ETV Bharat / business

కొవిడ్​-19 వ్యాక్సిన్​ ఆగస్టు 15 లోపు కష్టమే!

author img

By

Published : Jul 11, 2020, 7:23 AM IST

Updated : Jul 11, 2020, 7:37 AM IST

భారత్​లో అభివృద్ధి చేస్తోన్న కొవిడ్​-19 వ్యాక్సిన్లు అన్ని రకాల కఠిన నిబంధనలు అనుసరించి క్లినికల్​ ట్రయల్స్​ పూర్తి చేస్తాయని స్పష్టం చేశారు ప్రభుత్వ ప్రధాన​ శాస్త్రీయ సలహాదారు విజయ రాఘవన్​. వ్యాక్సిన్​ ట్రయల్స్​ మూడు దశల్లో ఉంటాయని.. అందుకు చాలా సమయం పడుతుందని పేర్కొన్నారు. భారత్​ బయోటెక్​-ఐసీఎంఆర్​ అభివృద్ది చేస్తోన్న కోవాగ్జిన్‌ ఆగస్టు 15లోపు రాదని రాఘవన్ వ్యాఖ్యలు సూచిస్తున్నాయి.

vaccine
కొవిడ్​-19 వ్యాక్సిన్​ ఆగస్టు 15 లోపు కష్టమే!

భారత్​లో కొవిడ్​-19 వ్యాక్సిన్​ అభివృద్ధి చేస్తోన్న సంస్థలు కఠినమైన నిబంధనలన్నింటినీ అనుసరించే ట్రయల్స్​ పూర్తి చేస్తాయని తెలిపారు ప్రభుత్వ ప్రధాన శాస్త్రీయ సలహాదారు కే.విజయరాఘవన్​. అందులో ఎలాంటి రాజీ ఉండబోదని స్పష్టం చేశారు. రాఘవన్ వ్యాఖ్యలు ఐసీఎంఆర్​- భారత్​ బయోటెక్ అభివృద్ధి చేసిన​ కోవాగ్జిన్​ వ్యాక్సిన్.. ఆగస్టు 15లోగా అందుబాటులోకి వచ్చే అవకాశం లేదని సూచిస్తున్నాయి.

వివేకానంద అంతర్జాతీయ ఫౌండేషన్​ ఆధ్వర్యంలో నిర్వహించిన వెబినార్​లో పాల్గొన్న సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు విజయ రాఘవన్​.

" ఏ వ్యాక్సిన్​కైనా మనుషులపై క్లినికల్​ ట్రయల్స్​ తొలి దశ సాధారణంగా 28 రోజులు పడుతుంది. అది పూర్తయిన తర్వాతే మిగతా దశలను ప్రారంభిస్తారు. ఇప్పటికే భారత్​ బయోటెక్​ వ్యాక్సిన్​, జైడస్​ కాడిలా వ్యాక్సిన్​ క్లినికల్​ ట్రయల్స్​కు భారత ఔషధ నియంత్రణ సంస్థ అనుమతులు ఇచ్చింది. కాబట్టి ఈ రెండు సంస్థల వ్యాక్సిన్లు కఠినమైన ప్రక్రియలను ఎదుర్కొని ట్రయల్స్​ను పూర్తి చేస్తాయి. అందులో ఎలాంటి రాజీ లేదు. ఒకవేళ తక్షణమే వ్యాక్సిన్​ అందుబాటులోకి వచ్చినా.. తీవ్రంగా అనారోగ్యానికి గురైన వారికి ప్రాధాన్యం ఇవ్వటం వల్ల అది అందరికి అందేసరికి దాదాపు రెండు సంవత్సరాల సమయం పడుతుంది."

