ETV Bharat / business

కెయిర్న్​ వివాదంలో తీర్పును సవాలు చేసిన భారత్

author img

By

Published : May 23, 2021, 7:27 PM IST

కెయిర్న్​తో పన్ను వివాదం విషయంలో ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ ట్రైబ్యునల్ ఆదేశాలను భారత్​ సవాలు చేసింది. ఈ విషయంలో మధ్యవర్తిత్వ తీర్పునకు భారత్ ఎప్పుడూ అంగీకారం తెలపలేదని స్పష్టం చేసింది ఆర్థిక మంత్రిత్వ శాఖ.

Cairn tax dispute with India
భారత్​తో కెయిర్న్ వివాదం

బ్రిటన్​కు చెందిన కెయిర్న్​ సంస్థలకు రూ.1.2 బిలియన్ డాలర్లు తిరిగి చెల్లించాల్ని ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్​ ఆదేశించడాన్ని భారత ప్రభుత్వం సవాలు చేసింది. కెయిర్న్​తో పన్ను వివాదం విషయంలో మధ్యవర్తిత్వ తీర్పునకు ఎప్పుడూ ఆంగీకారం తెలపలేదని ఆదివారం వెల్లడించింది.

'ప్రభుత్వ రంగ బ్యాంకులకు విదేశాల్లో ఉన్న ఖాతాల్లో నగదు సీజ్​ చేసే అవాకాశం ఉంది. అందుకే ఆయా బ్యాంకులు తమ విదేశీ ఖాతాల్లోని నగదును విత్​డ్రా చేసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది' అంటూ వచ్చిన వార్తలను ఆర్థిక మంత్రిత్వశాఖ తీవ్రంగా ఖండించింది.

భారత్​పై రూ.10,247 కోట్ల పన్ను వివాదంలో ముగ్గురు సభ్యుల ఆర్బిట్రేషన్ ప్యానెల్​లో భారత్ ఓ జడ్జిని నియమించినట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీనిపై జరిగిన విచారణలన్నింటిలో పాల్గొన్నట్లు స్పష్టం చేసింది.

ఆర్బిట్రేషన్‌ కోర్టులో కెయిర్న్​ దావా..

ది హేగ్‌లోని అంతర్జాతీయ మధ్యవర్తిత్వ న్యాయస్థానం (ఆర్బిట్రేషన్‌ కోర్టు) ఆదేశాల మేరకు తమకు భారత ప్రభుత్వం నుంచి 1.2 బిలియన్‌ డాలర్లను ఇప్పించాలని కోరుతూ కెయిర్న్‌ ఎనర్జీ అమెరికాలోని న్యాయస్థానంలో తాజాగా దావా వేసింది. ఆర్బిట్రేషన్‌ తీర్పును గుర్తిస్తూ చక్రవడ్డీతో సహా పరిహారాన్ని ఇప్పించాలని అమెరికా సహా యూకే, నెదర్లాండ్స్‌లోనూ గతంలోనే పిటిషన్లు దాఖలు చేసింది.

సొమ్ము చెల్లించకపోతే ఆయా దేశాల్లో ఉన్న భారత ఆస్తులను సీజ్‌ చేయించి మరీ వసూలు చేయాలని ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు గతంలోనే వార్తలు వచ్చాయి. ఆ మేరకు భారత ప్రభుత్వానికి విదేశాల్లో ఉన్న ఆస్తులను కెయిర్న్‌ ఎనర్జీ గుర్తించింది. అందులో భాగంగా తాజాగా ఎయిర్ ఇండియాను ఈ వివాదంలోకి లాగింది.

అసలు వివాదం ఏమిటంటే..

