ప్రముఖ ఆన్లైన్ క్యాబ్ సేవల సంస్థ ఓలా.. వచ్చే ఏడాది జనవరి నాటికి ఈ-స్కూటర్లను తీసుకొచ్చే యోచనలో ఉన్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. నెదర్లాండ్స్లో తయారైన ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లను భారత్తో పాటు ఐరోపా దేశాల్లో అమ్మకాలు నిర్వహించనున్నట్టు సమాచారం.
ఈ ఏడాది మేలో ఆమ్స్టర్డామ్- ఎటర్గో బీవీని కొనుగోలు చేస్తున్నట్టు ప్రకటించింది ఈ క్యాబ్ సేవల సంస్థ. ఆ సమయంలోనే.. 2021లో దేశంలో ఎలక్ట్రిక్ ద్విచక్రవాహనాన్ని తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపింది.
అయితే.. ధరలు మాత్రం ప్రస్తుత పెట్రోల్ స్కూటర్లకు పోటీగా ఉండే అవకాశమున్నట్టు సమాచారం. తొలి ఏడాదిలో.. సుమారు 10లక్షల ఈ-స్కూటర్ల అమ్మకాలకు పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది.
ఇదీ చదవండి: వర్క్ ఫ్రం హోం ఇచ్చినా.. ఆఫీస్ల లీజులు పొడిగింపు