ETV Bharat / business

ఈపీఎఫ్​ఓ కీలక నిర్ణయం- 6.3 లక్షల మందికి లబ్ధి

కార్మికమంత్రిత్వశాఖ ఉద్యోగులు పింఛను పథకం కింద పెన్షన్ కమ్యుటేషన్​ను పునరుద్ధరించింది. ఫలితంగా 6.3 లక్షల మంది పింఛనుదారులకు లబ్ధి చేకూరనుంది. పెన్షన్ కమ్యుటేషన్​ కింద వచ్చే 15 సంవత్సరాల వరకు నెలవారీ పెన్షన్​ మూడింట ఒక వంతు తగ్గుతుంది. ఈ తగ్గించిన మొత్తాన్ని ఒకేసారిగా ఇస్తారు. 15 ఏళ్ల తరువాత పెన్షనర్లు పూర్తి పింఛను​ పొందడానికి అర్హులు అవుతారు.

author img

By

Published : Feb 25, 2020, 7:00 PM IST

Updated : Mar 2, 2020, 1:35 PM IST

Labour Min implements EPFO's decision to restore pension commutation
ఈపీఎఫ్​ఓ కీలక నిర్ణయం- 6.3 లక్షల మందికి లబ్ధి

ఉద్యోగుల పింఛను​ పథకం కింద పెన్షన్​ మార్పిడి (కమ్యుటేషన్​)ను పునరుద్ధరించాలన్న ఈపీఎఫ్​ఓ నిర్ణయాన్ని కార్మిక మంత్రిత్వశాఖ అమలు చేసింది. ఫలితంగా 6.3 లక్షల మంది పింఛనుదారులకు ప్రయోజనం చేకూరనుంది.

ఎంతో ప్రయోజనకరం

పెన్షన్ కమ్యుటేషన్ అంటే చందాదారుడు ముందుగానే కొంత పింఛను మొత్తాన్ని విత్​డ్రా చేసుకోవడం. పెన్షన్ కమ్యుటేషన్​ కింద వచ్చే 15 సంవత్సరాల వరకు నెలవారీ పెన్షన్​ మూడింట ఒక వంతు తగ్గుతుంది. ఈ తగ్గించిన మొత్తాన్ని ఒకేసారిగా ఇస్తారు. 15 ఏళ్ల తరువాత పెన్షనర్లు పూర్తి పింఛను​ పొందడానికి అర్హులు అవుతారు.

2019 ఆగస్టులో ఈపీఎఫ్​ఓ కేంద్ర ట్రస్టీల బోర్డు పెన్షన్ కమ్యుటేషన్​ను పునరుద్ధరించే ప్రతిపాదనను ఆమోదించింది. ఈ నిర్ణయాన్ని 2020 ఫిబ్రవరి 20న కార్మిక మంత్రిత్వశాఖ నోటిఫై చేసింది. ఫలితంగా 2008 సెప్టెంబర్​ 25న లేదా అంతకుముందు పెన్షన్​ కమ్యుటేషన్​కు ఎంచుకున్నవారి పెన్షన్​ పునరుద్ధరణ జరిగింది.

ఇంతకు ముందు ఈపీఎస్​-95 కింద, సభ్యులు తమ పెన్షన్​లో మూడింట ఒక వంతును 10 సంవత్సరాల పాటు మార్చడానికి అనుమతించారు. ఇది 15 ఏళ్ల తరువాత పునరుద్ధరించారు. ఈ సదుపాయం ఇప్పటికీ కొన్ని వర్గాల ప్రభుత్వ ఉద్యోగులుకు అందుబాటులో ఉంది.

ఇదీ చూడండి: భారీగా తగ్గిన బంగారం ధర- నేటి లెక్కలివే...

ఉద్యోగుల పింఛను​ పథకం కింద పెన్షన్​ మార్పిడి (కమ్యుటేషన్​)ను పునరుద్ధరించాలన్న ఈపీఎఫ్​ఓ నిర్ణయాన్ని కార్మిక మంత్రిత్వశాఖ అమలు చేసింది. ఫలితంగా 6.3 లక్షల మంది పింఛనుదారులకు ప్రయోజనం చేకూరనుంది.

ఎంతో ప్రయోజనకరం

పెన్షన్ కమ్యుటేషన్ అంటే చందాదారుడు ముందుగానే కొంత పింఛను మొత్తాన్ని విత్​డ్రా చేసుకోవడం. పెన్షన్ కమ్యుటేషన్​ కింద వచ్చే 15 సంవత్సరాల వరకు నెలవారీ పెన్షన్​ మూడింట ఒక వంతు తగ్గుతుంది. ఈ తగ్గించిన మొత్తాన్ని ఒకేసారిగా ఇస్తారు. 15 ఏళ్ల తరువాత పెన్షనర్లు పూర్తి పింఛను​ పొందడానికి అర్హులు అవుతారు.

2019 ఆగస్టులో ఈపీఎఫ్​ఓ కేంద్ర ట్రస్టీల బోర్డు పెన్షన్ కమ్యుటేషన్​ను పునరుద్ధరించే ప్రతిపాదనను ఆమోదించింది. ఈ నిర్ణయాన్ని 2020 ఫిబ్రవరి 20న కార్మిక మంత్రిత్వశాఖ నోటిఫై చేసింది. ఫలితంగా 2008 సెప్టెంబర్​ 25న లేదా అంతకుముందు పెన్షన్​ కమ్యుటేషన్​కు ఎంచుకున్నవారి పెన్షన్​ పునరుద్ధరణ జరిగింది.

ఇంతకు ముందు ఈపీఎస్​-95 కింద, సభ్యులు తమ పెన్షన్​లో మూడింట ఒక వంతును 10 సంవత్సరాల పాటు మార్చడానికి అనుమతించారు. ఇది 15 ఏళ్ల తరువాత పునరుద్ధరించారు. ఈ సదుపాయం ఇప్పటికీ కొన్ని వర్గాల ప్రభుత్వ ఉద్యోగులుకు అందుబాటులో ఉంది.

ఇదీ చూడండి: భారీగా తగ్గిన బంగారం ధర- నేటి లెక్కలివే...

Last Updated : Mar 2, 2020, 1:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.