2006లో కంపెనీ అంతర్గత పునర్‌వ్యవస్థీకరణ సమాచారాన్ని కోరుతూ కేంద్ర ప్రభుత్వ పన్నుల విభాగం కెయిర్న్‌‌ ఎనర్జీకి నోటీసులు జారీ చేసింది. వాటిని పరిశీలించిన అనంతరం 2015లో రూ.10,247 కోట్ల పన్నులు చెల్లించాలని కోరింది. పునర్‌వ్యవస్థీకరణ వల్ల వచ్చిన మూలధన రాబడిపై ఈ మేరకు పన్ను చెల్లించాలని తెలిపింది. ఇదిలా ఉండగా.. 2010-11లో కెయిర్న్‌‌ ఎనర్జీ భారత్‌లోని తన అనుబంధ సంస్థ 'కెయిర్న్‌‌ ఇండియా'ను వేదాంతకు విక్రయించింది. ఈ క్రమంలో వేదాంతలో ప్రిఫరెన్షియల్‌ షేర్లతో పాటు ఐదు శాతం వాటాలను ఇచ్చారు.

దీంతో వేదాంతలోని ఐదు శాతం కెయిర్న్‌‌ ఎనర్జీ షేర్లను భారత ప్రభుత్వం అటాచ్‌ చేసింది. అలాగే రూ.1,140 కోట్ల డివిడెండ్లు, రూ.1,590 కోట్ల ట్యాక్స్‌ రీఫండ్‌ను నిలిపివేసింది. తదనంతరం తమకు రావాల్సిన పన్ను వసూలు కోసం అటాచ్‌ చేసిన వేదాంత షేర్లను విక్రయించింది. దీంతో బ్రిటన్‌‌-భారత్‌ ద్వైపాక్షిక పెట్టుబడుల ఒప్పందం(బీఐటీ) కింద ఈ నోటీసులను సవాలు చేస్తూ కెయిర్న్‌ ఎనర్జీ ఆర్బిట్రేషన్‌ ట్రైబ్యునల్​ను ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన ఆర్బిట్రేషన్‌ ట్రైబ్యునల్‌ ద్వైపాక్షిక పెట్టుబడి పరిరక్షణ ఒప్పందాన్ని పన్ను నోటీసులు ఉల్లంఘించాయంటూ తీర్పునిచ్చింది. అలాగే నిలిపివేసిన డివిడెంట్లు, ట్యాక్స్ రీఫండ్‌, షేర్ల విక్రయం వల్ల వాటిల్లిన నష్టం నేపథ్యంలో తిరిగి భారత ప్రభుత్వమే కెయిర్న్‌‌ ఎనర్జీకి రూ.7,600 కోట్లు చెల్లించాలని ఆదేశించింది.

ఇవీ చదవండి:

బ్రిటన్​కు చెందిన కెయిర్న్​ సంస్థలకు రూ.1.2 బిలియన్ డాలర్లు తిరిగి చెల్లించాల్ని ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్​ ఆదేశించడాన్ని భారత ప్రభుత్వం సవాలు చేసింది. కెయిర్న్​తో పన్ను వివాదం విషయంలో మధ్యవర్తిత్వ తీర్పునకు ఎప్పుడూ ఆంగీకారం తెలపలేదని ఆదివారం వెల్లడించింది.

'ప్రభుత్వ రంగ బ్యాంకులకు విదేశాల్లో ఉన్న ఖాతాల్లో నగదు సీజ్​ చేసే అవాకాశం ఉంది. అందుకే ఆయా బ్యాంకులు తమ విదేశీ ఖాతాల్లోని నగదును విత్​డ్రా చేసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది' అంటూ వచ్చిన వార్తలను ఆర్థిక మంత్రిత్వశాఖ తీవ్రంగా ఖండించింది.

భారత్​పై రూ.10,247 కోట్ల పన్ను వివాదంలో ముగ్గురు సభ్యుల ఆర్బిట్రేషన్ ప్యానెల్​లో భారత్ ఓ జడ్జిని నియమించినట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీనిపై జరిగిన విచారణలన్నింటిలో పాల్గొన్నట్లు స్పష్టం చేసింది.

ఆర్బిట్రేషన్‌ కోర్టులో కెయిర్న్​ దావా..

