ETV Bharat / business

కనుమరుగు కానున్న గూగుల్​ 'ఉచిత వైఫై స్టేషన్లు'! - railwire network

రద్దీ ప్రాంతాల్లో 'స్టేషన్'​ పేరుతో అందిస్తోన్న ఉచిత వైఫై సేవలను క్రమంగా నిలిపివేయాలని గూగుల్​ నిర్ణయించింది. భారత్​ సహా అన్ని దేశాల్లో స్టేషన్​ సేవలను భాగస్వాములకు అప్పగించి వైదొలగాలని భావిస్తోంది. ఈ ఏడాది నుంచే కార్యాచరణ ప్రారంభించనున్నట్లు ప్రకటించింది.

google, station, wifi
గూగుల్​ వైఫై స్టేషన్​
author img

By

Published : Feb 17, 2020, 7:45 PM IST

Updated : Mar 1, 2020, 3:39 PM IST

'గూగుల్​ స్టేషన్' ఉచిత వైఫై సేవలను నిలిపివేయాలని ఆ సంస్థ నిర్ణయించింది. ఐదేళ్లుగా అంతర్జాల సేవలు సులభంగా, అతి తక్కువ ధరలకే లభిస్తుండటమే ఇందుకు కారణమని చెబుతోంది. భారత్​తో సహా అన్ని దేశాల్లోనూ ఉచిత వైఫై సేవలను నిలిపివేసే ప్రక్రియను ఈ ఏడాది నుంచే ప్రారంభిస్తున్నట్లు తెలిపింది.

ఇందుకోసం స్టేషన్​ సేవలు అందిస్తోన్న ప్రాంతాలను క్రమంగా భాగస్వామ్య సంస్థలకు కట్టబెట్టాలని నిర్ణయించింది. ఫలితంగా గూగుల్​ ఇందులో నుంచి బయటపడినా సేవలు మాత్రం కొనసాగుతాయని తెలిపింది.

భారత్​ను ఉదాహరణగా చూపిస్తూ స్టేషన్​ నుంచి వైదొలగాలని చూస్తున్నట్లు గూగుల్​ ఇండియా ఉపాధ్యక్షుడు సీజర్ సేన్​గుప్తా తెలిపారు.

"భారత్​లో ప్రపంచంలో అతి తక్కువ ధరలకు ఇంటర్నెట్ లభిస్తోంది. ఐదేళ్ల కాలంలో చూస్తే 95 శాతం ధరలు తగ్గాయి. సగటున భారత్​లో ఒక వ్యక్తి నెలకు 10 జీబీ డేటా వినియోగిస్తున్నాడు. ప్రభుత్వాలు కూడా ఇంటర్నెట్​ను సులభంగా వినియోగించేలా ఏర్పాట్లు చేస్తున్నాయి. చౌకగా లభించేలా చర్యలు తీసుకుంటున్నాయి."

-సీజర్ సేన్​గుప్తా, గూగుల్ ఇండియా ఉపాధ్యక్షుడు

గూగుల్​ స్టేషన్​ పేరుతో రద్దీ ప్రాంతాల్లో వైఫై సేవలను అందిస్తోంది ఈ అమెరికా ఆధారిత సంస్థ. 2015లో భారత​ రైల్వేలు, రైల్​టెల్​తో కలిసి రైల్వే స్టేషన్లలో ఉచిత​ వైఫై సేవలను ప్రారంభించింది గూగుల్​. ఇలా ఇప్పటివరకు సుమారు 400 రైల్వే స్టేషన్లలో వైఫై సౌకర్యాన్ని కల్పించింది. భారత్​ కాకుండా నైజీరియా, థాయి​లాండ్, ఫిలిప్పీన్స్​, మెక్సికో, ఇండోనేసియా, బ్రెజిల్, దక్షిణాఫ్రికా తదితర దేశాల్లో స్టేషన్​ సేవలు అందిస్తోంది గూగుల్.

'గూగుల్​ స్టేషన్' ఉచిత వైఫై సేవలను నిలిపివేయాలని ఆ సంస్థ నిర్ణయించింది. ఐదేళ్లుగా అంతర్జాల సేవలు సులభంగా, అతి తక్కువ ధరలకే లభిస్తుండటమే ఇందుకు కారణమని చెబుతోంది. భారత్​తో సహా అన్ని దేశాల్లోనూ ఉచిత వైఫై సేవలను నిలిపివేసే ప్రక్రియను ఈ ఏడాది నుంచే ప్రారంభిస్తున్నట్లు తెలిపింది.

ఇందుకోసం స్టేషన్​ సేవలు అందిస్తోన్న ప్రాంతాలను క్రమంగా భాగస్వామ్య సంస్థలకు కట్టబెట్టాలని నిర్ణయించింది. ఫలితంగా గూగుల్​ ఇందులో నుంచి బయటపడినా సేవలు మాత్రం కొనసాగుతాయని తెలిపింది.

భారత్​ను ఉదాహరణగా చూపిస్తూ స్టేషన్​ నుంచి వైదొలగాలని చూస్తున్నట్లు గూగుల్​ ఇండియా ఉపాధ్యక్షుడు సీజర్ సేన్​గుప్తా తెలిపారు.

"భారత్​లో ప్రపంచంలో అతి తక్కువ ధరలకు ఇంటర్నెట్ లభిస్తోంది. ఐదేళ్ల కాలంలో చూస్తే 95 శాతం ధరలు తగ్గాయి. సగటున భారత్​లో ఒక వ్యక్తి నెలకు 10 జీబీ డేటా వినియోగిస్తున్నాడు. ప్రభుత్వాలు కూడా ఇంటర్నెట్​ను సులభంగా వినియోగించేలా ఏర్పాట్లు చేస్తున్నాయి. చౌకగా లభించేలా చర్యలు తీసుకుంటున్నాయి."

-సీజర్ సేన్​గుప్తా, గూగుల్ ఇండియా ఉపాధ్యక్షుడు

గూగుల్​ స్టేషన్​ పేరుతో రద్దీ ప్రాంతాల్లో వైఫై సేవలను అందిస్తోంది ఈ అమెరికా ఆధారిత సంస్థ. 2015లో భారత​ రైల్వేలు, రైల్​టెల్​తో కలిసి రైల్వే స్టేషన్లలో ఉచిత​ వైఫై సేవలను ప్రారంభించింది గూగుల్​. ఇలా ఇప్పటివరకు సుమారు 400 రైల్వే స్టేషన్లలో వైఫై సౌకర్యాన్ని కల్పించింది. భారత్​ కాకుండా నైజీరియా, థాయి​లాండ్, ఫిలిప్పీన్స్​, మెక్సికో, ఇండోనేసియా, బ్రెజిల్, దక్షిణాఫ్రికా తదితర దేశాల్లో స్టేషన్​ సేవలు అందిస్తోంది గూగుల్.

Last Updated : Mar 1, 2020, 3:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.