ETV Bharat / business

'కరోనా భూతం వల్ల ప్రపంచానికి మాంద్యం ముప్పు'

author img

By

Published : Feb 26, 2020, 3:35 PM IST

Updated : Mar 2, 2020, 3:36 PM IST

కరోనా వైరస్​ ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోందని మూడీస్​ అనలిటిక్స్​ అభిప్రాయపడింది. చైనా సహా పలు దేశాల్లో విజృంభిస్తున్న ఈ మహమ్మారిని అడ్డుకోకపోతే ప్రపంచం మొత్తం మాంద్యాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని అంచనా వేసింది.

Global recession likely if coronavirus becomes pandemic
కరోనాను అడ్డుకోకుంటే ఆర్థిక మాంద్యమే

కరోనా వైరస్ విస్తృతిని అడ్డుకోకుంటే ప్రపంచం మొత్తం మాంద్యాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని మూడీస్‌ అనలిటిక్స్ హెచ్చరించింది. ప్రస్తుతం చైనాలో అల్లకల్లోలం సృష్టిస్తున్న ఈ మహమ్మారి.. ఇటలీ, దక్షిణ కొరియానూ వణికిస్తున్న విషయాన్ని గుర్తు చేసింది.

కరోనా వైరస్‌ కారణంగా చైనా ఆర్థిక వ్యవస్థకు భారీ ఎదురుదెబ్బ తగిలిందని .. ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలకూ అనేక సవాళ్లు విసురుతోందని మూడీస్​ అనలిటిక్స్​ ముఖ్య ఆర్థికవేత్త మార్క్​ జండీ వివరించారు.

పర్యటనలు రద్దు..

కరోనా వల్ల ఇప్పటికే చైనీయుల వ్యాపార ప్రయాణాలు, ఇతర పర్యటనలు రద్దయ్యాయని మూడీస్​ తెలిపింది. అంతర్జాతీయ విమానయాన సంస్థలు చైనాకు సేవలు నిలిపేశాయని, ఆసియా-పసిఫిక్​ ప్రాంతాలకు నౌకల సేవలనూ ఆపేస్తున్నట్లు గుర్తుచేసింది.

ధరలు పెరగొచ్చు..

చైనాలో ఫ్యాక్టరీలు మూతపడడం కారణంగా చైనా దిగుమతులపై ఆధారపడిన అనేక దేశాల్లోని పరిశ్రమలు సమస్యలు ఎదుర్కొంటున్నట్లు తెలిపింది. చైనా నుంచి దిగుమతులు తగ్గిన కారణంగా అమెజాన్, వాల్​మార్ట్​లలో కొనుగోలు చేసే వస్తువుల ధరలు పెరిగే అవకాశముందని మూడీస్ అనలిటిక్స్​ పేర్కొంది. ఇంకొన్నాళ్లు పరిస్థితి ఇలాగే కొనసాగితే మాంద్యం ముప్పు తప్పదని స్పష్టం చేసింది.

ఇదీ చూడండి:'తెలుగు రాష్ట్రాల్లో పసిడి, వజ్రాలు అన్వేషణ'

కరోనా వైరస్ విస్తృతిని అడ్డుకోకుంటే ప్రపంచం మొత్తం మాంద్యాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని మూడీస్‌ అనలిటిక్స్ హెచ్చరించింది. ప్రస్తుతం చైనాలో అల్లకల్లోలం సృష్టిస్తున్న ఈ మహమ్మారి.. ఇటలీ, దక్షిణ కొరియానూ వణికిస్తున్న విషయాన్ని గుర్తు చేసింది.

కరోనా వైరస్‌ కారణంగా చైనా ఆర్థిక వ్యవస్థకు భారీ ఎదురుదెబ్బ తగిలిందని .. ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలకూ అనేక సవాళ్లు విసురుతోందని మూడీస్​ అనలిటిక్స్​ ముఖ్య ఆర్థికవేత్త మార్క్​ జండీ వివరించారు.

పర్యటనలు రద్దు..

కరోనా వల్ల ఇప్పటికే చైనీయుల వ్యాపార ప్రయాణాలు, ఇతర పర్యటనలు రద్దయ్యాయని మూడీస్​ తెలిపింది. అంతర్జాతీయ విమానయాన సంస్థలు చైనాకు సేవలు నిలిపేశాయని, ఆసియా-పసిఫిక్​ ప్రాంతాలకు నౌకల సేవలనూ ఆపేస్తున్నట్లు గుర్తుచేసింది.

ధరలు పెరగొచ్చు..

చైనాలో ఫ్యాక్టరీలు మూతపడడం కారణంగా చైనా దిగుమతులపై ఆధారపడిన అనేక దేశాల్లోని పరిశ్రమలు సమస్యలు ఎదుర్కొంటున్నట్లు తెలిపింది. చైనా నుంచి దిగుమతులు తగ్గిన కారణంగా అమెజాన్, వాల్​మార్ట్​లలో కొనుగోలు చేసే వస్తువుల ధరలు పెరిగే అవకాశముందని మూడీస్ అనలిటిక్స్​ పేర్కొంది. ఇంకొన్నాళ్లు పరిస్థితి ఇలాగే కొనసాగితే మాంద్యం ముప్పు తప్పదని స్పష్టం చేసింది.

ఇదీ చూడండి:'తెలుగు రాష్ట్రాల్లో పసిడి, వజ్రాలు అన్వేషణ'

Last Updated : Mar 2, 2020, 3:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.