ETV Bharat / business

ఎంఎస్​ఎంఈల్లో ఉత్తేజం నింపడంలో ప్యాకేజీ విఫలం!

author img

By

Published : May 23, 2020, 6:10 PM IST

లాక్​డౌన్ కారణంగా చితికిపోయిన చిన్న పరిశ్రమలకు ఊతమందించడానికి ప్రకటించిన రూ. 3 లక్షల కోట్ల ప్యాకేజీ ఆ రంగంలో ఉత్తేజం నింపడంలో విఫలమైందని విశ్లేషిస్తున్నారు నిపుణులు. తీవ్ర నగదు కొరత ఎదుర్కొంటున్న ఎంఎస్​ఎంఈలకు రుణాలు మంజూరు చేసే విషయంలో బ్యాంకులు వ్యవహరించే తీరు మరింత సమస్యాత్మకంగా ఉందని పేర్కొన్నారు. ఇదివరకు రుణాలు తీసుకున్న సంస్థలకే ఈ ఉద్దీపన ప్రయోజనకరంగా ఉంటుందని అభిప్రాయపడుతున్నారు.

Modi government's Rs 3 crore SME credit line fails to cheer up the sector
ఎంఎస్​ఎంఈలకు ఉత్తేజం నింపడంలో ప్యాకేజీ విఫలం!

కరోనా కట్టడికి విధించిన లాక్​డౌన్ కారణంగా కుదేలైన ఆర్థిక వ్యవస్థకు నూతన జవసత్వాలు అందించడానికి కేంద్ర ప్రభుత్వం రూ. 20 లక్షల కోట్ల భారీ ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించింది. ఇందులో భాగంగా సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలకు రూ. 3 లక్షల కోట్లు కేటాయించింది.

అయితే తీవ్ర నగదు కొరతను ఎదుర్కొంటున్న ఎంఎస్​ఎంఈలపై ఈ ప్యాకేజీ ఏ మాత్రం ప్రభావం చూపలేదని నిపుణులు చెబుతున్నారు. ఎంఎస్​ఎంఈలలో ఉత్తేజం నింపడంలో ప్యాకేజీ విఫలమైందని విశ్లేషిస్తున్నారు.

రెండు నెలల పాటు లాక్​డౌన్ విధించడం వల్ల అమ్మకాలు లేక చిన్న, మధ్య తరహా పరిశ్రమ(ఎస్​ఎంఈ)లు తీవ్ర నగదు కొరత ఎదుర్కొంటున్నాయని భారత సూక్ష్మ, మధ్య తరహా, లఘు పరిశ్రమల సమాఖ్య అధ్యక్షుడు అనిమేశ్ సక్సేనా గుర్తు చేశారు. ఇప్పుడు ఇదే వారికి అతిపెద్ద సంక్షోభమని పేర్కొన్నారు. ఈ సమయంలోనూ వేతనాలు చెల్లించడం సాధ్యం కాదని చెబుతున్నారు.

"లాక్​డౌన్ విధించిన కాలంలోనూ ఉద్యోగులకు జీతాలు చెల్లించాలని హోంమంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేయడం వల్ల ఎంఎస్​ఎంఈ రంగానికి మరిన్ని సమస్యలు ఎదురవుతున్నాయి. దేశంలో 12 కోట్ల మందికి ఎంఎస్​ఎంఈలు ఉపాధి కల్పిస్తున్నాయి. ఏప్రిల్ మే నెలల్లో ఎలాంటి వ్యాపారం జరగకపోయినా.. జీతాలు చెల్లించాల్సి వస్తోంది. విద్యుత్ బిల్లులు, అద్దె వంటి ఇతర స్థిర వ్యయాలు కూడా చెల్లించాలి. రెండు నెలల్లోనూ అమ్మకాలు సున్నాకు పడిపోవడం వల్ల ఎస్​ఎంఈలు వేతనాలు చెల్లించే స్థితిలో లేవు."

--అనిమేశ్ సక్సేనా, ఎంఎస్​ఎంఈ సమాఖ్య అధ్యక్షుడు

ఎంఎస్​ఎంఈ రంగానికి రుణాలు మంజూరు చేయడంలో బ్యాంకులు వ్యవహరించే విధానంలోనూ సమస్యలు ఉన్నాయని సక్సేనా పేర్కొన్నారు.

"బ్యాలెన్స్ షీట్ల వివరాలు, ఆర్డర్ పుస్తకాలు, ఇతర అంశాలను ఆధారంగా చేసుకొని బ్యాంకులు రుణాలు ఇస్తాయి. ఆర్డర్​ బుక్​ పటిష్ఠంగా లేకపోతే, ఇతర అంశాలు ప్రభావవంతంగా లేకుంటే రుణాలను తిరస్కరించే అవకాశం ఉంది. ఎస్​ఎంఈల లోన్లకు సంబంధించి రుణ అర్హతను పరిశీలించాల్సిన అవసరం లేదని బ్యాంకులకు ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయాలి."

