బంగారం, వెండి ధరలు గురువారం భారీగా తగ్గాయి. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర (Gold price today) రూ.319 తగ్గి.. రూ.48,223 వద్దకు చేరింది. డాలర్తో పోలిస్తే రూపాయి విలువ పుంజుకోవడం బంగారం ధర తగ్గేందుకు కారణమైనట్లు విశ్లేషకులు చెబుతున్నారు.
వెండి ధర (Silver price today) ఏకంగా రూ.1,287 (కిలోకు) తగ్గింది. ప్రస్తుతం కిలో వెండి ధర (దిల్లీలో) రూ.70,637 వద్ద ఉంది.
అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1,900 డాలర్లకు పెరిగింది. వెండి ఔన్సుకు 27.70 డాలర్ల వద్ద ఫ్లాట్గా ఉంది.
ఇదీ చదవండి:Stocks Closing: స్వల్ప లాభాలతో సరి- సెన్సెక్స్ 98 ప్లస్