ETV Bharat / business

వాహన, బ్యాంకింగ్ రంగాల జోరు.. లాభాల్లో మార్కెట్లు

స్టాక్​ మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. వాహన, బ్యాంకింగ్, లోహ రంగాలు పుంజుకోవడం, అమెరికా-చైనా వాణిజ్య చర్చలు సానుకూలంగా సాగుతుండడమే ఇందుకు కారణం.

author img

By

Published : Sep 12, 2019, 10:02 AM IST

Updated : Sep 30, 2019, 7:40 AM IST

ఊపందుకున్న వాహన, బ్యాంకింగ్​ రంగాలు

వాహన, బ్యాంకింగ్, లోహ రంగాల​ షేర్ల కొనుగోళ్లకు మద్దతు లభించడం, సానుకూల అంతర్జాతీయ సంకేతాల నేపథ్యంలో ఇవాళ స్టాక్​మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. ఐటీ షేర్లు మాత్రం నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్​ 125 పాయింట్లు లాభపడి 37 వేల 396 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 35 పాయింట్లు వృద్ధి చెంది 11 వేల 071 వద్ద ట్రేడవుతోంది.

మందగమనంలోని ఆర్థిక వ్యవస్థకు చేయూతనివ్వడానికి, మౌలిక సదుపాయాల అభివృద్ధిలో మూలధన పెట్టుబడులకు తోడ్పాటు అందిస్తామన్న ప్రభుత్వ ప్రకటనతో మార్కెట్లు పుంజుకున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇవాళ దేశ స్థూల ఆర్థిక వ్యవస్థపై కేంద్ర ప్రభుత్వం సమగ్ర సమాచారం విడుదల చేయనుంది.

లాభాల్లో..

ఐసీఐసీఐ బ్యాంకు, టాటా స్టీల్​, ఇండస్​ఇండ్​ బ్యాంకు, వేదాంత, సన్ ఫార్మా, హెచ్​డీఎఫ్​సీ, ఎమ్​ అండ్​ ఎమ్​, మారుతీ, జేఎస్​డబ్ల్యూ స్టీల్​, ఐఓసీ, ఓఎన్​జీసీ, కోల్​ ఇండియా, ఎస్​బీఐ 2.43 శాతం మేర రాణిస్తున్నాయి.

నష్టాల్లో..

ఎస్​ బ్యాంకు, భారతీ ఇన్​ఫ్రాటెల్​, టాటా మోటార్స్​, భారతీ ఎయిర్​టెల్​, బజాజ్ ఆటో, ఇన్ఫోసిస్​, ఎన్​టీపీసీ, యాక్సిస్​ బ్యాంకు 2.72 శాతం మేర నష్టాల్లో కొనసాగుతున్నాయి.

ఆసియా మార్కెట్లు

అమెరికా-చైనా వాణిజ్య చర్చలకు సానుకూల వాతావరణం ఏర్పడడం, యూరోపియన్ సెంట్రల్​ బ్యాంకు సరళీకృత ద్రవ్య విధానాలు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో.. ఆసియా మార్కెట్లు లాభాల బాట పట్టాయి. నిక్కీ, కోస్పీ, షాంగై కాంపోజిట్ లాభాల్లో కొనసాగుతుండగా, హాంగ్​సెంగ్​ మాత్రం నష్టాల్లో ట్రేడవుతోంది.

రూపాయి విలువ

డాలర్​తో పాల్చుకుంటే రూపాయి విలువ 33 పైసలు పెరిగి... ఒక డాలరుకు రూ.71.33గా ఉంది.

ముడిచమురు

ప్రపంచ మార్కెట్​లో ముడిచమురు ధర 0.43శాతం పెరిగింది. బ్యారెల్ ముడిచమురు ధర ప్రస్తుతం 61.24 డాలర్లుగా ఉంది.

ఇదీ చూడండి: సెప్టెంబర్​ 27 నుంచి భారత మార్కెట్లోకి కొత్త తరం ఐఫోన్లు

వాహన, బ్యాంకింగ్, లోహ రంగాల​ షేర్ల కొనుగోళ్లకు మద్దతు లభించడం, సానుకూల అంతర్జాతీయ సంకేతాల నేపథ్యంలో ఇవాళ స్టాక్​మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. ఐటీ షేర్లు మాత్రం నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్​ 125 పాయింట్లు లాభపడి 37 వేల 396 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 35 పాయింట్లు వృద్ధి చెంది 11 వేల 071 వద్ద ట్రేడవుతోంది.

