ETV Bharat / business

Tesla: భారత్‌లోకి టెస్లా ప్రవేశం ఇప్పట్లో లేనట్లే!

ప్రముఖ విద్యుత్​ కార్ల తయారీ సంస్థ టెస్లా భారత్​లోకి ప్రవేశించే సూచనలు కనిపించడం లేదు. దిగుమతిపై సుంకాన్ని తగ్గించే ఆలోచనలు ఏమీ లేవని కేంద్రం స్పష్టం చేసింది.

author img

By

Published : Aug 3, 2021, 11:01 PM IST

tesla cars india launch
Tesla: భారత్‌లోకి టెస్లా ప్రవేశం ఇప్పట్లో లేనట్లే!

ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ పొందిన ప్రముఖ విద్యుత్తు కార్ల తయారీ సంస్థ టెస్లా (Tesla) ఇప్పట్లో భారత్‌లోకి ప్రవేశించే సూచనలు కనిపించడం లేదు. ఈ కార్ల దిగుమతిపై ఉన్న సుంకాన్ని తగ్గించాలని ఆయన ఇటీవల కేంద్ర ప్రభుత్వాన్ని కోరిన విషయం తెలిసిందే. కానీ, అలాంటి ఆలోచనలేవీ లేవని సంబంధిత కేంద్ర మంత్రి పార్లమెంటు వేదికగా స్పష్టం చేశారు.

జనాభాపరంగా ప్రపంచంలోనే రెండో అతిపెద్ద విపణి కలిగిన భారత్‌లోకి ప్రవేశించేందుకు టెస్లా గత కొంత కాలంగా కసరత్తు చేస్తోంది. అయితే, సంస్థ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్‌ ఓ షరతు విధించారు. తొలుత విదేశాల్లో తయారైన తమ కార్లను భారత్‌లో విక్రయిస్తామని తెలిపారు. తర్వాతే స్థానికంగా తయారీ యూనిట్‌ను నెలకొల్పుతామని తేల్చి చెప్పారు. అంతకంటే ముందు కార్ల దిగుమతిపై ఉన్న సుంకాన్ని తగ్గించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఇటీవల కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు.

తాజాగా దీనిపై కేంద్ర భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి కృష్ణపాల్‌ గుర్జర్‌ పార్లమెంటులో స్పందించారు. దిగుమతి సుంకాన్ని తగ్గించే ప్రతిపాదనేదీ ప్రభుత్వం దృష్టిలో లేదని స్పష్టం చేశారు. పైగా దేశీయ పన్నులు తగ్గించడం ద్వారా విద్యుత్తు వాహనాల వినియోగాన్ని ప్రోత్సహిస్తామని తెలిపారు. అలాగే ఛార్జింగ్‌ కేంద్రాలు సైతం నెలకొల్పుతామని వెల్లడించారు.

అయితే, భారత్‌లో తయారీని ప్రోత్సహించడానికే ప్రీమియం కార్లపై దిగుమతి సుంకాన్ని అధికంగా ఉంచారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు విద్యుత్తు వాహనాలకు డిమాండ్‌ పుంజుకుంటున్న నేపథ్యంలో అధిక సుంకాల వల్ల ఆయా సంస్థలు స్థానికంగా తయారీని చేపట్టే అవకాశం ఉంటుందని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇదీ చదవండి : ఓలా తొలి ఈ-స్కూటర్ విడుదల ఎప్పుడంటే..

ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ పొందిన ప్రముఖ విద్యుత్తు కార్ల తయారీ సంస్థ టెస్లా (Tesla) ఇప్పట్లో భారత్‌లోకి ప్రవేశించే సూచనలు కనిపించడం లేదు. ఈ కార్ల దిగుమతిపై ఉన్న సుంకాన్ని తగ్గించాలని ఆయన ఇటీవల కేంద్ర ప్రభుత్వాన్ని కోరిన విషయం తెలిసిందే. కానీ, అలాంటి ఆలోచనలేవీ లేవని సంబంధిత కేంద్ర మంత్రి పార్లమెంటు వేదికగా స్పష్టం చేశారు.

జనాభాపరంగా ప్రపంచంలోనే రెండో అతిపెద్ద విపణి కలిగిన భారత్‌లోకి ప్రవేశించేందుకు టెస్లా గత కొంత కాలంగా కసరత్తు చేస్తోంది. అయితే, సంస్థ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్‌ ఓ షరతు విధించారు. తొలుత విదేశాల్లో తయారైన తమ కార్లను భారత్‌లో విక్రయిస్తామని తెలిపారు. తర్వాతే స్థానికంగా తయారీ యూనిట్‌ను నెలకొల్పుతామని తేల్చి చెప్పారు. అంతకంటే ముందు కార్ల దిగుమతిపై ఉన్న సుంకాన్ని తగ్గించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఇటీవల కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు.

తాజాగా దీనిపై కేంద్ర భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి కృష్ణపాల్‌ గుర్జర్‌ పార్లమెంటులో స్పందించారు. దిగుమతి సుంకాన్ని తగ్గించే ప్రతిపాదనేదీ ప్రభుత్వం దృష్టిలో లేదని స్పష్టం చేశారు. పైగా దేశీయ పన్నులు తగ్గించడం ద్వారా విద్యుత్తు వాహనాల వినియోగాన్ని ప్రోత్సహిస్తామని తెలిపారు. అలాగే ఛార్జింగ్‌ కేంద్రాలు సైతం నెలకొల్పుతామని వెల్లడించారు.

అయితే, భారత్‌లో తయారీని ప్రోత్సహించడానికే ప్రీమియం కార్లపై దిగుమతి సుంకాన్ని అధికంగా ఉంచారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు విద్యుత్తు వాహనాలకు డిమాండ్‌ పుంజుకుంటున్న నేపథ్యంలో అధిక సుంకాల వల్ల ఆయా సంస్థలు స్థానికంగా తయారీని చేపట్టే అవకాశం ఉంటుందని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇదీ చదవండి : ఓలా తొలి ఈ-స్కూటర్ విడుదల ఎప్పుడంటే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.