ETV Bharat / business

ఆ నిర్ణయాన్ని స్వాగతించిన ఐఎంఎఫ్‌

author img

By

Published : Oct 19, 2019, 1:01 PM IST

ప్రపంచాన్ని కలవరపెడుతున్న ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కొనేందుకు భారత్​ చేపడుతున్న చర్యలను అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్​) ప్రశంసించింది. కార్పొరేట్​ పన్ను తగ్గింపు నిర్ణయం సరైందని అభిప్రాయపడింది. ఆర్థిక భద్రత, స్థిరత్వం కోసం మరింత కృషి చేయాల్సిన అవసరం ఉందని పేర్కొంది.

ఆ నిర్ణయాన్ని స్వాగతించిన ఐఎంఎఫ్‌

ఆర్థిక మందగమనం నేపథ్యంలో ఇటీవల భారత ప్రభుత్వం తీసుకున్న కార్పొరేట్‌ పన్ను తగ్గింపు నిర్ణయాన్ని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ(ఐఎంఎఫ్‌) స్వాగతించింది. ఇది పెట్టుబడులను ఆకర్షించే సానుకూల చర్యగా ఐఎంఎఫ్‌ ఆసియా-పసిఫిక్‌ విభాగం డైరెక్టర్‌ చాంగ్‌యోగ్‌ రీ అభివర్ణించారు. అయినా నిరంతర ఆర్థిక భద్రత, స్థిరత్వం కోసం భారత్‌ ఇంకా కృషి చేయాల్సిన అవసరం ఉందని గుర్తుచేశారు.

ప్రభుత్వ రంగ బ్యాంకుల మూలధన పునర్‌వ్యవస్థీకరణ లాంటి చర్యలు వృద్ధికి ఊతం కల్పిస్తాయని పేర్కొన్నారు చాంగ్​యోగ్​. బ్యాంకింగేతర సంస్థల్లో నెలకొన్న సమస్యల్ని ఇంకా పరిష్కరించాల్సి ఉందన్నారు. ఇవన్నీ ప్రభుత్వం దృష్టిలో ఉన్నాయని తెలిపారు. భారత్‌ లాంటి దేశాల్లో ఆర్థిక పరిస్థితి మెరుగుదలకు అనేక సవాళ్లు ఎదురవుతాయని అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో సహకరించేందుకు ఆయా దేశాల్లో ఐఎంఎఫ్‌ ప్రాంతీయ సంస్థల్ని నెలకొల్పిందని పేర్కొన్నారు.

వృద్ధి రేటులో కోత

ప్రస్తుత సంవత్సరానికి (2019) భారత వృద్ధి అంచనాలను ఐఎంఎఫ్‌ గణనీయంగా తగ్గించిందిం. వృద్ధి 7.3 శాతంగా ఉంటుందని గత ఏప్రిల్‌లో అంచనా వేయగా.. అందులో 1.2 శాతం మేర కోత విధించి 6.1 శాతానికి పరిమితం చేస్తున్నట్లు ఇటీవల ప్రకటించింది. 2020లో వృద్ధి పుంజుకుని 7 శాతంగా నమోదయ్యే అవకాశం ఉందని ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తాజాగా విడుదల చేసిన అంచనాల్లో పేర్కొంది. ఇటీవల ప్రపంచబ్యాంక్‌ కూడా భారత్‌ వృద్ధి అంచనాలను 6 శాతానికి తగ్గించిన సంగతి తెలిసిందే.

ఇదీ చూడండి: '5జీ సాంకేతికతను త్వరగా అందిపుచ్చుకోవాలి'

ఆర్థిక మందగమనం నేపథ్యంలో ఇటీవల భారత ప్రభుత్వం తీసుకున్న కార్పొరేట్‌ పన్ను తగ్గింపు నిర్ణయాన్ని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ(ఐఎంఎఫ్‌) స్వాగతించింది. ఇది పెట్టుబడులను ఆకర్షించే సానుకూల చర్యగా ఐఎంఎఫ్‌ ఆసియా-పసిఫిక్‌ విభాగం డైరెక్టర్‌ చాంగ్‌యోగ్‌ రీ అభివర్ణించారు. అయినా నిరంతర ఆర్థిక భద్రత, స్థిరత్వం కోసం భారత్‌ ఇంకా కృషి చేయాల్సిన అవసరం ఉందని గుర్తుచేశారు.

ప్రభుత్వ రంగ బ్యాంకుల మూలధన పునర్‌వ్యవస్థీకరణ లాంటి చర్యలు వృద్ధికి ఊతం కల్పిస్తాయని పేర్కొన్నారు చాంగ్​యోగ్​. బ్యాంకింగేతర సంస్థల్లో నెలకొన్న సమస్యల్ని ఇంకా పరిష్కరించాల్సి ఉందన్నారు. ఇవన్నీ ప్రభుత్వం దృష్టిలో ఉన్నాయని తెలిపారు. భారత్‌ లాంటి దేశాల్లో ఆర్థిక పరిస్థితి మెరుగుదలకు అనేక సవాళ్లు ఎదురవుతాయని అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో సహకరించేందుకు ఆయా దేశాల్లో ఐఎంఎఫ్‌ ప్రాంతీయ సంస్థల్ని నెలకొల్పిందని పేర్కొన్నారు.

వృద్ధి రేటులో కోత

ప్రస్తుత సంవత్సరానికి (2019) భారత వృద్ధి అంచనాలను ఐఎంఎఫ్‌ గణనీయంగా తగ్గించిందిం. వృద్ధి 7.3 శాతంగా ఉంటుందని గత ఏప్రిల్‌లో అంచనా వేయగా.. అందులో 1.2 శాతం మేర కోత విధించి 6.1 శాతానికి పరిమితం చేస్తున్నట్లు ఇటీవల ప్రకటించింది. 2020లో వృద్ధి పుంజుకుని 7 శాతంగా నమోదయ్యే అవకాశం ఉందని ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తాజాగా విడుదల చేసిన అంచనాల్లో పేర్కొంది. ఇటీవల ప్రపంచబ్యాంక్‌ కూడా భారత్‌ వృద్ధి అంచనాలను 6 శాతానికి తగ్గించిన సంగతి తెలిసిందే.

ఇదీ చూడండి: '5జీ సాంకేతికతను త్వరగా అందిపుచ్చుకోవాలి'

AP Video Delivery Log - 0600 GMT News
Saturday, 19 October, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0408: Chile Fire AP Clients Only 4235616
Huge fire engulfs electricity company building
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.