ETV Bharat / business

భారత్‌కు ప్రపంచ బ్యాంకు భారీ ఆర్థిక సాయం

భారత్​లో కొవిడ్ సంక్షోభం తలెత్తిన క్రమంలో ప్రపంచ బ్యాంకు భారీ ఆర్థిక సాయం ప్రకటించింది. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు పునరుజ్జీవం కల్పించే దిశగా 500 మిలియన్‌ డాలర్ల కార్యక్రమానికి ప్రపంచ బ్యాంకు ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్ల బోర్డు ఆమోదం తెలిపింది.

author img

By

Published : Jun 8, 2021, 5:01 AM IST

Worldbank
ప్రపంచ బ్యాంకు

కొవిడ్‌ సంక్షోభం వేళ భారత్‌కు ఆపన్నహస్తం అందించింది ప్రపంచ బ్యాంకు. కరోనాతో కుదేలైన సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు పునరుజ్జీవం కల్పించే దిశగా భారత ప్రభుత్వం చేపట్టే చర్యలకు సహకారం అందించేలా 500 మిలియన్‌ డాలర్ల కార్యక్రమానికి ప్రపంచ బ్యాంకు ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్ల బోర్డు ఆమోదం తెలిపింది.

5,55,000 ఎంఎస్‌ఎంఈలను బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు ప్రపంచబ్యాంకు ఓ ప్రకటనలో తెలిపింది.

"భారత ఆర్థిక వ్యవస్థకు ఎంఎస్‌ఎంఈ రంగం చాలా ముఖ్యమైంది. దేశ జీడీపీలో 30శాతం వాటా ఈ రంగానిదే. ఎగుమతుల్లోనూ 40 శాతం ఇక్కడి నుంచే. అయితే కొవిడ్‌ కారణంగా ఈ రంగం తీవ్రంగా కుదేలైంది. దీంతో ఎంఎస్‌ఎంఈల బలపేతం కోసం భారత్‌కు అండగా నిలిచేందుకు 500 మిలియన్‌ డాలర్లతో RAMP(రైజింగ్‌ అండ్‌ ఆక్సిలరేటింగ్‌ ఎంఎస్‌ఎంఈ పర్ఫామెన్స్‌) కార్యక్రమాన్ని చేపడుతున్నాం"

-- జునైద్‌ అహ్మద్‌, వరల్డ్‌ బ్యాంక్‌ ఇండియా డైరెక్టర్‌

ఈ కార్యక్రమం ద్వారా ఎంఎస్‌ఎంఈలకు ఆర్థిక సాయంతో పాటు ఈ రంగంలో ఉపాధి అవకాశాలను పెంచాలనుకుంటున్నాం అని జునైద్‌ అహ్మద్‌ తెలిపారు.

ఇదీ చదవండి : 'ట్రంప్ వాదన తప్పు... కరోనా బాధ్యత వారిదే'

కొవిడ్‌ సంక్షోభం వేళ భారత్‌కు ఆపన్నహస్తం అందించింది ప్రపంచ బ్యాంకు. కరోనాతో కుదేలైన సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు పునరుజ్జీవం కల్పించే దిశగా భారత ప్రభుత్వం చేపట్టే చర్యలకు సహకారం అందించేలా 500 మిలియన్‌ డాలర్ల కార్యక్రమానికి ప్రపంచ బ్యాంకు ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్ల బోర్డు ఆమోదం తెలిపింది.

5,55,000 ఎంఎస్‌ఎంఈలను బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు ప్రపంచబ్యాంకు ఓ ప్రకటనలో తెలిపింది.

"భారత ఆర్థిక వ్యవస్థకు ఎంఎస్‌ఎంఈ రంగం చాలా ముఖ్యమైంది. దేశ జీడీపీలో 30శాతం వాటా ఈ రంగానిదే. ఎగుమతుల్లోనూ 40 శాతం ఇక్కడి నుంచే. అయితే కొవిడ్‌ కారణంగా ఈ రంగం తీవ్రంగా కుదేలైంది. దీంతో ఎంఎస్‌ఎంఈల బలపేతం కోసం భారత్‌కు అండగా నిలిచేందుకు 500 మిలియన్‌ డాలర్లతో RAMP(రైజింగ్‌ అండ్‌ ఆక్సిలరేటింగ్‌ ఎంఎస్‌ఎంఈ పర్ఫామెన్స్‌) కార్యక్రమాన్ని చేపడుతున్నాం"

-- జునైద్‌ అహ్మద్‌, వరల్డ్‌ బ్యాంక్‌ ఇండియా డైరెక్టర్‌

ఈ కార్యక్రమం ద్వారా ఎంఎస్‌ఎంఈలకు ఆర్థిక సాయంతో పాటు ఈ రంగంలో ఉపాధి అవకాశాలను పెంచాలనుకుంటున్నాం అని జునైద్‌ అహ్మద్‌ తెలిపారు.

ఇదీ చదవండి : 'ట్రంప్ వాదన తప్పు... కరోనా బాధ్యత వారిదే'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.