ETV Bharat / business

కరోనా దెబ్బకు యాపిల్ 5జీ ఫోన్​ విడుదల ఆలస్యం!

author img

By

Published : Mar 11, 2020, 1:19 PM IST

యాపిల్​ సంస్థ నుంచి రాబోయే తర్వాతి తరం ఐఫోన్​ 12 విడుదల ఆలస్యం కానుంది. కరోనా ప్రభావంతో ఉత్పత్తి మందగించటమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. తమ ఇంజినీర్లను కరోనా వ్యాప్తి చెందిన దేశాలకు వెళ్లేందుకు యాపిల్ నిరాకరించటమూ మరో కారణంగా తెలుస్తోంది.

iphone
యాపిల్

కరోనా విజృంభణ నేపథ్యంలో ఆసియాలోని వైరస్​ ప్రభావిత దేశాలకు తమ ఇంజినీర్లు వెళ్లకుండా యాపిల్ ఆంక్షలు విధించింది. ఏప్రిల్​ మాసాంతం వరకు వెళ్లద్దని సూచించింది. ఫలితంగా చైనాలో తయారవతున్న ఐఫోన్​ 5జీ ఫోన్లను పరీక్షించటంలో ఆలస్యం జరగుతున్నట్లు తెలుస్తోంది.

తగ్గిన ఉత్పత్తి..

చైనాలోని హీనన్​ రాష్ట్రంలోని జెంగ్​ఝూలో యాపిల్ ప్రధాన తయారీ కేంద్రం ఉంది. ఎలక్ట్రానిక్స్​ తయారీ దిగ్గజం ఫాక్స్​కాన్​ ఆధ్వర్యంలో ఐఫోన్​లను ఉత్పత్తి​ చేస్తుంది. కరోనా వ్యాప్తితో నిలిచిపోయిన ఉత్పత్తిని నెమ్మదిగా ప్రారంభిస్తోంది ఫాక్స్​కాన్​. ఇక్కడ మొత్తం 80 వేల మంది ఉద్యోగుల్లో 1,800 మంది పనిచేస్తున్నారు. అది కూడా స్థానిక అధికారుల సాయంతో జరుగుతోంది.

హుబేకు దగ్గరగా..

జెంగ్​ఝూ కరోనా వ్యాప్తి మొదలైన హుబే రాష్ట్రానికి దగ్గరగా ఉండటం వల్ల యాపిల్ సరఫరా వ్యవస్థ కూడా దెబ్బతింది. ఈ కారణాల వల్ల 5జీ టెక్నాలజీతో రాబోయే ఐఫోన్​ 12 విడుదలలో ఆలస్యం తప్పదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ప్రస్తుత త్రైమాసికంలో తమ ఆదాయం అంచనాలను అందుకోలేమని యాపిల్ ఫిబ్రవరిలోనే స్పష్టం చేసింది.

ఇదీ చూడండి: 'కరోనా వైరస్​తో కార్పొరేట్​ ఆదాయానికి గండి'

కరోనా విజృంభణ నేపథ్యంలో ఆసియాలోని వైరస్​ ప్రభావిత దేశాలకు తమ ఇంజినీర్లు వెళ్లకుండా యాపిల్ ఆంక్షలు విధించింది. ఏప్రిల్​ మాసాంతం వరకు వెళ్లద్దని సూచించింది. ఫలితంగా చైనాలో తయారవతున్న ఐఫోన్​ 5జీ ఫోన్లను పరీక్షించటంలో ఆలస్యం జరగుతున్నట్లు తెలుస్తోంది.

తగ్గిన ఉత్పత్తి..

చైనాలోని హీనన్​ రాష్ట్రంలోని జెంగ్​ఝూలో యాపిల్ ప్రధాన తయారీ కేంద్రం ఉంది. ఎలక్ట్రానిక్స్​ తయారీ దిగ్గజం ఫాక్స్​కాన్​ ఆధ్వర్యంలో ఐఫోన్​లను ఉత్పత్తి​ చేస్తుంది. కరోనా వ్యాప్తితో నిలిచిపోయిన ఉత్పత్తిని నెమ్మదిగా ప్రారంభిస్తోంది ఫాక్స్​కాన్​. ఇక్కడ మొత్తం 80 వేల మంది ఉద్యోగుల్లో 1,800 మంది పనిచేస్తున్నారు. అది కూడా స్థానిక అధికారుల సాయంతో జరుగుతోంది.

హుబేకు దగ్గరగా..

జెంగ్​ఝూ కరోనా వ్యాప్తి మొదలైన హుబే రాష్ట్రానికి దగ్గరగా ఉండటం వల్ల యాపిల్ సరఫరా వ్యవస్థ కూడా దెబ్బతింది. ఈ కారణాల వల్ల 5జీ టెక్నాలజీతో రాబోయే ఐఫోన్​ 12 విడుదలలో ఆలస్యం తప్పదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ప్రస్తుత త్రైమాసికంలో తమ ఆదాయం అంచనాలను అందుకోలేమని యాపిల్ ఫిబ్రవరిలోనే స్పష్టం చేసింది.

ఇదీ చూడండి: 'కరోనా వైరస్​తో కార్పొరేట్​ ఆదాయానికి గండి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.