--అనిమేశ్ సక్సేనా, ఎంఎస్​ఎంఈ సమాఖ్య అధ్యక్షుడు

ఎంఎస్​ఎంఈలకు కేంద్రం ప్రకటించిన రూ. 3 లక్షల కోట్ల హామీ లేని రుణాలకు సంబంధించిన మార్గదర్శకాల్లోనూ కొన్ని చిక్కులు ఉన్నట్లు సక్సేనా పేర్కొన్నారు.

"పథకంలో భాగంగా వర్కింగ్ క్యాపిటల్ అడ్వాన్స్​పై ప్రభుత్వం పరిమితి విధించింది. ఫిబ్రవరి 29 నాటికి ఎంఎస్​ఎంఈల అవుట్​స్టాండింగ్ మొత్తంపై 20 శాతం పరిమితి విధించింది. అవుట్​స్టాండిగ్ మొత్తంపై కాకుండా కంపెనీకి మంజూరు చేసిన మొత్తంలో 20 శాతం ఉండాలని మేం డిమాండ్ చేశాం."

--అనిమేశ్ సక్సేనా, ఎంఎస్​ఎంఈ సమాఖ్య అధ్యక్షుడు

ఫిబ్రవరి 29నాటికి ఎలాంటి బకాయిలు లేని ఎస్​ఎంఈలకు ఈ నిబంధన వ్యతిరేకంగా ఉందని సక్సేనా పేర్కొన్నారు. ఈ నిబంధన వల్ల వారు పెద్ద మొత్తంలో రుణాలు తీసుకోలేకపోతున్నారని అన్నారు.

వారికే ప్రయోజనం

ఎస్​ఎంఈ ఛాంబర్స్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు చంద్రకాంత్ సాలుంకే ఇదే తరహా అభిప్రాయం వ్యక్తం చేశారు. లాక్​డౌన్​కు ముందువరకు ఎలాంటి బకాయిలు లేని ఎంఎస్​ఎంఈలకు ప్యాకేజీ ప్రయోజనకరంగా లేదని అభిప్రాయం వ్యక్తం చేశారు.

"అన్ని ఎస్​ఎంఈలు అప్పు తెచ్చుకున్న నగదుపై ఆధారపడి పనిచేయవు. ఇప్పటికే రుణాలు తీసుకున్న ఎస్​ఎంఈలకే ప్రభుత్వం ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీ ప్రయోజనకరంగా ఉంటుంది."

-చంద్రకాంత్ సాలుంకే, ఎస్​ఎంఈ ఛాంబర్స్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు

బ్యాంకింగ్ వ్యవస్థ.. ఎంఎస్​ఎంఈలకు వ్యతిరేకంగా ఉందని వ్యాఖ్యానించారు చంద్రకాంత్. లోన్లు తిరిగి చెల్లించే విషయంలో ఎస్​ఎంఈల డిఫాల్ట్​ను బ్యాంకులు ఉద్దేశపూర్వక ఎగవేతగా పరిగణిస్తున్నాయని పేర్కొన్నారు.

(రచయిత-కృష్ణానంద్ త్రిపాఠి)

కరోనా కట్టడికి విధించిన లాక్​డౌన్ కారణంగా కుదేలైన ఆర్థిక వ్యవస్థకు నూతన జవసత్వాలు అందించడానికి కేంద్ర ప్రభుత్వం రూ. 20 లక్షల కోట్ల భారీ ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించింది. ఇందులో భాగంగా సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలకు రూ. 3 లక్షల కోట్లు కేటాయించింది.

అయితే తీవ్ర నగదు కొరతను ఎదుర్కొంటున్న ఎంఎస్​ఎంఈలపై ఈ ప్యాకేజీ ఏ మాత్రం ప్రభావం చూపలేదని నిపుణులు చెబుతున్నారు. ఎంఎస్​ఎంఈలలో ఉత్తేజం నింపడంలో ప్యాకేజీ విఫలమైందని విశ్లేషిస్తున్నారు.

రెండు నెలల పాటు లాక్​డౌన్ విధించడం వల్ల అమ్మకాలు లేక చిన్న, మధ్య తరహా పరిశ్రమ(ఎస్​ఎంఈ)లు తీవ్ర నగదు కొరత ఎదుర్కొంటున్నాయని భారత సూక్ష్మ, మధ్య తరహా, లఘు పరిశ్రమల సమాఖ్య అధ్యక్షుడు అనిమేశ్ సక్సేనా గుర్తు చేశారు. ఇప్పుడు ఇదే వారికి అతిపెద్ద సంక్షోభమని పేర్కొన్నారు. ఈ సమయంలోనూ వేతనాలు చెల్లించడం సాధ్యం కాదని చెబుతున్నారు.

