ETV Bharat / business

ఆర్​టీజీఎస్​, నెఫ్ట్​ ఛార్జీల్లేవ్​.. ఆర్​బీఐ తీపికబురు

బ్యాంకు ఖాతాదారులకు డిజిటల్​ చెల్లింపుల్లో ప్రోత్సాహం అందించే విధంగా కేంద్ర బ్యాంకు శుభవార్త చెప్పింది. ఆర్​టీజీఎస్​, నెఫ్ట్​ ద్వారా జరిపే లావాదేవీలపై రుసుములను ఎత్తివేసింది.

author img

By

Published : Jun 6, 2019, 5:18 PM IST

ఆర్​టీజీఎస్​, నెఫ్ట్​ ఛార్జీల్లేవ్​.. ఆర్​బీఐ తీపికబురు

డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేలా రిజర్వ్​ బ్యాంకు ద్రవ్య పరపతి విధాన కమిటీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. వడ్డీ రేట్లను మరోసారి తగ్గించిన ఆర్​బీఐ.. బ్యాంకు ఖాతాదారులకూ శుభవార్త చెప్పింది. ఆర్​టీజీఎస్​, ఎన్​ఈఎఫ్​టీ లావాదేవీలపై రుసుములను ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది.

ద్రవ్య పరపతి విధాన సమీక్షలో భాగంగా ఎంపీసీ... ఆర్టీజీఎస్‌, నెఫ్ట్‌లపై విధిస్తున్న చార్జీలన్నింటినీ తొలగించాలని నిర్ణయించింది. ఈ ప్రతిపాదనకు ఆరుగురు సభ్యుల కమిటీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది.

ఛార్జీల ఎత్తివేతతో కలిగే ప్రయోజనాలను ఖాతాదారులకు చేరేలా బ్యాంకులే చూడాలని కోరింది ఆర్​బీఐ. దీనిపై వారంలోగా బ్యాంకులకు మార్గనిర్దేశకాలు జారీ చేస్తామని తెలిపింది.

ఆర్​టీజీఎస్​, నెఫ్ట్​ అంటే...

రియల్​ టైం గ్రాస్​ సెటిల్​మెంట్​ సిస్టమ్​(ఆర్​టీజీఎస్​), నేషనల్​ ఎలక్ట్రానిక్​ ఫండ్స్​ ట్రాన్స్​ఫర్​(నెఫ్ట్​) ద్వారా ఆన్​లైన్​ లావాదేవీలు జరపవచ్చు. ఆర్​టీజీఎస్​ నుంచి ఎక్కువ మొత్తంలో తక్షణమే బదిలీ చేయొచ్చు. నెఫ్ట్​తో రూ. 2 లక్షల లోపు లావాదేవీలు చేయొచ్చు.

వీటికి ఛార్జీలను ఆర్​బీఐ బ్యాంకుల నుంచి, బ్యాంకులు ఖాతాదారుల నుంచి వసూలు చేస్తున్నాయి. డిజిటల్​ లావాదేవీలను ప్రోత్సహించేందుకు ఈ ఛార్జీలను ఎత్తివేసింది ఆర్​బీఐ.

ఎస్​బీఐ ఛార్జీలు...

దేశంలో అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు ఎస్​బీఐ.. ప్రస్తుతం నెఫ్ట్​ లావాదేవీలపై రూ. 1 నుంచి 5 వరకు, ఆర్​టీజీఎస్​పై రూ. 5 నుంచి 50 వరకు ఛార్జీలు వసూలు చేస్తోంది.

ఏటీఎం ఛార్జీలపైనా...

ఏటీఎం ఛార్జీలనూ పరిశీలించేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ఆర్‌బీఐ వెల్లడించింది. వీటి వినియోగ రుసుములపై సమీక్షించేందుకు భారతీయ బ్యాంకుల సంఘం అధ్యక్షతన.. వాటాదారులందరితో ప్రత్యేక ప్యానెల్​ను ఏర్పాటు చేస్తారు. ఏటీఎం ఛార్జీలపై ఈ కమిటీ 2 నెలల్లో నివేదిక సమర్పించాల్సి ఉంటుంది.

డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేలా రిజర్వ్​ బ్యాంకు ద్రవ్య పరపతి విధాన కమిటీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. వడ్డీ రేట్లను మరోసారి తగ్గించిన ఆర్​బీఐ.. బ్యాంకు ఖాతాదారులకూ శుభవార్త చెప్పింది. ఆర్​టీజీఎస్​, ఎన్​ఈఎఫ్​టీ లావాదేవీలపై రుసుములను ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది.

ద్రవ్య పరపతి విధాన సమీక్షలో భాగంగా ఎంపీసీ... ఆర్టీజీఎస్‌, నెఫ్ట్‌లపై విధిస్తున్న చార్జీలన్నింటినీ తొలగించాలని నిర్ణయించింది. ఈ ప్రతిపాదనకు ఆరుగురు సభ్యుల కమిటీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది.

ఛార్జీల ఎత్తివేతతో కలిగే ప్రయోజనాలను ఖాతాదారులకు చేరేలా బ్యాంకులే చూడాలని కోరింది ఆర్​బీఐ. దీనిపై వారంలోగా బ్యాంకులకు మార్గనిర్దేశకాలు జారీ చేస్తామని తెలిపింది.

ఆర్​టీజీఎస్​, నెఫ్ట్​ అంటే...

రియల్​ టైం గ్రాస్​ సెటిల్​మెంట్​ సిస్టమ్​(ఆర్​టీజీఎస్​), నేషనల్​ ఎలక్ట్రానిక్​ ఫండ్స్​ ట్రాన్స్​ఫర్​(నెఫ్ట్​) ద్వారా ఆన్​లైన్​ లావాదేవీలు జరపవచ్చు. ఆర్​టీజీఎస్​ నుంచి ఎక్కువ మొత్తంలో తక్షణమే బదిలీ చేయొచ్చు. నెఫ్ట్​తో రూ. 2 లక్షల లోపు లావాదేవీలు చేయొచ్చు.

వీటికి ఛార్జీలను ఆర్​బీఐ బ్యాంకుల నుంచి, బ్యాంకులు ఖాతాదారుల నుంచి వసూలు చేస్తున్నాయి. డిజిటల్​ లావాదేవీలను ప్రోత్సహించేందుకు ఈ ఛార్జీలను ఎత్తివేసింది ఆర్​బీఐ.

ఎస్​బీఐ ఛార్జీలు...

దేశంలో అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు ఎస్​బీఐ.. ప్రస్తుతం నెఫ్ట్​ లావాదేవీలపై రూ. 1 నుంచి 5 వరకు, ఆర్​టీజీఎస్​పై రూ. 5 నుంచి 50 వరకు ఛార్జీలు వసూలు చేస్తోంది.

ఏటీఎం ఛార్జీలపైనా...

ఏటీఎం ఛార్జీలనూ పరిశీలించేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ఆర్‌బీఐ వెల్లడించింది. వీటి వినియోగ రుసుములపై సమీక్షించేందుకు భారతీయ బ్యాంకుల సంఘం అధ్యక్షతన.. వాటాదారులందరితో ప్రత్యేక ప్యానెల్​ను ఏర్పాటు చేస్తారు. ఏటీఎం ఛార్జీలపై ఈ కమిటీ 2 నెలల్లో నివేదిక సమర్పించాల్సి ఉంటుంది.

Tamluk (West Bengal), May 06 (ANI): Prime Minister Narendra Modi addressed a public rally in WB's Tamluk. During his rally, PM Modi hit at Chief Minister of West Bengal Mamata Banerjee over cyclone Fani. PM Modi said, "Government of India and central government are working hard on relief and rescue work. But our West Bengal's 'speed breaker didi' has tried to play politics even on cyclone Fani. I tried to get in touch with Mamata didi but her arrogance is such that she refused to talk to me, I tried again but she did not get in touch. I kept on waiting that probably didi would call me back but she didn't. I was worried for the people of West Bengal and hence, wanted to talk to her. But, even for the second time she didn't talk to me."
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.