- కే. విజయ్​ రాఘవన్​, ప్రభుత్వ ప్రధాన శాస్త్రీయ సలహాదారు​

ప్రస్తుతం భారత్‌ బయోటెక్‌- ఐసీఎంఆర్ భాగస్వామ్యంలో కోవాగ్జిన్‌ పేరుతో వైరస్‌కు వ్యాక్సిన్‌ రూపకల్పన జరుగుతోంది. ఈ వ్యాక్సిన్‌ను ఆగస్టు 15లోపు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని కొన్ని రోజుల ముందు ఐసీఎంఆర్ ప్రకటించింది. ఈ అంశమై స్పందించిన రాఘవన్ జులై 10న క్లినికల్​ ట్రయల్స్​ తొలి దశ ప్రారంభమైందని.. అలాగే మిగతా 12 కేంద్రాల్లో ఒకేసారి ప్రారంభిస్తారని పేర్కొన్నారు. సాధారణంగా ఇంత తక్కువ సమయంలో అందుబాటులోకి రాదని చెప్పారు.

ప్రక్రియ వేగవంతం ఎలా?..

ఈ ప్రక్రియను వేగవంతం ఎలా చేస్తారు అనే ప్రశ్నకు బదులుగా.. తొలి, రెండో దశను ఒకేసారి నిర్వహిస్తారని, ఈ రెండు దశల్లో మనుషుల భద్రత, రోగనిరోధక శక్తి అంశాలపై దృష్టిసారిస్తారని తెలిపారు రాఘవన్​. మూడో దశకు భారీ సంఖ్యలో ప్రజలు అవసరమవుతారని.. దానికి ఎక్కువ సమయం పడుతుందన్నారు. అయితే సమయాన్ని కుదించొచ్చని సూచించారు. సాధారణంగా ఈ ప్రక్రియ మొత్తానికి 5-10 ఏళ్లు పడుతుందని, కానీ, దానిని 12-15 నెలలకు తీసుకొస్తారని పేర్కొన్నారు. ఒకేసారి వివిధ దశలను నిర్వహిస్తున్నందున చాలా భారీగా ఖర్చు అవుతుందని తెలిపారు.

వాటితో పాటుగా ఉత్పత్తి, స్టాక్​, సరఫరాలను అందుబాటులోకి తేవడం కూడా ఒకేసారి చెయ్యొచ్చని పేర్కొన్నారు రాఘవన్​.

విమర్శలు

కొవిడ్​-19 వ్యాక్సిన్​ను అభివృద్ధి చేసే ప్రక్రియను వేగవంతం చేయటంపై పలువురు నిపుణులు ఇప్పటికే హెచ్చరిస్తున్నారు. మహమ్మారుల కోసం తయారు చేసే వ్యాక్సిన్ల ప్రక్రియను వేగవంతం చేయటం అంతర్జాతీయ ప్రమాణాలను పాటించలేవని పేర్కొంటున్నారు.

భారత్​లో కొవిడ్​-19 వ్యాక్సిన్​ అభివృద్ధి చేస్తోన్న సంస్థలు కఠినమైన నిబంధనలన్నింటినీ అనుసరించే ట్రయల్స్​ పూర్తి చేస్తాయని తెలిపారు ప్రభుత్వ ప్రధాన శాస్త్రీయ సలహాదారు కే.విజయరాఘవన్​. అందులో ఎలాంటి రాజీ ఉండబోదని స్పష్టం చేశారు. రాఘవన్ వ్యాఖ్యలు ఐసీఎంఆర్​- భారత్​ బయోటెక్ అభివృద్ధి చేసిన​ కోవాగ్జిన్​ వ్యాక్సిన్.. ఆగస్టు 15లోగా అందుబాటులోకి వచ్చే అవకాశం లేదని సూచిస్తున్నాయి.

వివేకానంద అంతర్జాతీయ ఫౌండేషన్​ ఆధ్వర్యంలో నిర్వహించిన వెబినార్​లో పాల్గొన్న సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు విజయ రాఘవన్​.

