స్వచ్ఛభారత్ అభియాన్ ద్వారా దేశవ్యాప్తంగా 9.6 కోట్ల శౌచాలయాలు నిర్మించినట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ తెలిపారు. 5.6 లక్షల గ్రామాలను ఓడీఎఫ్గా ప్రకటించామని స్పష్టం చేశారు. స్వచ్ఛభారత్ వల్ల పల్లె ప్రజల్లో చాలా మార్పు కన్పించదన్నారు.
ప్రధానమంత్రి డిజిటల్ సాక్షరత యోజన ద్వారా 2 కోట్ల మందికి గ్రామీణ యువతకు శిక్షణ అందించినట్లు మంత్రి తెలిపారు. రాబోయే రోజుల్లో సాంకేతిక అంతరాలు లేకుండా డిజిటల్ లిటరసీ కార్యక్రమాలను నగరాలు, పట్టణాలతో పాటు ప్రతి గ్రామాన్ని అనుసంధానం చేయనున్నారు.
ఇవీ చూడండి:'నవీన భారతావనికి 10 సూత్రాలు'