ETV Bharat / business

బెంజ్ నుంచి తొలి మేడ్ ఇన్​​ ఇండియా కారు​ విడుదల

ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్.. తొలి మేడ్​ ఇన్​ ఇండియా మోడల్​ను మార్కెట్లోకి విడదల చేసింది. సంస్థకు పుణేలో ఉన్న ప్లాంట్​లో ఈ మోడన్​లు తయారు చేసింది. ఈ మోడల్ ధర వివరాలు ఇలా ఉన్నాయి.

author img

By

Published : Nov 3, 2020, 5:16 PM IST

Benz AMG GLC 43 4MATIC Coupe Released
మార్కెట్లోకి బెంజ్ మేడ్​ఇన్​ ఇండియా కారు

జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్‌.. దేశీయంగా ఉత్పత్తి చేసిన మొట్టమొదటి సీఎల్​సీ 43 4మ్యాటిక్ కూపే మోడల్​ను మంగళవారం విడుదల చేసింది.

సీఎల్​సీ 43 4మ్యాటిక్ కూపే ఎక్స్ షోరూం ధర రూ.76.7 లక్షలుగా ప్రకటించింది మెర్సిడెస్‌ బెంజ్‌. ఈ మోడల్​ను 3 లీటర్ల వీ6 బైడర్బో ఇంజిన్లతో తీసుకొచ్చినట్లు వెల్లడించింది. దీనికి 390 హెచ్​పీ సామర్థ్యం ఉన్నట్లు వివరించింది.

మెర్సెడెస్​ బెంజ్ దేశీయంగా ప్రస్తుతం 11 మోడళ్లను ఉత్పత్తి చేస్తోంది. పుణేలో ఉన్న ప్లాంట్​ ద్వారా ఈ కార్యకలాపాలు నిర్వహిస్తోంది బెంజ్. ఈ ప్లాంట్​కు ఏటా 20వేల యూనిట్లను ఇన్​స్టాల్ చేసే సామర్థ్యముంది. దేశంలో లగ్జరీ కార్ల విభాగంలో ఉన్న అతిపెద్ద ప్లాంట్ ఇదే కావడం గమనార్హం.

'దేశీయంగా ఉత్పతైన మొదటి ఏఎంజీ మోడల్​ను విడుదల చేయడం మాకు ముఖ్యమైన విజయం. భారత మార్కెట్​ పట్ల మాకున్న నిబద్ధత, వినియోగదారులకు మేము ఇచ్చే విలువకు ఇది నిదర్శనం.' అని మెర్సిడెస్‌ బెంజ్‌ ఇండియా ఎండీ, సీఈఓ మార్టిన్ ష్వెంక్ అన్నారు.

స్థానికంగా ఉత్పత్తితో బ్రాండ్​కు మరింత ప్రజాధరణ పెరుగుతుంనది కంపెనీ ధీమా వ్యక్తం చేసింది‌.

ఇదీ చూడండి:మార్కెట్లోకి మైక్రోమ్యాక్స్ ఇన్​ స్మార్ట్​ఫోన్లు- ధర ఎంతంటే?

జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్‌.. దేశీయంగా ఉత్పత్తి చేసిన మొట్టమొదటి సీఎల్​సీ 43 4మ్యాటిక్ కూపే మోడల్​ను మంగళవారం విడుదల చేసింది.

సీఎల్​సీ 43 4మ్యాటిక్ కూపే ఎక్స్ షోరూం ధర రూ.76.7 లక్షలుగా ప్రకటించింది మెర్సిడెస్‌ బెంజ్‌. ఈ మోడల్​ను 3 లీటర్ల వీ6 బైడర్బో ఇంజిన్లతో తీసుకొచ్చినట్లు వెల్లడించింది. దీనికి 390 హెచ్​పీ సామర్థ్యం ఉన్నట్లు వివరించింది.

మెర్సెడెస్​ బెంజ్ దేశీయంగా ప్రస్తుతం 11 మోడళ్లను ఉత్పత్తి చేస్తోంది. పుణేలో ఉన్న ప్లాంట్​ ద్వారా ఈ కార్యకలాపాలు నిర్వహిస్తోంది బెంజ్. ఈ ప్లాంట్​కు ఏటా 20వేల యూనిట్లను ఇన్​స్టాల్ చేసే సామర్థ్యముంది. దేశంలో లగ్జరీ కార్ల విభాగంలో ఉన్న అతిపెద్ద ప్లాంట్ ఇదే కావడం గమనార్హం.

'దేశీయంగా ఉత్పతైన మొదటి ఏఎంజీ మోడల్​ను విడుదల చేయడం మాకు ముఖ్యమైన విజయం. భారత మార్కెట్​ పట్ల మాకున్న నిబద్ధత, వినియోగదారులకు మేము ఇచ్చే విలువకు ఇది నిదర్శనం.' అని మెర్సిడెస్‌ బెంజ్‌ ఇండియా ఎండీ, సీఈఓ మార్టిన్ ష్వెంక్ అన్నారు.

స్థానికంగా ఉత్పత్తితో బ్రాండ్​కు మరింత ప్రజాధరణ పెరుగుతుంనది కంపెనీ ధీమా వ్యక్తం చేసింది‌.

ఇదీ చూడండి:మార్కెట్లోకి మైక్రోమ్యాక్స్ ఇన్​ స్మార్ట్​ఫోన్లు- ధర ఎంతంటే?

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.