ యూపీఐలో చేరాలని ఆహ్వానిస్తున్నాం. ప్రస్తుతం చాలా మంది పేటీఎం వాడుతున్నారు. మీ వ్యాపారం సజావుగా కొనసాగించేందుకు, విస్తరించుకునేందుకు ఇక్కడ చాలా అవకాశాలు ఉన్నాయి.

మీరు త్వరగా కోలుకునేలా చూస్తాం!"

-పేటీఎం ట్వీట్​

  • Dear @PhonePe_ ,

    Inviting you to @PaytmBank #UPI platform. It already has huge adoption and can seamlessly scale manifold to handle your business.

    Let’s get you back up, fast!

    — Paytm Payments Bank (@PaytmBank) March 6, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

పేటీఎం ట్వీట్​కు ఫోన్​పే దీటుగా స్పందించింది.

"ప్రియమైన పేటీఎం.... మీ యూపీఐ ప్లాట్​ఫాం నిజంగా అంత గొప్పదైతే మేమే మిమ్మల్ని సంప్రదించేవాళ్లం.

సుదీర్ఘ కాలంగా మాకు భాగస్వామిగా ఉన్న సంస్థ కష్టాల్లో ఉన్నప్పుడు వారిని వదిలేసి మేము మాత్రమే పుంజుకోవడంలో అర్థం లేదు. ఫామ్​ ఈజ్​ టెంపరరి- క్లాస్​ ఈజ్​ పర్మినెంట్​."

-ఫోన్​పే రిప్లై

పేటీఎం మళ్లీ స్పందిస్తూ..

"డిజిటల్​ పేమెంట్స్ వినియోగదారులందరికీ అండగా ఉండేందుకు మేము సహాయం చేస్తున్నాం ఫోన్​పే.

ఇది క్లాసీ విషయం కాదా? గుడ్​లక్" అని ట్వీట్ చేసింది పేటీఎం.

  • Just helping @PhonePe_, we care for all digital payments users.

    Isn't that the classy thing to do? Goodluck! 😎👍🏻

    — Paytm Payments Bank (@PaytmBank) March 6, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఈ రెండు సంస్థల ట్విట్టర్​ వార్​పై ఇతర యూజర్లు తమదైన శైలిలో సెటైర్​లు వేస్తున్నారు.

ఇదీ చూడండి:బంగారం భగభగ-రూ.45 వేలు దాటిన 10 గ్రాముల ధర

డిజిటల్ వాలెట్, పేమెంట్ సంస్థలు పేటీఎం పేమెంట్​ బ్యాంక్, ఫోన్​పే ట్విట్టర్​ వేదికగా పరస్పరం విమర్శలు చేసుకున్నాయి. ఎస్​ బ్యాంక్​ లావాదేవీలపై ఆర్బీఐ పరిమితులు విధించడం ఇందుకు కారణమైంది.

అలా మొదలు...

ఫ్లిప్​కార్ట్​​కు చెందిన డిజిటల్ పేమెంట్ సంస్థ ఫోన్​పేకు లావాదేవీల సేవలను ఎస్​ బ్యాంక్ అందిస్తోంది. అయితే ఎస్​ బ్యాంక్ లావాదేవీలపై పరిమితులు విధిస్తూ ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ఫోన్​పే సేవలు తాత్కాలికంగా నిలిచిపోయాయి.

దీనిపై ఫోన్​పే ప్రత్యర్థి సంస్థ పేటీఎం ట్విట్టర్​ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించింది.

"ప్రియమైన ఫోన్​పే... మిమ్మల్ని పేటీఎం పేమెంట్​ బ్యాంక్​ యూపీఐలో చేరాలని ఆహ్వానిస్తున్నాం. ప్రస్తుతం చాలా మంది పేటీఎం వాడుతున్నారు. మీ వ్యాపారం సజావుగా కొనసాగించేందుకు, విస్తరించుకునేందుకు ఇక్కడ చాలా అవకాశాలు ఉన్నాయి.

మీరు త్వరగా కోలుకునేలా చూస్తాం!"

-పేటీఎం ట్వీట్​

  • Dear @PhonePe_ ,

    Inviting you to @PaytmBank #UPI platform. It already has huge adoption and can seamlessly scale manifold to handle your business.

    Let’s get you back up, fast!

    — Paytm Payments Bank (@PaytmBank) March 6, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

పేటీఎం ట్వీట్​కు ఫోన్​పే దీటుగా స్పందించింది.

"ప్రియమైన పేటీఎం.... మీ యూపీఐ ప్లాట్​ఫాం నిజంగా అంత గొప్పదైతే మేమే మిమ్మల్ని సంప్రదించేవాళ్లం.

సుదీర్ఘ కాలంగా మాకు భాగస్వామిగా ఉన్న సంస్థ కష్టాల్లో ఉన్నప్పుడు వారిని వదిలేసి మేము మాత్రమే పుంజుకోవడంలో అర్థం లేదు. ఫామ్​ ఈజ్​ టెంపరరి- క్లాస్​ ఈజ్​ పర్మినెంట్​."

-ఫోన్​పే రిప్లై

పేటీఎం మళ్లీ స్పందిస్తూ..

"డిజిటల్​ పేమెంట్స్ వినియోగదారులందరికీ అండగా ఉండేందుకు మేము సహాయం చేస్తున్నాం ఫోన్​పే.

ఇది క్లాసీ విషయం కాదా? గుడ్​లక్" అని ట్వీట్ చేసింది పేటీఎం.

  • Just helping @PhonePe_, we care for all digital payments users.

    Isn't that the classy thing to do? Goodluck! 😎👍🏻

    — Paytm Payments Bank (@PaytmBank) March 6, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఈ రెండు సంస్థల ట్విట్టర్​ వార్​పై ఇతర యూజర్లు తమదైన శైలిలో సెటైర్​లు వేస్తున్నారు.

ఇదీ చూడండి:బంగారం భగభగ-రూ.45 వేలు దాటిన 10 గ్రాముల ధర

Last Updated : Mar 6, 2020, 8:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.