ది హేగ్‌లోని అంతర్జాతీయ మధ్యవర్తిత్వ న్యాయస్థానం (ఆర్బిట్రేషన్‌ కోర్టు) ఆదేశాల మేరకు తమకు భారత ప్రభుత్వం నుంచి 1.2 బిలియన్‌ డాలర్లను ఇప్పించాలని కోరుతూ కెయిర్న్‌ ఎనర్జీ అమెరికాలోని న్యాయస్థానంలో తాజాగా దావా వేసింది. ఆర్బిట్రేషన్‌ తీర్పును గుర్తిస్తూ చక్రవడ్డీతో సహా పరిహారాన్ని ఇప్పించాలని అమెరికా సహా యూకే, నెదర్లాండ్స్‌లోనూ గతంలోనే పిటిషన్లు దాఖలు చేసింది.

సొమ్ము చెల్లించకపోతే ఆయా దేశాల్లో ఉన్న భారత ఆస్తులను సీజ్‌ చేయించి మరీ వసూలు చేయాలని ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు గతంలోనే వార్తలు వచ్చాయి. ఆ మేరకు భారత ప్రభుత్వానికి విదేశాల్లో ఉన్న ఆస్తులను కెయిర్న్‌ ఎనర్జీ గుర్తించింది. అందులో భాగంగా తాజాగా ఎయిర్ ఇండియాను ఈ వివాదంలోకి లాగింది.

అసలు వివాదం ఏమిటంటే..

2006లో కంపెనీ అంతర్గత పునర్‌వ్యవస్థీకరణ సమాచారాన్ని కోరుతూ కేంద్ర ప్రభుత్వ పన్నుల విభాగం కెయిర్న్‌‌ ఎనర్జీకి నోటీసులు జారీ చేసింది. వాటిని పరిశీలించిన అనంతరం 2015లో రూ.10,247 కోట్ల పన్నులు చెల్లించాలని కోరింది. పునర్‌వ్యవస్థీకరణ వల్ల వచ్చిన మూలధన రాబడిపై ఈ మేరకు పన్ను చెల్లించాలని తెలిపింది. ఇదిలా ఉండగా.. 2010-11లో కెయిర్న్‌‌ ఎనర్జీ భారత్‌లోని తన అనుబంధ సంస్థ 'కెయిర్న్‌‌ ఇండియా'ను వేదాంతకు విక్రయించింది. ఈ క్రమంలో వేదాంతలో ప్రిఫరెన్షియల్‌ షేర్లతో పాటు ఐదు శాతం వాటాలను ఇచ్చారు.

దీంతో వేదాంతలోని ఐదు శాతం కెయిర్న్‌‌ ఎనర్జీ షేర్లను భారత ప్రభుత్వం అటాచ్‌ చేసింది. అలాగే రూ.1,140 కోట్ల డివిడెండ్లు, రూ.1,590 కోట్ల ట్యాక్స్‌ రీఫండ్‌ను నిలిపివేసింది. తదనంతరం తమకు రావాల్సిన పన్ను వసూలు కోసం అటాచ్‌ చేసిన వేదాంత షేర్లను విక్రయించింది. దీంతో బ్రిటన్‌‌-భారత్‌ ద్వైపాక్షిక పెట్టుబడుల ఒప్పందం(బీఐటీ) కింద ఈ నోటీసులను సవాలు చేస్తూ కెయిర్న్‌ ఎనర్జీ ఆర్బిట్రేషన్‌ ట్రైబ్యునల్​ను ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన ఆర్బిట్రేషన్‌ ట్రైబ్యునల్‌ ద్వైపాక్షిక పెట్టుబడి పరిరక్షణ ఒప్పందాన్ని పన్ను నోటీసులు ఉల్లంఘించాయంటూ తీర్పునిచ్చింది. అలాగే నిలిపివేసిన డివిడెంట్లు, ట్యాక్స్ రీఫండ్‌, షేర్ల విక్రయం వల్ల వాటిల్లిన నష్టం నేపథ్యంలో తిరిగి భారత ప్రభుత్వమే కెయిర్న్‌‌ ఎనర్జీకి రూ.7,600 కోట్లు చెల్లించాలని ఆదేశించింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.