ETV Bharat / business

భారత మార్కెట్​కు హార్లీ డేవిడ్​సన్​ గుడ్​బై!

author img

By

Published : Aug 20, 2020, 2:08 PM IST

అమెరికాకు చెందిన ప్రముఖ బైక్​ల తయారీ సంస్థ హార్లీ డేవిడ్​సన్​ భారత కార్యకలాపాల నుంచి వైదొలిగేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. విక్రయాలు లేక వ్యాపారాల నిర్వహణ భారంగా మారినందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

Harley may exit indian maket
భారత్​కు హార్లీ గుడ్​బై

లగ్జరీ బైక్​లు అనగానే భారత్​లో ఎక్కువగా గుర్తొచ్చే పేరు హార్లీ డేవిడ్​సన్. అంతలా దేశీయ మార్కెట్​లో పేరు తెచ్చుకున్న హార్లీ ఇప్పుడు షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కరోనాతో విధించిన లాక్​డౌన్ సహా.. డిమాండ్ లేమితో ఇటీవల బైక్​ల విక్రయాలు రికార్డు స్థాయిలో పడిపోయాయి. ఈ నేపథ్యంలో భారత కార్యకలాపాల నుంచి వైదొలగాలని హార్లీ డేవిడ్​సన్​ భావిస్తున్నట్లు సమాచారం. భవిష్యత్​ అంచనాలు కూడా ఆశించినంతగా లేకపోవడం ఇందుకు కారణమనే వార్తలు వస్తున్నాయి.

కంపెనీకి హరియాణాలో ఉన్న ప్లాంట్​ను మూసేసి.. ఔట్​ సోర్సింగ్​కు అసెంబ్లింగ్ విభాగ కార్యకాలాపాలు అప్పగించాలని యోచిస్తున్నట్లు తెలిసింది.

హార్లీ డేవిడ్​సన్​ గత ఆర్థిక సంవత్సరం దేశీయంగా 2,500కు పైగా బైక్​లను విక్రయించింది. ఈ ఆర్థిక సంవత్సరం విషయానికొస్తే.. ఏప్రిల్-జూన్​ మధ్య 100 బైక్​లు మాత్రమే విక్రయించింది.

ప్రపంచవ్యాప్తంగా అత్యంత తక్కువగా విక్రయాలు ఉన్న మార్కెట్లలో భారత్ కుడా ఒకటని హార్లీ గతంలోనే ప్రకటించింది. అలాంటి మార్కెట్ల నుంచి వైదొలగాలని యోచిస్తున్నట్లు కూడా అప్పట్లో సంకేతాలు ఇచ్చింది.

ఇదీ చూడండి:ఆరో రోజూ పెట్రో మంట- ప్రస్తుత ధరలు ఇవే..

లగ్జరీ బైక్​లు అనగానే భారత్​లో ఎక్కువగా గుర్తొచ్చే పేరు హార్లీ డేవిడ్​సన్. అంతలా దేశీయ మార్కెట్​లో పేరు తెచ్చుకున్న హార్లీ ఇప్పుడు షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కరోనాతో విధించిన లాక్​డౌన్ సహా.. డిమాండ్ లేమితో ఇటీవల బైక్​ల విక్రయాలు రికార్డు స్థాయిలో పడిపోయాయి. ఈ నేపథ్యంలో భారత కార్యకలాపాల నుంచి వైదొలగాలని హార్లీ డేవిడ్​సన్​ భావిస్తున్నట్లు సమాచారం. భవిష్యత్​ అంచనాలు కూడా ఆశించినంతగా లేకపోవడం ఇందుకు కారణమనే వార్తలు వస్తున్నాయి.

కంపెనీకి హరియాణాలో ఉన్న ప్లాంట్​ను మూసేసి.. ఔట్​ సోర్సింగ్​కు అసెంబ్లింగ్ విభాగ కార్యకాలాపాలు అప్పగించాలని యోచిస్తున్నట్లు తెలిసింది.

హార్లీ డేవిడ్​సన్​ గత ఆర్థిక సంవత్సరం దేశీయంగా 2,500కు పైగా బైక్​లను విక్రయించింది. ఈ ఆర్థిక సంవత్సరం విషయానికొస్తే.. ఏప్రిల్-జూన్​ మధ్య 100 బైక్​లు మాత్రమే విక్రయించింది.

ప్రపంచవ్యాప్తంగా అత్యంత తక్కువగా విక్రయాలు ఉన్న మార్కెట్లలో భారత్ కుడా ఒకటని హార్లీ గతంలోనే ప్రకటించింది. అలాంటి మార్కెట్ల నుంచి వైదొలగాలని యోచిస్తున్నట్లు కూడా అప్పట్లో సంకేతాలు ఇచ్చింది.

ఇదీ చూడండి:ఆరో రోజూ పెట్రో మంట- ప్రస్తుత ధరలు ఇవే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.