గెలాక్సీ(Galaxy) సీరిస్తో వినియోగదారులను ఆకట్టుకుంటున్న శాంసంగ్(Samsung) తాజాగా మార్కెట్లోకి కొత్త ట్యాబ్లను ప్రవేశపెట్టింది. గెలాక్సీ ట్యాబ్ ఎస్7 ఎఫ్ఈ(Galaxy Tab S7 F), గెలాక్సీ ట్యాబ్ ఏ7 లైట్(Galaxy Tab A7 Lite)లను విపణిలోకి విడుదల చేసింది. వినోదంతో పాటు మల్టీటాస్కింగ్లకు పెద్ద పీట వేస్తూ ఈ ట్యాబ్లను డిజైన్ చేసినట్లు పేర్కొంది.
ఎస్7 ఎఫ్ఈ ఫీచర్లు..
- ఎస్7 ఎఫ్ఈ మోడల్కు శాంసంగ్ 12.4 ఇంచ్ భారీ డిస్ప్లేను అందిస్తోంది.
- ఈ ట్యాబ్ రెండు వేరియంట్లలో లభ్యమవుతుంది. ఒకదానికి 4జీబీ ర్యామ్ 64 జీబీ స్టోరేజ్ ఉండగా.. మరొకటి 6 జీబీ ర్యామ్ 126 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్తో అందుబాటులో ఉంటుంది. ఈ స్టోరేజ్ను మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో 1టెరా బైట్ వరకు పెంచుకోవచ్చు.
- ఆండ్రాయిడ్ 11, ఆక్టాకోర్ ప్రాసెసర్తో నడిచే ఈ ట్యాబ్ బ్యాటరీ సామర్థ్యం 10,090 ఎంఏహెచ్
- ఈ ఎస్7 ఎఫ్ఈ ఫ్రంట్ కెమేరా 5 మెగాపిక్సల్స్, రేర్ కెమేరా 8 మెగాపిక్సల్స్.
ఏ7 లైట్..
- 8.7 ఇంచ్ స్క్రీన్ ఉండే ఏ7 లైట్కి డాల్బై అట్మస్ సదుపాయం ఉన్న డ్యూయల్ స్పీకర్స్ అందుబాటులో ఉంటాయి.
- 3 జీబీ , 4 జీబీ ర్యామ్ వేరియంట్లలో లభించే ఈ ట్యాబ్ గ్రే, సిల్వర్ రంగులలో మార్కెట్లోకి రానుంది.
జూన్ నుంచి ఈ ట్యాబ్లు అందుబాటులో ఉంటాయని శాంసంగ్ వెల్లడించింది.
ఇదీ చదవండి : ఆ సంస్థ ఉద్యోగులకు ప్రత్యేక కొవిడ్ బీమా!