ETV Bharat / business

ఆన్​లైన్​లో ఆర్డర్​ చెయ్​.. ప్రత్యక్షంగా వెళ్లి కొనేయ్​!

author img

By

Published : Feb 15, 2020, 9:23 AM IST

Updated : Mar 1, 2020, 9:39 AM IST

ప్రస్తుతం చేతిలో చరవాణి పట్టుకొని... కూర్చున్న ప్రదేశం నుంచి కదలకుండా కావాల్సిన వస్తువులను తన కాళ్ల దగ్గరకు రప్పించుకుంటున్నాం. ఏంటి అర్థం కాలేదా? అదేనండి ఆన్​లైన్​ షాపింగ్​. అయితే ఈ మధ్య ఆన్​లైన్​ ఆర్డర్లకు ఆదరణ తగ్గుతున్న నేపథ్యంలో ఫ్లిప్​కార్ట్​ వినూత్న ఆలోచన చేస్తోంది. అదేంటో మీరూ తెలుసుకోండి.

Flipkart to offer customers ''touch and feel'' experience
ఆన్​లైన్​లో ఆర్డర్​ చేయ్​, ప్రత్యక్షంగా వెళ్లి కొనేయ్​!

వినియోగదారులు కొన్ని వస్తువులనైనా ప్రత్యక్షంగా తాకి కొనుగోలు చేసే అనుభూతిని పొందాలని ఆకాంక్షిస్తోంది దిగ్గజ ఈ-కామర్స్​ సంస్థ ఫ్లిప్​కార్ట్​. స్థానిక చిల్లర వ్యాపారులను భాగస్వాములుగా చేసుకుని వినియోగదారులకు చేరువ కావాలనుకుంటుంది.

ఆన్​లైన్​ వ్యాపారంలో ఫ్లిప్​కార్ట్​, అమెజాన్​ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. వస్తువులపై భారీ డిస్కౌంట్​ ప్రకటించి వినియోగదారులను మోసం చేసి, అక్రమాలకు పాల్పడుతున్నారని వీటిపై ఆరోపణలూ ఉన్నాయి. భారతదేశ వ్యాప్తంగా ఈ-కామర్స్​కు ఆదరణ తగ్గుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఈ ఆలోచనతో ఆయా ప్రాంతాల్లో ఉన్న రిలయన్స్​ కిరాణా స్టోర్ల లాభాలను కొల్లగొట్టేందుకు యోచిస్తున్నట్లు తెలుస్తోెంది. ఇప్పటికే ఫ్లిప్​కార్ట్​ను సొంతం చేసుకున్న దిగ్గజ రిటైల్​ సంస్థ వాల్​మార్ట్​, 700 నగరాల్లో 27 వేల కిరాణా​ దుకాణాలకు ఉత్పత్తులను పంపిణీ చేస్తుంది.

ముందుగానే ఆన్​లైన్​లో ఆర్డర్​ చేసి, వారికి దగ్గరలో ఉన్న దుకాణానికి వెళ్లి ఉత్పత్తిని చూసి, కొనుగోలు చేసే విధంగా దీనిని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అధికారిక కొనుగోళ్ల జోన్లకు ఈ ప్రతిపాదన చేసింది ఫ్లిప్​కార్ట్​ సంస్థ.

హైదరాబాదులో పైలెట్​ ప్రాజెక్టుగా ప్రారంభించిన చరవాణి ఉత్పత్తుల అమ్మకం విజయవంతమైంది. 'ముందుగా చరవాణిలోని కియోస్కీ యాప్​లో ఆర్డర్​ చేసుకోవాలి. తర్వాత వారికి అందుబాటులో ఉన్న దుకాణాలకు వెళ్లి వస్తువులు పరిశీలించి కొనుగోలు చేసుకోవచ్చని' సంస్థ ముఖ్య కార్పొరేట్​ వ్యవహారాల అధికారి రజినీశ్​ కుమార్​ తెలిపారు. ప్రస్తుతం ఈ విధానాన్ని దేశంలోని వివిధ ప్రాంతాలకు విస్తరించాలని యోచిస్తోంది.

ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా రిటైల్​ మార్కెట్​లో ఈ-కామర్స్​ వాటా 3 శాతం మాత్రమేనని కుమార్ అన్నారు.

ఇదీ చూడండి: గో ఎయిర్​ నూతన సీఈఓగా వినయ్​ దూబె

వినియోగదారులు కొన్ని వస్తువులనైనా ప్రత్యక్షంగా తాకి కొనుగోలు చేసే అనుభూతిని పొందాలని ఆకాంక్షిస్తోంది దిగ్గజ ఈ-కామర్స్​ సంస్థ ఫ్లిప్​కార్ట్​. స్థానిక చిల్లర వ్యాపారులను భాగస్వాములుగా చేసుకుని వినియోగదారులకు చేరువ కావాలనుకుంటుంది.

ఆన్​లైన్​ వ్యాపారంలో ఫ్లిప్​కార్ట్​, అమెజాన్​ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. వస్తువులపై భారీ డిస్కౌంట్​ ప్రకటించి వినియోగదారులను మోసం చేసి, అక్రమాలకు పాల్పడుతున్నారని వీటిపై ఆరోపణలూ ఉన్నాయి. భారతదేశ వ్యాప్తంగా ఈ-కామర్స్​కు ఆదరణ తగ్గుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఈ ఆలోచనతో ఆయా ప్రాంతాల్లో ఉన్న రిలయన్స్​ కిరాణా స్టోర్ల లాభాలను కొల్లగొట్టేందుకు యోచిస్తున్నట్లు తెలుస్తోెంది. ఇప్పటికే ఫ్లిప్​కార్ట్​ను సొంతం చేసుకున్న దిగ్గజ రిటైల్​ సంస్థ వాల్​మార్ట్​, 700 నగరాల్లో 27 వేల కిరాణా​ దుకాణాలకు ఉత్పత్తులను పంపిణీ చేస్తుంది.

ముందుగానే ఆన్​లైన్​లో ఆర్డర్​ చేసి, వారికి దగ్గరలో ఉన్న దుకాణానికి వెళ్లి ఉత్పత్తిని చూసి, కొనుగోలు చేసే విధంగా దీనిని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అధికారిక కొనుగోళ్ల జోన్లకు ఈ ప్రతిపాదన చేసింది ఫ్లిప్​కార్ట్​ సంస్థ.

హైదరాబాదులో పైలెట్​ ప్రాజెక్టుగా ప్రారంభించిన చరవాణి ఉత్పత్తుల అమ్మకం విజయవంతమైంది. 'ముందుగా చరవాణిలోని కియోస్కీ యాప్​లో ఆర్డర్​ చేసుకోవాలి. తర్వాత వారికి అందుబాటులో ఉన్న దుకాణాలకు వెళ్లి వస్తువులు పరిశీలించి కొనుగోలు చేసుకోవచ్చని' సంస్థ ముఖ్య కార్పొరేట్​ వ్యవహారాల అధికారి రజినీశ్​ కుమార్​ తెలిపారు. ప్రస్తుతం ఈ విధానాన్ని దేశంలోని వివిధ ప్రాంతాలకు విస్తరించాలని యోచిస్తోంది.

ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా రిటైల్​ మార్కెట్​లో ఈ-కామర్స్​ వాటా 3 శాతం మాత్రమేనని కుమార్ అన్నారు.

ఇదీ చూడండి: గో ఎయిర్​ నూతన సీఈఓగా వినయ్​ దూబె

Last Updated : Mar 1, 2020, 9:39 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.