ETV Bharat / business

ట్విటర్​కు కేంద్రం మరో స్ట్రాంగ్​ కౌంటర్

author img

By

Published : May 27, 2021, 6:47 PM IST

Updated : May 27, 2021, 7:36 PM IST

తమ ఉద్యోగుల భద్రత గురించి ఆందోళనలో ఉన్నామంటూ ట్విటర్​ తప్పుడు ఆరోపణలు చేసిందని కేంద్ర ఐటీ శాఖ పేర్కొంది. ఇవి ఉద్దేశపూర్వకంగా చేసిన వ్యాఖ్యలని మండిపడింది. దిల్లీ పోలీసులు కూడా ట్విటర్​ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

twitter
ట్విటర్, ఐటీ శాఖ

మైక్రోబ్లాగింగ్ ప్లాట్​ఫామ్​ ట్విటర్ చేసిన ఆరోపణలపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. సరైన ఆధారం లేకున్నా ట్విటర్​ ఉద్దేశపూర్వక వ్యాఖ్యలు చేసి భారత్​ను కించపరిచే ప్రయత్నం చేసిందని కేంద్ర ఐటీ శాఖ మండిపడింది.

తొలుత.. భాజపా నేతల ట్వీట్​లకు 'మ్యానుపులేటెడ్ మీడియా' ట్యాగ్​ ఇచ్చిన తర్వాత.. పోలీసులు బెదిరింపులకు దిగుతున్నారని ట్విటర్ ఆరోపించింది. 'కొవిడ్​ టూల్​కిట్​' ఫిర్యాదు పేరుతో.. సమాచారం కావాలాని దిల్లీ పోలీసులు తమకు నోటీసులిచ్చి బెదిరింపులకు పాల్పడుతున్నట్లు పేర్కొంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో భారత్​లో తమ ఉద్యోగుల పట్ల ఆందోళనగా చెందుతున్నట్లు గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది.

దీనిపై ఆగ్రహించిన కేంద్ర ఐటీ శాఖ.. భారత్​లో సామాజిక మాధ్యమ సంస్థల భద్రతకు ఎలాంటి ముప్పు వాటిల్లదని స్పష్టం చేసింది. ఈ మేరకు సంస్థ ప్రతినిధులకు హామీ ఇచ్చినట్లు పేర్కొంది. ట్విటర్​ ఆరోపణలు భారత న్యాయవ్యవస్థపై అనుమానం వ్యక్తం చేస్తున్నట్లు ఉన్నాయని తెలిపింది.

అన్నీ అబద్ధాలే...

'కొవిడ్ టూల్​కిట్' వ్యవహారంలో ట్విటర్​ పూర్తిగా తప్పుడు ఆరోపణలు చేసిందని దిల్లీ పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఆరోపణలు చట్టబద్ధమైన దర్యాప్తును తప్పుపడుతున్నట్లు ఉన్నాయని పేర్కొన్నారు. దర్యాప్తు చేసే అధికారం, తీర్పు చెప్పే అధికారం రెండూ తమకే ఉన్నట్లు ట్విటర్​ ప్రవర్తిస్తోందని పోలీసులు తమ ప్రకటనలో వెల్లడించారు.

ఇదీ చదవండి:RBI Report: కరోనా భయాలు- ఇంట్లోనే డబ్బులు!

మైక్రోబ్లాగింగ్ ప్లాట్​ఫామ్​ ట్విటర్ చేసిన ఆరోపణలపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. సరైన ఆధారం లేకున్నా ట్విటర్​ ఉద్దేశపూర్వక వ్యాఖ్యలు చేసి భారత్​ను కించపరిచే ప్రయత్నం చేసిందని కేంద్ర ఐటీ శాఖ మండిపడింది.

తొలుత.. భాజపా నేతల ట్వీట్​లకు 'మ్యానుపులేటెడ్ మీడియా' ట్యాగ్​ ఇచ్చిన తర్వాత.. పోలీసులు బెదిరింపులకు దిగుతున్నారని ట్విటర్ ఆరోపించింది. 'కొవిడ్​ టూల్​కిట్​' ఫిర్యాదు పేరుతో.. సమాచారం కావాలాని దిల్లీ పోలీసులు తమకు నోటీసులిచ్చి బెదిరింపులకు పాల్పడుతున్నట్లు పేర్కొంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో భారత్​లో తమ ఉద్యోగుల పట్ల ఆందోళనగా చెందుతున్నట్లు గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది.

దీనిపై ఆగ్రహించిన కేంద్ర ఐటీ శాఖ.. భారత్​లో సామాజిక మాధ్యమ సంస్థల భద్రతకు ఎలాంటి ముప్పు వాటిల్లదని స్పష్టం చేసింది. ఈ మేరకు సంస్థ ప్రతినిధులకు హామీ ఇచ్చినట్లు పేర్కొంది. ట్విటర్​ ఆరోపణలు భారత న్యాయవ్యవస్థపై అనుమానం వ్యక్తం చేస్తున్నట్లు ఉన్నాయని తెలిపింది.

అన్నీ అబద్ధాలే...

'కొవిడ్ టూల్​కిట్' వ్యవహారంలో ట్విటర్​ పూర్తిగా తప్పుడు ఆరోపణలు చేసిందని దిల్లీ పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఆరోపణలు చట్టబద్ధమైన దర్యాప్తును తప్పుపడుతున్నట్లు ఉన్నాయని పేర్కొన్నారు. దర్యాప్తు చేసే అధికారం, తీర్పు చెప్పే అధికారం రెండూ తమకే ఉన్నట్లు ట్విటర్​ ప్రవర్తిస్తోందని పోలీసులు తమ ప్రకటనలో వెల్లడించారు.

ఇదీ చదవండి:RBI Report: కరోనా భయాలు- ఇంట్లోనే డబ్బులు!

Last Updated : May 27, 2021, 7:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.