మందగమనంలోని ఆర్థిక వ్యవస్థకు చేయూతనివ్వడానికి, మౌలిక సదుపాయాల అభివృద్ధిలో మూలధన పెట్టుబడులకు తోడ్పాటు అందిస్తామన్న ప్రభుత్వ ప్రకటనతో మార్కెట్లు పుంజుకున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇవాళ దేశ స్థూల ఆర్థిక వ్యవస్థపై కేంద్ర ప్రభుత్వం సమగ్ర సమాచారం విడుదల చేయనుంది.

లాభాల్లో..

ఐసీఐసీఐ బ్యాంకు, టాటా స్టీల్​, ఇండస్​ఇండ్​ బ్యాంకు, వేదాంత, సన్ ఫార్మా, హెచ్​డీఎఫ్​సీ, ఎమ్​ అండ్​ ఎమ్​, మారుతీ, జేఎస్​డబ్ల్యూ స్టీల్​, ఐఓసీ, ఓఎన్​జీసీ, కోల్​ ఇండియా, ఎస్​బీఐ 2.43 శాతం మేర రాణిస్తున్నాయి.

నష్టాల్లో..

ఎస్​ బ్యాంకు, భారతీ ఇన్​ఫ్రాటెల్​, టాటా మోటార్స్​, భారతీ ఎయిర్​టెల్​, బజాజ్ ఆటో, ఇన్ఫోసిస్​, ఎన్​టీపీసీ, యాక్సిస్​ బ్యాంకు 2.72 శాతం మేర నష్టాల్లో కొనసాగుతున్నాయి.

ఆసియా మార్కెట్లు

అమెరికా-చైనా వాణిజ్య చర్చలకు సానుకూల వాతావరణం ఏర్పడడం, యూరోపియన్ సెంట్రల్​ బ్యాంకు సరళీకృత ద్రవ్య విధానాలు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో.. ఆసియా మార్కెట్లు లాభాల బాట పట్టాయి. నిక్కీ, కోస్పీ, షాంగై కాంపోజిట్ లాభాల్లో కొనసాగుతుండగా, హాంగ్​సెంగ్​ మాత్రం నష్టాల్లో ట్రేడవుతోంది.

రూపాయి విలువ

డాలర్​తో పాల్చుకుంటే రూపాయి విలువ 33 పైసలు పెరిగి... ఒక డాలరుకు రూ.71.33గా ఉంది.

ముడిచమురు

ప్రపంచ మార్కెట్​లో ముడిచమురు ధర 0.43శాతం పెరిగింది. బ్యారెల్ ముడిచమురు ధర ప్రస్తుతం 61.24 డాలర్లుగా ఉంది.

ఇదీ చూడండి: సెప్టెంబర్​ 27 నుంచి భారత మార్కెట్లోకి కొత్త తరం ఐఫోన్లు

RESTRICTION SUMMARY: MUST CREDIT ABC15 ARIZONA, MUST KEEP CREDIT UP THROUGH ENTIRE VIDEO, NO USE PHOENIX, TUCSON, YUMA MARKETS, NO ACCESS US BROADCAST NETWORKS, NO RE-SALE, RE-USE OR ARCHIVE
SHOTLIST:
KNXV - MUST CREDIT ABC15 ARIZONA, MUST KEEP CREDIT UP THROUGH ENTIRE VIDEO, NO USE PHOENIX, TUCSON, YUMA MARKETS, NO ACCESS US BROADCAST NETWORKS, NO RE-SALE, RE-USE OR ARCHIVE
Tempe, Arizona -11 September 2019
1. Various of flags at Tempe Beach Park to mark the anniversary of Sept. 11 attacks
2. Various of memorial service at Tempe Beach Park
STORYLINE:
Volunteers set up hundreds of American flags at a park in a Phoenix suburb Wednesday to mark the 18th anniversary of the Sept.11 terrorist attacks.
According to the Arizona Republic, this was the 16th year for the memorial, called the Healing Field.
Each flag has a card which includes the name and details of each victim of the terrorist attacks.
The flags will remain in place throughout Thursday.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Sep 30, 2019, 7:40 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.