దేశంలో విద్యుత్ డిమాండ్ శనివారం సరికొత్త రికార్డును నమోదు చేసింది. తొలిసారి 189.64 గిగావాట్ల డిమాండ్ నమోదైనట్లు కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
ఇంతకు ముందు ఇదే నెల 28న.. 1,88,452 మెగావాట్లుగా విద్యుత్ డిమాండ్ నమోదైనట్లు తెలిపింది. తాజాగా ఇది 1,89,644 మెగావాట్ల మార్క్ను (ఉదయం 10:39 ) తాకినట్లు కేంద్ర విద్యుత్ శాఖ కార్యదర్శి ఎస్ఎన్ సహాయ్ ట్వీట్ చేశారు.
అయితే త్వరలోనే డిమాండ్ స్థాయి 200 గిగావాట్లకు చేరుకుంటుందని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ పేర్కొన్నారు.
గత జనవరిలో గరిష్ఠ విద్యుత్ డిమాండ్ 170.97 గిగావాట్లుగా ఉండేది. కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టి.. పారిశ్రామిక కార్యకలాపాలు పుంజుకున్నందున విద్యుత్ వినియోగం భారీగా పెరిగినట్టు తెలుస్తోంది.
కొవిడ్-19 వ్యాప్తితో విధించిన దేశవ్యాప్త లాక్డౌన్ కారణంగా ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు విద్యుత్ డిమాండ్పై తీవ్ర ప్రభావం ఏర్పడింది. అయితే.. సెప్టెంబర్ నుంచి విద్యుత్ డిమాండ్ గణనీయంగా కోలుకుంది. అదే నెలలో 1.7శాతం, అక్టోబర్లో 3.4 శాతం, నవంబర్ 3.5 శాతం, డిసెంబర్ 7.3 శాతం పెరిగింది.