పిజ్జా బ్రాండ్ డోమినోస్ కస్టమర్ల డేటా హ్యాకింగ్కు గురైందని ఓ సైబర్ సెక్యురిటీ నిపుణుడు వెల్లడించారు. కానీ కస్టమర్ల ఫైనాన్సియల్ డేటా సురక్షితంగానే ఉందని తెలిపారు. హ్యాక్ అయిన వెబ్సైట్ ద్వారా హ్యాకర్లు వినియోగదారులకు సంబంధించిన ఆర్డర్లను, వారు ఏ ప్రాంతం నుంచి చేశారు అనేది మాత్రమే తెలుసుకోగలరని సైబర్ సెక్యురిటీ నిపుణుడు రాజశేఖర్ రాజహారియ తెలిపారు.
ఈ డేటాతో వినియోగదారుల సమాచారంపై నిఘా ఉంచే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. భారతీయులు ఆర్డర్ చేసిన 18 కోట్ల ఆర్డర్లకు సంబంధించిన సమాచారం డార్క్వెబ్లో బహిర్గతమైందని తెలిపారు.
అయితే దీనిపై డోమినోస్ యాజమాన్యం స్పందించింది. హ్యాక్ అయిన విషయాన్ని నిర్ధరించింది. ఈ కారణంగా భద్రతా పరమైన ఇబ్బందులు తలెత్తాయని తెలిపింది. కానీ కస్టమర్ల ఆర్థికపరమైన సమాచారం క్షేమంగానే ఉందని వెల్లడించింది. వినియోగదారులకు సంబంధించిన ఫైనాన్సియల్ డేటా దుర్వినియోగానికి గురయ్యే అవకాశమే లేదని సంస్థ పురుద్ఘాటించింది.
ఇదీ చదవండి: 'వైద్యశాస్త్రంపై రాందేవ్కు దురుద్దేశమేమీ లేదు'