"లాక్​డౌన్ విధించిన కాలంలోనూ ఉద్యోగులకు జీతాలు చెల్లించాలని హోంమంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేయడం వల్ల ఎంఎస్​ఎంఈ రంగానికి మరిన్ని సమస్యలు ఎదురవుతున్నాయి. దేశంలో 12 కోట్ల మందికి ఎంఎస్​ఎంఈలు ఉపాధి కల్పిస్తున్నాయి. ఏప్రిల్ మే నెలల్లో ఎలాంటి వ్యాపారం జరగకపోయినా.. జీతాలు చెల్లించాల్సి వస్తోంది. విద్యుత్ బిల్లులు, అద్దె వంటి ఇతర స్థిర వ్యయాలు కూడా చెల్లించాలి. రెండు నెలల్లోనూ అమ్మకాలు సున్నాకు పడిపోవడం వల్ల ఎస్​ఎంఈలు వేతనాలు చెల్లించే స్థితిలో లేవు."

--అనిమేశ్ సక్సేనా, ఎంఎస్​ఎంఈ సమాఖ్య అధ్యక్షుడు

ఎంఎస్​ఎంఈ రంగానికి రుణాలు మంజూరు చేయడంలో బ్యాంకులు వ్యవహరించే విధానంలోనూ సమస్యలు ఉన్నాయని సక్సేనా పేర్కొన్నారు.

"బ్యాలెన్స్ షీట్ల వివరాలు, ఆర్డర్ పుస్తకాలు, ఇతర అంశాలను ఆధారంగా చేసుకొని బ్యాంకులు రుణాలు ఇస్తాయి. ఆర్డర్​ బుక్​ పటిష్ఠంగా లేకపోతే, ఇతర అంశాలు ప్రభావవంతంగా లేకుంటే రుణాలను తిరస్కరించే అవకాశం ఉంది. ఎస్​ఎంఈల లోన్లకు సంబంధించి రుణ అర్హతను పరిశీలించాల్సిన అవసరం లేదని బ్యాంకులకు ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయాలి."

--అనిమేశ్ సక్సేనా, ఎంఎస్​ఎంఈ సమాఖ్య అధ్యక్షుడు

ఎంఎస్​ఎంఈలకు కేంద్రం ప్రకటించిన రూ. 3 లక్షల కోట్ల హామీ లేని రుణాలకు సంబంధించిన మార్గదర్శకాల్లోనూ కొన్ని చిక్కులు ఉన్నట్లు సక్సేనా పేర్కొన్నారు.

"పథకంలో భాగంగా వర్కింగ్ క్యాపిటల్ అడ్వాన్స్​పై ప్రభుత్వం పరిమితి విధించింది. ఫిబ్రవరి 29 నాటికి ఎంఎస్​ఎంఈల అవుట్​స్టాండింగ్ మొత్తంపై 20 శాతం పరిమితి విధించింది. అవుట్​స్టాండిగ్ మొత్తంపై కాకుండా కంపెనీకి మంజూరు చేసిన మొత్తంలో 20 శాతం ఉండాలని మేం డిమాండ్ చేశాం."

--అనిమేశ్ సక్సేనా, ఎంఎస్​ఎంఈ సమాఖ్య అధ్యక్షుడు

ఫిబ్రవరి 29నాటికి ఎలాంటి బకాయిలు లేని ఎస్​ఎంఈలకు ఈ నిబంధన వ్యతిరేకంగా ఉందని సక్సేనా పేర్కొన్నారు. ఈ నిబంధన వల్ల వారు పెద్ద మొత్తంలో రుణాలు తీసుకోలేకపోతున్నారని అన్నారు.

వారికే ప్రయోజనం

ఎస్​ఎంఈ ఛాంబర్స్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు చంద్రకాంత్ సాలుంకే ఇదే తరహా అభిప్రాయం వ్యక్తం చేశారు. లాక్​డౌన్​కు ముందువరకు ఎలాంటి బకాయిలు లేని ఎంఎస్​ఎంఈలకు ప్యాకేజీ ప్రయోజనకరంగా లేదని అభిప్రాయం వ్యక్తం చేశారు.

"అన్ని ఎస్​ఎంఈలు అప్పు తెచ్చుకున్న నగదుపై ఆధారపడి పనిచేయవు. ఇప్పటికే రుణాలు తీసుకున్న ఎస్​ఎంఈలకే ప్రభుత్వం ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీ ప్రయోజనకరంగా ఉంటుంది."

-చంద్రకాంత్ సాలుంకే, ఎస్​ఎంఈ ఛాంబర్స్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు

బ్యాంకింగ్ వ్యవస్థ.. ఎంఎస్​ఎంఈలకు వ్యతిరేకంగా ఉందని వ్యాఖ్యానించారు చంద్రకాంత్. లోన్లు తిరిగి చెల్లించే విషయంలో ఎస్​ఎంఈల డిఫాల్ట్​ను బ్యాంకులు ఉద్దేశపూర్వక ఎగవేతగా పరిగణిస్తున్నాయని పేర్కొన్నారు.

(రచయిత-కృష్ణానంద్ త్రిపాఠి)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.