ETV Bharat / business

పెట్రో సుంకం పెంపుతో కేంద్రానికి ఇంత లాభమా?

పెట్రోల్​, డీజిల్​పై ఎక్సైజ్​ సుంకం భారీగా పెంచింది కేంద్రం. ఈ నిర్ణయంతో ప్రభుత్వానికి దాదాపు రూ.1.6 లక్షల కోట్లు అదనపు ఆదాయం సమకూరనున్నట్లు అంచనా వేస్తున్నారు నిపుణులు. లాక్​డౌన్​తో స్తంభించిన ఆర్థిక వ్యవస్థకు ఇది మేలు కలిగించే విషయమని విశ్లేషిస్తున్నారు.

author img

By

Published : May 6, 2020, 11:18 AM IST

Govt to gain Rs 1.6 lakh cr this fiscal from record excise duty hike on petrol, diesel
ఎక్సెజ్​ సుంకం పెంపుతో కేంద్రానికి ఎంత లాభమో..?

అంతర్జాతీయంగా చమురు ధరలు పతనమవుతున్న నేపథ్యంలో.. దేశీయంగా పెట్రోల్​, డీజిల్​పై ఎక్సైజ్​ సుంకాన్ని పెంచింది కేంద్రం. పెట్రోల్​ రూ.10, డీజిల్​పై 13 రూపాయల్ని పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయంతో ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరుతుందని అంచనా వేస్తున్నారు.

కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్‌ బోర్డు ప్రకారం.. లీటర్‌ పెట్రోల్‌పై ప్రత్యేక అదనపు ఎక్సైజ్​ సుంకాన్ని రూ.2, డీజిల్​పై రూ.5 పెంచారు. రోడ్డు సెస్​ను పెట్రోల్​, డీజిల్​పై రూ.8 చొప్పున పెంచారు. తాజా పెంపుతో మొత్తం ఎక్సైజ్ సుంకం లీటర్‌ పెట్రోల్‌పై రూ.32.98కు, డీజిల్‌పై రూ.31.83కు ఎగబాకింది.

ఆర్థిక వ్యవస్థకు మేలే!

ప్రపంచవ్యాప్తంగా ముడిచమురు ధరలు భారీగా తగ్గుతున్నప్పటికీ దేశీయంగా కేంద్రం ఎక్సైజ్​ సుంకం పెంచడం గమనార్హం. దేశవ్యాప్తంగా లాక్​డౌన్​తో స్తంభించిన ఆర్థిక వ్యవస్థకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం మేలు చేస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో సుంకం పెంపుతో దాదాపు రూ.1.6 లక్షల కోట్ల మేర ప్రభుత్వ ఖజానాకు చేరనుందని అంచనా వేస్తున్నారు.

''భారత ప్రభుత్వం... పెట్రోల్​, డీజిల్​పై వరుసగా బ్యారెల్​కు 21, 27 డాలర్లు చొప్పున పెంచింది. ఈ పెంపు ఆర్థిక సంవత్సరం మొత్తం కొనసాగిస్తే.. ప్రభుత్వ పన్ను వసూళ్లు 21 బిలియన్​ డాలర్లకు పెరిగే అవకాశాలున్నాయి.''
-వికాస్​ హలన్​, మూడీస్​ ఇన్వెస్టర్స్​ సర్వీస్​ సీనియర్​ వైస్​ ప్రెసిడెంట్​

2 నెలల్లో రెండోసారి...

రెండు నెలల వ్యవధిలో ఎక్సైజ్​ సుంకం పెంచడం ఇది రెండోసారి. చివరగా మార్చి 14న పెట్రోల్​, డీజిల్​పై చెరో రూ. 3 చొప్పున పన్ను వడ్డించారు. అలా దాదాపు రూ.39 వేల కోట్ల వార్షికాదాయం సమకూరుతుందని అంచనా.

మొత్తంగా ఎక్సైజ్​ సుంకం ద్వారా దాదాపు రూ.2 లక్షల కోట్లపైనే ప్రభుత్వ ఖజానాకు చేరనుంది.

9 సార్లు...

