ETV Bharat / business

మాల్యా ఆస్తుల వేలానికి కోర్టు గ్రీన్​సిగ్నల్

author img

By

Published : Jun 3, 2021, 9:30 PM IST

Updated : Jun 4, 2021, 6:52 AM IST

విజయ్ మాల్యా ఆస్తుల విక్రయించేందుకు బ్యాంకుల కన్సార్టియానికి ముంబయి ప్రత్యేక కోర్టు అనుమతిచ్చింది. 11 బ్యాంకులతో కూడిన కన్సార్టియం దాఖలు చేసిన అభ్యర్థనపై కోర్టు సానుకూలంగా స్పందించింది. త్వరలోనే ఆస్తుల వేలం నిర్వహిస్తామని అధికారులు తెలిపారు.

Special Court allows banks to sell Vijay Mallya's assets to recover dues
మాల్యా ఆస్తుల వేలానికి కోర్టు గ్రీన్​సిగ్నల్

బకాయిలు తిరిగి రాబట్టుకోవడం కోసం విజయ్ మాల్యాకు చెందిన ఆస్తులను విక్రయించేందుకు బ్యాంకుల కన్సార్టియానికి ముంబయి ప్రత్యేక కోర్టు అనుమతి మంజూరు చేసింది. ఈడీ సీజ్ చేసిన ఆస్తులను పునరుద్ధరించాలని మాల్యాకు రుణాలు ఇచ్చిన 11 బ్యాంకులు న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. దీనిపై విచారణ చేపట్టిన మనీలాండరింగ్ నిరోధక కోర్టు.. బ్యాంకుల అభ్యర్థనకు న్యాయస్థానం సానుకూలంగా స్పందించింది. రూ.5,646.54 కోట్ల విలువైన మాల్యా ఆస్తులను విక్రయించేందుకు అనుమతించింది.

2002 సర్ఫేసీ చట్టం ప్రకారం రికవరీ ప్రక్రియ కొనసాగనుంది. మార్గదర్శకాల ప్రకారం త్వరలోనే ఆస్తుల వేలం నిర్వహిస్తామని అధికారులు తెలిపారు.

సుమారు రూ.9 వేల కోట్లను బ్యాంకులకు ఎగ్గొట్టి లండన్ పారిపోయారు విజయ్ మాల్యా. ఇందులో ఎస్​బీఐ వాటా అత్యధికంగా రూ.1,600 కోట్లు ఉంది. పీఎన్​బీ, ఐడీబీఐ బ్యాంకులకు రూ.800 కోట్ల చొప్పున రావాల్సి ఉంది. బ్యాంక్ ఆఫ్ ఇండియా(రూ. 650 కోట్లు), బ్యాంక్ ఆఫ్ బరోడా(రూ.550 కోట్లు), సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(రూ. 410 కోట్లు)కు మాల్యా బకాయి పడ్డారు.

ఇదీ చదవండి- విజయ్ మాల్యాకు కోర్టులో మరో ఎదురుదెబ్బ

బకాయిలు తిరిగి రాబట్టుకోవడం కోసం విజయ్ మాల్యాకు చెందిన ఆస్తులను విక్రయించేందుకు బ్యాంకుల కన్సార్టియానికి ముంబయి ప్రత్యేక కోర్టు అనుమతి మంజూరు చేసింది. ఈడీ సీజ్ చేసిన ఆస్తులను పునరుద్ధరించాలని మాల్యాకు రుణాలు ఇచ్చిన 11 బ్యాంకులు న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. దీనిపై విచారణ చేపట్టిన మనీలాండరింగ్ నిరోధక కోర్టు.. బ్యాంకుల అభ్యర్థనకు న్యాయస్థానం సానుకూలంగా స్పందించింది. రూ.5,646.54 కోట్ల విలువైన మాల్యా ఆస్తులను విక్రయించేందుకు అనుమతించింది.

2002 సర్ఫేసీ చట్టం ప్రకారం రికవరీ ప్రక్రియ కొనసాగనుంది. మార్గదర్శకాల ప్రకారం త్వరలోనే ఆస్తుల వేలం నిర్వహిస్తామని అధికారులు తెలిపారు.

సుమారు రూ.9 వేల కోట్లను బ్యాంకులకు ఎగ్గొట్టి లండన్ పారిపోయారు విజయ్ మాల్యా. ఇందులో ఎస్​బీఐ వాటా అత్యధికంగా రూ.1,600 కోట్లు ఉంది. పీఎన్​బీ, ఐడీబీఐ బ్యాంకులకు రూ.800 కోట్ల చొప్పున రావాల్సి ఉంది. బ్యాంక్ ఆఫ్ ఇండియా(రూ. 650 కోట్లు), బ్యాంక్ ఆఫ్ బరోడా(రూ.550 కోట్లు), సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(రూ. 410 కోట్లు)కు మాల్యా బకాయి పడ్డారు.

ఇదీ చదవండి- విజయ్ మాల్యాకు కోర్టులో మరో ఎదురుదెబ్బ

Last Updated : Jun 4, 2021, 6:52 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.