ETV Bharat / business

'చార్‌ధామ్'కు‌ ముకేశ్‌ అంబానీ రూ.5 కోట్ల విరాళం - ఆలయానికి అంబానీ విరాళం

రిలయన్స్​ ఇండస్ట్రీస్​ ఛైర్మన్​ ముకేశ్​ అంబానీ ఉత్తరాఖండ్​లోని చార్​ధామ్ ఆలయానికి భారీ విరాళం ఇచ్చారు. ఆలయ ఉద్యోగుల జీతాల కోసం రూ. 5కోట్లు సాయం చేసినట్లు అధికారులు తెలిపారు.

Mukesh Ambani donates Rs 5 crore to Chardham temple
'చార్‌ధామ్'కు‌ ముకేశ్‌ అంబానీ రూ.5 కోట్ల విరాళం
author img

By

Published : Oct 8, 2020, 7:12 AM IST

ఉత్తరాఖండ్‌లోని చార్‌ధామ్‌ దేవస్థానం బోర్డుకు ముకేశ్‌ అంబానీ కుటుంబం రూ. 5 కోట్ల విరాళం ఇచ్చింది. కరోనా మహమ్మారి కారణంగా ఆలయానికి ఏర్పడిన ఆర్థిక నష్టాలను పూడ్చుకునేందుకు ఈ విరాళం అందించినట్లు పేర్కొంది.

రిలయన్స్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ ముకేశ్‌ అంబానీ కుమారుడు అనంత్‌ అంబానీ ఈ మొత్తాన్ని అందజేసినట్లు దేవస్థానం బోర్డు అదనపు సీఈవో బి.డి.సింగ్‌ బుధవారం తెలిపారు. తమ ఉద్యోగులకు జీతాలు చెల్లించేందుకు సహకరించాలని ముకేశ్‌ అంబానీకి విజ్ఞప్తి చేశామని.. ఇందులో భాగంగానే పెద్దమొత్తంలో విరాళం అందించారని సింగ్‌ వెల్లడించారు.

ఉత్తరాఖండ్‌లోని చార్‌ధామ్‌ దేవస్థానం బోర్డుకు ముకేశ్‌ అంబానీ కుటుంబం రూ. 5 కోట్ల విరాళం ఇచ్చింది. కరోనా మహమ్మారి కారణంగా ఆలయానికి ఏర్పడిన ఆర్థిక నష్టాలను పూడ్చుకునేందుకు ఈ విరాళం అందించినట్లు పేర్కొంది.

రిలయన్స్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ ముకేశ్‌ అంబానీ కుమారుడు అనంత్‌ అంబానీ ఈ మొత్తాన్ని అందజేసినట్లు దేవస్థానం బోర్డు అదనపు సీఈవో బి.డి.సింగ్‌ బుధవారం తెలిపారు. తమ ఉద్యోగులకు జీతాలు చెల్లించేందుకు సహకరించాలని ముకేశ్‌ అంబానీకి విజ్ఞప్తి చేశామని.. ఇందులో భాగంగానే పెద్దమొత్తంలో విరాళం అందించారని సింగ్‌ వెల్లడించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.