అంతర్జాతీయంగా చమురు ధరలు పడిపోయినకారణంగా.. 2014 నవంబర్‌- 2016 జనవరి మధ్య నరేంద్ర మోదీ ప్రభుత్వం.. పెట్రోల్‌, డీజిల్‌పై ఎక్సైజ్‌ సుంకాన్ని 9 సార్లు పెంచింది. మోదీ సర్కార్​.. తొలిసారి అధికారంలోకి వచ్చే 2014 నాటికి ఈ రెండింటిపై ఎక్సైజ్​ సుంకం వరుసగా 9.48, 3.56 గా ఉంది.

అంతర్జాతీయంగా చమురు ధరలు పతనమవుతున్న నేపథ్యంలో.. దేశీయంగా పెట్రోల్​, డీజిల్​పై ఎక్సైజ్​ సుంకాన్ని పెంచింది కేంద్రం. పెట్రోల్​ రూ.10, డీజిల్​పై 13 రూపాయల్ని పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయంతో ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరుతుందని అంచనా వేస్తున్నారు.

కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్‌ బోర్డు ప్రకారం.. లీటర్‌ పెట్రోల్‌పై ప్రత్యేక అదనపు ఎక్సైజ్​ సుంకాన్ని రూ.2, డీజిల్​పై రూ.5 పెంచారు. రోడ్డు సెస్​ను పెట్రోల్​, డీజిల్​పై రూ.8 చొప్పున పెంచారు. తాజా పెంపుతో మొత్తం ఎక్సైజ్ సుంకం లీటర్‌ పెట్రోల్‌పై రూ.32.98కు, డీజిల్‌పై రూ.31.83కు ఎగబాకింది.

ఆర్థిక వ్యవస్థకు మేలే!

ప్రపంచవ్యాప్తంగా ముడిచమురు ధరలు భారీగా తగ్గుతున్నప్పటికీ దేశీయంగా కేంద్రం ఎక్సైజ్​ సుంకం పెంచడం గమనార్హం. దేశవ్యాప్తంగా లాక్​డౌన్​తో స్తంభించిన ఆర్థిక వ్యవస్థకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం మేలు చేస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో సుంకం పెంపుతో దాదాపు రూ.1.6 లక్షల కోట్ల మేర ప్రభుత్వ ఖజానాకు చేరనుందని అంచనా వేస్తున్నారు.

''భారత ప్రభుత్వం... పెట్రోల్​, డీజిల్​పై వరుసగా బ్యారెల్​కు 21, 27 డాలర్లు చొప్పున పెంచింది. ఈ పెంపు ఆర్థిక సంవత్సరం మొత్తం కొనసాగిస్తే.. ప్రభుత్వ పన్ను వసూళ్లు 21 బిలియన్​ డాలర్లకు పెరిగే అవకాశాలున్నాయి.''
-వికాస్​ హలన్​, మూడీస్​ ఇన్వెస్టర్స్​ సర్వీస్​ సీనియర్​ వైస్​ ప్రెసిడెంట్​

2 నెలల్లో రెండోసారి...

రెండు నెలల వ్యవధిలో ఎక్సైజ్​ సుంకం పెంచడం ఇది రెండోసారి. చివరగా మార్చి 14న పెట్రోల్​, డీజిల్​పై చెరో రూ. 3 చొప్పున పన్ను వడ్డించారు. అలా దాదాపు రూ.39 వేల కోట్ల వార్షికాదాయం సమకూరుతుందని అంచనా.

మొత్తంగా ఎక్సైజ్​ సుంకం ద్వారా దాదాపు రూ.2 లక్షల కోట్లపైనే ప్రభుత్వ ఖజానాకు చేరనుంది.

9 సార్లు...

అంతర్జాతీయంగా చమురు ధరలు పడిపోయినకారణంగా.. 2014 నవంబర్‌- 2016 జనవరి మధ్య నరేంద్ర మోదీ ప్రభుత్వం.. పెట్రోల్‌, డీజిల్‌పై ఎక్సైజ్‌ సుంకాన్ని 9 సార్లు పెంచింది. మోదీ సర్కార్​.. తొలిసారి అధికారంలోకి వచ్చే 2014 నాటికి ఈ రెండింటిపై ఎక్సైజ్​ సుంకం వరుసగా 9.48, 3.56 గా ఉంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.