ETV Bharat / business

రిలయన్స్ ఇండస్ట్రీ​స్ బోర్డ్​లోకి ఆరాంకో ప్రతినిధి?

author img

By

Published : Jun 20, 2021, 7:00 PM IST

రిలయన్స్​ ఇండస్ట్రీస్ లిమిటెడ్​ (ఆర్​ఐఎల్​) బోర్డ్​లో సౌదీ ఆరాంకో ప్రతినిధి చేరనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. జూన్​ 24న జరుగనున్న ఆర్​ఐఎల్​ వార్షిక సర్వసభ్య సమావేశానికి ముందే ఈ విషయం తెలనుంది. ఆ ప్రతినిధి ఎవరు? ఆరాంకో-ఆర్​ఐఎల్​ డీల్ ఎంత వరకు వచ్చింది అనే వివరాలు ఇలా ఉన్నాయి.

Saudi Aramco
సౌదీ ఆరాంకో కంపెనీ

సౌదీ ఆరాంకో ఛైర్మన్​ యాసిర్​ అల్​-రుమయ్యన్.. రిలయన్స్​ ఇండస్ట్రీస్ లిమిటెడ్​ (ఆర్​ఐఎల్​) బోర్డ్​లో చేరనున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆర్​ఐఎల్​లో 15 బిలియన్​ డాలర్ల పెట్టుబడి ఒప్పందం ద్వారా ఇది సాధ్యమవచ్చని తెలుస్తోంది. జూన్​ 24న జరగనున్న ఆర్​ఐఎల్​ వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం)కు ముందే ఈ విషయంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

ఆరాంకో ఒప్పందంపై ప్రకటన 2019లోనే..

ఆయిల్​-కెమికల్స్​ (ఓ2సీ)వ్యాపారంలో 20 శాతం వాటాను సౌదీ ఆరాంకోకు విక్రయించనున్నట్లు ముకేశ్​ అంబానీ 2019లోనే ప్రకటించారు. ఇరు సంస్థల మధ్య మార్చి 2020 కల్లా ఒప్పందం జరగాల్సి ఉండగా.. కరోనా కారణంగా అది ఆగిపోయింది. అయితే.. ఇరు కంపెనీలు ఈ విషయంపై ఇటీవల మళ్లీ చర్చలు ప్రారంభించినట్లు తెలిసింది.

ఆర్​ఐఎల్​ డిజిటల్, రీటైల్​ వ్యాపారంలో గత ఏడాది కొత్త వాటాదారులు చేరారు. గూగుల్​, ఫేస్​బుక్​, మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలతో ఆ సంస్థ భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ సంస్థలకు త్వరలోనే ఆర్​ఐఎల్​ మార్గదర్శకాలను ఇస్తుందని అంచనాలు ఉన్నాయి. ఏజీఎం​లోనే జియో గూగుల్​ ఫోన్​ (5జీ), జియో మార్ట్ - వాట్సప్​ ఇంటిగ్రేషన్​పై స్పష్టత రానుంది.

ఏజీఎంకు ప్రత్యేకత..

రిలయన్స్ ఇండస్ట్రీస్​ ఏజీఎం అంటే వాటాదారులతో పాటు సాధారణ ప్రజలకు కూడా భారీ అంచనాలు ఉంటాయి. రిలయన్స్ జియో వంటి సంచలన నిర్ణయాన్ని ఏజీఎంలోనే ప్రకటించింది కంపెనీ. కరోనా వల్ల గత ఏడాది వర్చువల్​గా ఏజీఎం నిర్వహించింది ఆర్​ఐఎల్​. దీనిని దాదాపు 3 లక్షల మంది వీక్షించారు. 2019లో ప్రత్యక్షంగా జరిగిన ఏజీఎంలో 3,000 మంది వాటాదారులు పాల్గొన్నారు.

ఇవీ చదవండి:

రిలయన్స్​ సీఎస్​ఆర్​ నిధులు రూ.1,140కోట్లు

ఇలా చేస్తే బ్యాటరీ కార్ల మైలేజ్​ రెట్టింపు!

సౌదీ ఆరాంకో ఛైర్మన్​ యాసిర్​ అల్​-రుమయ్యన్.. రిలయన్స్​ ఇండస్ట్రీస్ లిమిటెడ్​ (ఆర్​ఐఎల్​) బోర్డ్​లో చేరనున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆర్​ఐఎల్​లో 15 బిలియన్​ డాలర్ల పెట్టుబడి ఒప్పందం ద్వారా ఇది సాధ్యమవచ్చని తెలుస్తోంది. జూన్​ 24న జరగనున్న ఆర్​ఐఎల్​ వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం)కు ముందే ఈ విషయంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

ఆరాంకో ఒప్పందంపై ప్రకటన 2019లోనే..

ఆయిల్​-కెమికల్స్​ (ఓ2సీ)వ్యాపారంలో 20 శాతం వాటాను సౌదీ ఆరాంకోకు విక్రయించనున్నట్లు ముకేశ్​ అంబానీ 2019లోనే ప్రకటించారు. ఇరు సంస్థల మధ్య మార్చి 2020 కల్లా ఒప్పందం జరగాల్సి ఉండగా.. కరోనా కారణంగా అది ఆగిపోయింది. అయితే.. ఇరు కంపెనీలు ఈ విషయంపై ఇటీవల మళ్లీ చర్చలు ప్రారంభించినట్లు తెలిసింది.

ఆర్​ఐఎల్​ డిజిటల్, రీటైల్​ వ్యాపారంలో గత ఏడాది కొత్త వాటాదారులు చేరారు. గూగుల్​, ఫేస్​బుక్​, మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలతో ఆ సంస్థ భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ సంస్థలకు త్వరలోనే ఆర్​ఐఎల్​ మార్గదర్శకాలను ఇస్తుందని అంచనాలు ఉన్నాయి. ఏజీఎం​లోనే జియో గూగుల్​ ఫోన్​ (5జీ), జియో మార్ట్ - వాట్సప్​ ఇంటిగ్రేషన్​పై స్పష్టత రానుంది.

ఏజీఎంకు ప్రత్యేకత..

రిలయన్స్ ఇండస్ట్రీస్​ ఏజీఎం అంటే వాటాదారులతో పాటు సాధారణ ప్రజలకు కూడా భారీ అంచనాలు ఉంటాయి. రిలయన్స్ జియో వంటి సంచలన నిర్ణయాన్ని ఏజీఎంలోనే ప్రకటించింది కంపెనీ. కరోనా వల్ల గత ఏడాది వర్చువల్​గా ఏజీఎం నిర్వహించింది ఆర్​ఐఎల్​. దీనిని దాదాపు 3 లక్షల మంది వీక్షించారు. 2019లో ప్రత్యక్షంగా జరిగిన ఏజీఎంలో 3,000 మంది వాటాదారులు పాల్గొన్నారు.

ఇవీ చదవండి:

రిలయన్స్​ సీఎస్​ఆర్​ నిధులు రూ.1,140కోట్లు

ఇలా చేస్తే బ్యాటరీ కార్ల మైలేజ్​ రెట్టింపు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.