ETV Bharat / business

ఐసీఐసీఐ బ్యాంక్‌ లాభం నాలుగింతలు

author img

By

Published : Nov 1, 2020, 6:08 AM IST

ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ఐసీఐసీఐ బ్యాంకు మంచి ఫలితాలను సాధించింది. ఏకీకృత నికర లాభం నాలుగు రెట్లు పెరిగి రూ.4,882 కోట్లకు చేరుకుంది. బ్యాంకు చరిత్రలో అత్యధిక త్రైమాసిక వృద్ధి ఇదే.

icici profits are increased upto 4 times in second quarter of 2020-21 fiscal year
ఐసీఐసీఐ బ్యాంక్‌ లాభం నాలుగింతలు

ఐసీఐసీఐ బ్యాంక్‌ ఫలితాల్లో రాణించింది. 2020, సెప్టెంబరు 30తో ముగిసిన త్రైమాసికంలో బ్యాంకు ఏకీకృత నికర లాభం నాలుగింతలై రూ.4,882 కోట్లకు చేరుకుంది. ప్రధాన ఆదాయ వృద్ధికి తోడు, కరోనా సంబంధిత ప్రభావానికి తక్కువ కేటాయింపులే చేయడం ఇందుకు దోహదం చేసింది. ఏడాది కిందట ఇదే త్రైమాసికంలో లాభం రూ.1,131 కోట్లుగా నిలిచింది. స్టాండలోన్‌ ఖాతాల ప్రకారం నికర లాభం రూ.655 కోట్ల నుంచి రూ.4,251 కోట్లకు పెరిగింది. బ్యాంకు చరిత్రలో అత్యధిక త్రైమాసిక వృద్ధి ఇదే.

పెరిగిన నికర వడ్డీ ఆదాయం..

నికర వడ్డీ మార్జిన్‌(ఎన్‌ఐఎమ్‌) 0.10 తగ్గి 3.57 శాతానికి చేరినప్పటికీ ప్రధాన నికర వడ్డీ ఆదాయం(ఎన్‌ఐఐ) 16 శాతం వృద్ధితో రూ.9,366 కోట్లకు చేరడం విశేషం. గత రెండేళ్లలో కొత్త యాజమాన్యం ఆధ్వర్యంలో అనుసరించిన వ్యూహం కారణంగా అధిక లాభ వృద్ధి నమోదైందని బ్యాంకు ప్రెసిడెంట్‌ సందీప్‌ బాత్రా పేర్కొన్నారు.

పన్ను వ్యయాలు తగ్గాయ్‌..

మొత్తం కేటాయింపులు క్రితం ఏడాదితో పోలిస్తే రూ.2506 కోట్లనుంచి రూ.2,995 కోట్లకు పెరిగాయి. గత త్రైమాసింలో ఇవి రూ.7593 కోట్లుగా ఉండడం గమనార్హం. మార్చి, జూన్‌ త్రైమాసికాల్లో భారీ కేటాయింపుల కారణంగా సెప్టెంబరు త్రైమాసికంలో కేటాయింపులు సరిపోతాయని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. మొత్తం పన్ను వ్యయాలు మూడింట రెండొంతులకు(రూ.1014 కోట్లు) తగ్గినట్లు బాత్రా వివరించారు.

ఇదీ చూడండి:లాక్​డౌన్ తర్వాత పెరిగిన వాహన విక్రయాలు- కారణమిదే

ఐసీఐసీఐ బ్యాంక్‌ ఫలితాల్లో రాణించింది. 2020, సెప్టెంబరు 30తో ముగిసిన త్రైమాసికంలో బ్యాంకు ఏకీకృత నికర లాభం నాలుగింతలై రూ.4,882 కోట్లకు చేరుకుంది. ప్రధాన ఆదాయ వృద్ధికి తోడు, కరోనా సంబంధిత ప్రభావానికి తక్కువ కేటాయింపులే చేయడం ఇందుకు దోహదం చేసింది. ఏడాది కిందట ఇదే త్రైమాసికంలో లాభం రూ.1,131 కోట్లుగా నిలిచింది. స్టాండలోన్‌ ఖాతాల ప్రకారం నికర లాభం రూ.655 కోట్ల నుంచి రూ.4,251 కోట్లకు పెరిగింది. బ్యాంకు చరిత్రలో అత్యధిక త్రైమాసిక వృద్ధి ఇదే.

పెరిగిన నికర వడ్డీ ఆదాయం..

నికర వడ్డీ మార్జిన్‌(ఎన్‌ఐఎమ్‌) 0.10 తగ్గి 3.57 శాతానికి చేరినప్పటికీ ప్రధాన నికర వడ్డీ ఆదాయం(ఎన్‌ఐఐ) 16 శాతం వృద్ధితో రూ.9,366 కోట్లకు చేరడం విశేషం. గత రెండేళ్లలో కొత్త యాజమాన్యం ఆధ్వర్యంలో అనుసరించిన వ్యూహం కారణంగా అధిక లాభ వృద్ధి నమోదైందని బ్యాంకు ప్రెసిడెంట్‌ సందీప్‌ బాత్రా పేర్కొన్నారు.

పన్ను వ్యయాలు తగ్గాయ్‌..

మొత్తం కేటాయింపులు క్రితం ఏడాదితో పోలిస్తే రూ.2506 కోట్లనుంచి రూ.2,995 కోట్లకు పెరిగాయి. గత త్రైమాసింలో ఇవి రూ.7593 కోట్లుగా ఉండడం గమనార్హం. మార్చి, జూన్‌ త్రైమాసికాల్లో భారీ కేటాయింపుల కారణంగా సెప్టెంబరు త్రైమాసికంలో కేటాయింపులు సరిపోతాయని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. మొత్తం పన్ను వ్యయాలు మూడింట రెండొంతులకు(రూ.1014 కోట్లు) తగ్గినట్లు బాత్రా వివరించారు.

ఇదీ చూడండి:లాక్​డౌన్ తర్వాత పెరిగిన వాహన విక్రయాలు- కారణమిదే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.