ETV Bharat / business

ట్రాయ్​ ఛైర్మన్​ పోస్ట్​కు దరఖాస్తుల ఆహ్వానం - trai latest updates

ట్రాయ్​ ఛైర్మన్​ పోస్ట్​కు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది కేంద్రం. ప్రస్తుత ఛైర్మన్ ఆర్​ ఎస్​ శర్మ పదవీకాలం సెప్టెంబరు 30తో ముగియనున్న నేపథ్యంలో ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది.

Govt invites applications for Trai chief's post
ట్రాయ్​ ఛైర్మన్​ పోస్ట్​కు దరఖాస్తుల ఆహ్వానం
author img

By

Published : Jun 6, 2020, 7:53 AM IST

టెలికాం నియంత్రణ ప్రాధికార సంస్థ (ట్రాయ్) ప్రస్తుత ఛైర్మన్​ ఆర్ ఎస్​ శర్మ పదవీ కాలం సెప్టెంబరు 30తో ముగియనుంది. కొత్త చీఫ్​ నియామకం కోసం అధికారిక ప్రక్రియ ప్రారంభించింది కేంద్రం. అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చని ప్రకటనలో తెలిపింది.

టెలికాం సంస్థల టారిఫ్​లు, కనెక్షన్ ఛార్జీలు నిర్ణయించే కీలక అధికారం ట్రాయ్​కు ఉంది. స్పెక్ట్రమ్​ వంటి కీలక విషయాలు, టెలికాం రంగంలో సంస్కరణలు, విలీనాలు వంటి వాటిపై ట్రాయ్​దే తుది నిర్ణయం.

టెలికాం, పారిశ్రామిక, ఆర్థిక, గణనశాస్త్రం, చట్ట నిర్వహణ రంగాల్లో వృత్తిపరమైన, ప్రత్యేక అనుభవం ఉన్నవారు ఈ పోస్టుకు అర్హులు. 65 ఏళ్ల లోపు వయసుండాలి. ప్రభుత్వ ఉద్యోగులలో కార్యదర్శి, అదనపు కార్యదర్శి స్థాయి బాధ్యతలు నిర్వర్తించిన వారికి మాాత్రమే దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది. దరఖాస్తులతో పాటు ఇతరుల పేర్లను పరిగణలోకి తీసుకునే అధికారం నియామక​ కమిటీకి ఉంటుంది.

ట్రాయ్​ ప్రస్తుత ఛైర్మన్​ ఆర్​ ఎస్ శర్మ 2015లో బాధ్యతలు చేపట్టారు. 2018 ఆగస్టులో ఆయనకే మళ్లీ అవకాశం ఇచ్చింది నియామక కమిటీ. సెప్టెంబరు 30 వరకు పదవీకాలాన్ని పొడిగించింది. ఆయనకు 65 ఏళ్లు వస్తున్న కారణంగా పదవీవిరమణ చేయనున్నారు.

టెలికాం నియంత్రణ ప్రాధికార సంస్థ (ట్రాయ్) ప్రస్తుత ఛైర్మన్​ ఆర్ ఎస్​ శర్మ పదవీ కాలం సెప్టెంబరు 30తో ముగియనుంది. కొత్త చీఫ్​ నియామకం కోసం అధికారిక ప్రక్రియ ప్రారంభించింది కేంద్రం. అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చని ప్రకటనలో తెలిపింది.

టెలికాం సంస్థల టారిఫ్​లు, కనెక్షన్ ఛార్జీలు నిర్ణయించే కీలక అధికారం ట్రాయ్​కు ఉంది. స్పెక్ట్రమ్​ వంటి కీలక విషయాలు, టెలికాం రంగంలో సంస్కరణలు, విలీనాలు వంటి వాటిపై ట్రాయ్​దే తుది నిర్ణయం.

టెలికాం, పారిశ్రామిక, ఆర్థిక, గణనశాస్త్రం, చట్ట నిర్వహణ రంగాల్లో వృత్తిపరమైన, ప్రత్యేక అనుభవం ఉన్నవారు ఈ పోస్టుకు అర్హులు. 65 ఏళ్ల లోపు వయసుండాలి. ప్రభుత్వ ఉద్యోగులలో కార్యదర్శి, అదనపు కార్యదర్శి స్థాయి బాధ్యతలు నిర్వర్తించిన వారికి మాాత్రమే దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది. దరఖాస్తులతో పాటు ఇతరుల పేర్లను పరిగణలోకి తీసుకునే అధికారం నియామక​ కమిటీకి ఉంటుంది.

ట్రాయ్​ ప్రస్తుత ఛైర్మన్​ ఆర్​ ఎస్ శర్మ 2015లో బాధ్యతలు చేపట్టారు. 2018 ఆగస్టులో ఆయనకే మళ్లీ అవకాశం ఇచ్చింది నియామక కమిటీ. సెప్టెంబరు 30 వరకు పదవీకాలాన్ని పొడిగించింది. ఆయనకు 65 ఏళ్లు వస్తున్న కారణంగా పదవీవిరమణ చేయనున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.