" ఏ వ్యాక్సిన్​కైనా మనుషులపై క్లినికల్​ ట్రయల్స్​ తొలి దశ సాధారణంగా 28 రోజులు పడుతుంది. అది పూర్తయిన తర్వాతే మిగతా దశలను ప్రారంభిస్తారు. ఇప్పటికే భారత్​ బయోటెక్​ వ్యాక్సిన్​, జైడస్​ కాడిలా వ్యాక్సిన్​ క్లినికల్​ ట్రయల్స్​కు భారత ఔషధ నియంత్రణ సంస్థ అనుమతులు ఇచ్చింది. కాబట్టి ఈ రెండు సంస్థల వ్యాక్సిన్లు కఠినమైన ప్రక్రియలను ఎదుర్కొని ట్రయల్స్​ను పూర్తి చేస్తాయి. అందులో ఎలాంటి రాజీ లేదు. ఒకవేళ తక్షణమే వ్యాక్సిన్​ అందుబాటులోకి వచ్చినా.. తీవ్రంగా అనారోగ్యానికి గురైన వారికి ప్రాధాన్యం ఇవ్వటం వల్ల అది అందరికి అందేసరికి దాదాపు రెండు సంవత్సరాల సమయం పడుతుంది."

- కే. విజయ్​ రాఘవన్​, ప్రభుత్వ ప్రధాన శాస్త్రీయ సలహాదారు​

ప్రస్తుతం భారత్‌ బయోటెక్‌- ఐసీఎంఆర్ భాగస్వామ్యంలో కోవాగ్జిన్‌ పేరుతో వైరస్‌కు వ్యాక్సిన్‌ రూపకల్పన జరుగుతోంది. ఈ వ్యాక్సిన్‌ను ఆగస్టు 15లోపు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని కొన్ని రోజుల ముందు ఐసీఎంఆర్ ప్రకటించింది. ఈ అంశమై స్పందించిన రాఘవన్ జులై 10న క్లినికల్​ ట్రయల్స్​ తొలి దశ ప్రారంభమైందని.. అలాగే మిగతా 12 కేంద్రాల్లో ఒకేసారి ప్రారంభిస్తారని పేర్కొన్నారు. సాధారణంగా ఇంత తక్కువ సమయంలో అందుబాటులోకి రాదని చెప్పారు.

ప్రక్రియ వేగవంతం ఎలా?..

ఈ ప్రక్రియను వేగవంతం ఎలా చేస్తారు అనే ప్రశ్నకు బదులుగా.. తొలి, రెండో దశను ఒకేసారి నిర్వహిస్తారని, ఈ రెండు దశల్లో మనుషుల భద్రత, రోగనిరోధక శక్తి అంశాలపై దృష్టిసారిస్తారని తెలిపారు రాఘవన్​. మూడో దశకు భారీ సంఖ్యలో ప్రజలు అవసరమవుతారని.. దానికి ఎక్కువ సమయం పడుతుందన్నారు. అయితే సమయాన్ని కుదించొచ్చని సూచించారు. సాధారణంగా ఈ ప్రక్రియ మొత్తానికి 5-10 ఏళ్లు పడుతుందని, కానీ, దానిని 12-15 నెలలకు తీసుకొస్తారని పేర్కొన్నారు. ఒకేసారి వివిధ దశలను నిర్వహిస్తున్నందున చాలా భారీగా ఖర్చు అవుతుందని తెలిపారు.

వాటితో పాటుగా ఉత్పత్తి, స్టాక్​, సరఫరాలను అందుబాటులోకి తేవడం కూడా ఒకేసారి చెయ్యొచ్చని పేర్కొన్నారు రాఘవన్​.

విమర్శలు

కొవిడ్​-19 వ్యాక్సిన్​ను అభివృద్ధి చేసే ప్రక్రియను వేగవంతం చేయటంపై పలువురు నిపుణులు ఇప్పటికే హెచ్చరిస్తున్నారు. మహమ్మారుల కోసం తయారు చేసే వ్యాక్సిన్ల ప్రక్రియను వేగవంతం చేయటం అంతర్జాతీయ ప్రమాణాలను పాటించలేవని పేర్కొంటున్నారు.

Last Updated : Jul 11, 2020, 7:37 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.