ETV Bharat / business

గిఫ్ట్ ఓచర్లపైనా జీఎస్​టీ వసూలు! - ఓచర్లపై జీఎస్​టీ అమలు

గిఫ్ట్​ కార్డులు, ఓచర్లపై జీఎస్​టీ వర్తిస్తుందని అప్పీలేట్ అథారిటీ ఫర్ అడ్వాన్స్​ రూలింగ్ (ఏఏఏఆర్) తమిళనాడు బెంచ్​ స్పష్టం చేసింది.

GST to be levied on underlying goods/services in gift vouchers : rules AAAR
ఓచర్లపై జీఎస్​టీ అమలు.. ఎప్పుడంటే?
author img

By

Published : Apr 4, 2021, 3:05 PM IST

గిఫ్ట్ కార్డులు, ఓచర్లపై జీఎస్​టీ వర్తిస్తుందా అనే దానిపై ఉన్న అనుమానాలను పటాపంచలు చేస్తూ తమిళనాడులోని అప్పీలేట్ అథారిటీ ఫర్ అడ్వాన్స్​ రూలింగ్ (ఏఏఏఆర్)​ బెంచ్​ స్పష్టమైన తీర్పు ఇచ్చింది. అటువంటి వాటిపైనా తప్పక జీఎస్​టీని వసూలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే ఆయా గిఫ్ట్ కార్డులు, ఓచర్లను ఉపయోగించుకునే సమయంలో మాత్రమే వస్తు, సేవల పన్ను వర్తిస్తుందని తీర్పులో పేర్కొంది.

గిఫ్ట్​ కార్డులు, ఓచర్లపై 12 నుంచి 18 శాతం జీఎస్​టీ వసూలు చేయాలంటూ తమిళనాడు అథారిటీ ఫర్ అడ్వాన్స్​ రూలింగ్ ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ కల్యాణ్​ జ్యూవెలర్స్ ఇండియా అప్పీలేట్ అథారిటీ ఫర్ అడ్వాన్స్​ రూలింగ్​ను ఆశ్రయించింది. దీనిపై విచారణ చేపట్టిన ఏఏఏఆర్ తాజా తీర్పుని వెలువరించింది.

ఏఏఆర్​ ఇచ్చిన తీర్పును సవరిస్తూ.. ఓచర్లు సరఫరాపై కాకుండా వాటిని ఉపయోగించుకునేప్పుడు జీఎస్​టీ చెల్లించాల్సి ఉంటుందని అప్పీలేట్ అథారిటీ స్పష్టం చేసింది. ఓచర్లను ద్రవ్యేతర రూపంగా పరిగణించాలని తీర్పులో పేర్కొంది.

ఇదీ చూడండి: 'భూమిని ప్లాట్లుగా విక్రయించినా.. జీఎస్టీ కట్టాల్సిందే'

గిఫ్ట్ కార్డులు, ఓచర్లపై జీఎస్​టీ వర్తిస్తుందా అనే దానిపై ఉన్న అనుమానాలను పటాపంచలు చేస్తూ తమిళనాడులోని అప్పీలేట్ అథారిటీ ఫర్ అడ్వాన్స్​ రూలింగ్ (ఏఏఏఆర్)​ బెంచ్​ స్పష్టమైన తీర్పు ఇచ్చింది. అటువంటి వాటిపైనా తప్పక జీఎస్​టీని వసూలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే ఆయా గిఫ్ట్ కార్డులు, ఓచర్లను ఉపయోగించుకునే సమయంలో మాత్రమే వస్తు, సేవల పన్ను వర్తిస్తుందని తీర్పులో పేర్కొంది.

గిఫ్ట్​ కార్డులు, ఓచర్లపై 12 నుంచి 18 శాతం జీఎస్​టీ వసూలు చేయాలంటూ తమిళనాడు అథారిటీ ఫర్ అడ్వాన్స్​ రూలింగ్ ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ కల్యాణ్​ జ్యూవెలర్స్ ఇండియా అప్పీలేట్ అథారిటీ ఫర్ అడ్వాన్స్​ రూలింగ్​ను ఆశ్రయించింది. దీనిపై విచారణ చేపట్టిన ఏఏఏఆర్ తాజా తీర్పుని వెలువరించింది.

ఏఏఆర్​ ఇచ్చిన తీర్పును సవరిస్తూ.. ఓచర్లు సరఫరాపై కాకుండా వాటిని ఉపయోగించుకునేప్పుడు జీఎస్​టీ చెల్లించాల్సి ఉంటుందని అప్పీలేట్ అథారిటీ స్పష్టం చేసింది. ఓచర్లను ద్రవ్యేతర రూపంగా పరిగణించాలని తీర్పులో పేర్కొంది.

ఇదీ చూడండి: 'భూమిని ప్లాట్లుగా విక్రయించినా.. జీఎస్టీ కట్టాల్సిందే'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.