ETV Bharat / business

అమెరికా దెబ్బకు చమురు ధరలకు రెక్కలు - 4 శాతానికిపైగా పెరిగిన ముడిచమురు ధరలు

ఇరాన్ నిఘా విభాగాధిపతి లక్ష్యంగా అమెరికా వైమానిక దాడులు చేసిన నేపథ్యంలో అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు 4 శాతం మేర పెరిగిపోయాయి. ప్రస్తుతం బ్యారెల్ ముడిచమురు​ ధర రూ.4,514గా ఉంది. భారత్​ తన ఇంధన అవసరాల్లో 80 శాతం దిగుమతులపై ఆధారపడుతోంది. ముఖ్యంగా ఇరాన్.. భారత్​కు అతిపెద్ద చమురు సరఫరాదారుగా ఉన్న నేపథ్యంలో.. భవిష్యత్​లో మరింతగా పెరగనున్న చమురు ధరలు భారత్​కు భారం కానున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Crude oil futures rise 4 pc on rising US-Iran tensions
అమెరికా దెబ్బకు చమురు ధరలకు రెక్కలు
author img

By

Published : Jan 3, 2020, 5:02 PM IST

ఇరాన్​ నిఘా విభాగాధిపతి లక్ష్యంగా అమెరికా వైమానిక దాడులు చేసిన నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్​లో ముడిచమురు ధరలు 4 శాతం మేర పెరిగాయి. ఫలితంగా బ్యారెల్ ధర రూ.4,514లకు పెరిగింది.

ట్రంప్ ఆదేశాల మేరకు ఇరాక్​లో జరిగిన ఈ దాడుల్లో ఇరాన్​ అత్యున్నత సైనికాధికారి సహా పలువురు అధికారులు మరణించారు. ప్రపంచంలో అతి పెద్ద చమురు సరఫరాదారులైన ఈ రెండు దేశాలపై దాడి జరిగిన నేపథ్యంలో ముడిచమురు ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి.

అంతర్జాతీయ మార్కెట్​

శుక్రవారం నాటికి అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్‌ ముడి చమురు ధర 2.96 శాతం పెరిగి బ్యారల్‌ 68.21 డాలర్లను చేరుకుంది. వెస్ట్‌ టెక్సాస్‌ ఇంటర్మీడియెట్‌ (డబ్ల్యూటీఐ) ముడిచమురు ధర 2.81 శాతం పెరిగి 62.90 డాలర్లకు పెరిగింది.

భారత్​పై తీవ్ర ప్రభావం

భారత్​ తన ఇంధన అవసరాల్లో 80 శాతానికి పైగా అంతర్జాతీయ దిగుమతులపైనే ఆధారపడి ఉంది. ముఖ్యంగా ఇరాన్​.. భారత్​కు అతిపెద్ద చమురు సరఫరాదారుగా ఉంది. ఇప్పుడు ఆ దేశంపై అమెరిగా దాడులు చేయడం వల్ల... భారత్​లో చమురు ధరలు మరింత పెరిగే అవకాశం ముందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

ఇదీ చూడండి: అమెరికా వైమానిక దాడితో స్టాక్​మార్కెట్లకు నష్టాలు

ఇరాన్​ నిఘా విభాగాధిపతి లక్ష్యంగా అమెరికా వైమానిక దాడులు చేసిన నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్​లో ముడిచమురు ధరలు 4 శాతం మేర పెరిగాయి. ఫలితంగా బ్యారెల్ ధర రూ.4,514లకు పెరిగింది.

ట్రంప్ ఆదేశాల మేరకు ఇరాక్​లో జరిగిన ఈ దాడుల్లో ఇరాన్​ అత్యున్నత సైనికాధికారి సహా పలువురు అధికారులు మరణించారు. ప్రపంచంలో అతి పెద్ద చమురు సరఫరాదారులైన ఈ రెండు దేశాలపై దాడి జరిగిన నేపథ్యంలో ముడిచమురు ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి.

అంతర్జాతీయ మార్కెట్​

శుక్రవారం నాటికి అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్‌ ముడి చమురు ధర 2.96 శాతం పెరిగి బ్యారల్‌ 68.21 డాలర్లను చేరుకుంది. వెస్ట్‌ టెక్సాస్‌ ఇంటర్మీడియెట్‌ (డబ్ల్యూటీఐ) ముడిచమురు ధర 2.81 శాతం పెరిగి 62.90 డాలర్లకు పెరిగింది.

భారత్​పై తీవ్ర ప్రభావం

భారత్​ తన ఇంధన అవసరాల్లో 80 శాతానికి పైగా అంతర్జాతీయ దిగుమతులపైనే ఆధారపడి ఉంది. ముఖ్యంగా ఇరాన్​.. భారత్​కు అతిపెద్ద చమురు సరఫరాదారుగా ఉంది. ఇప్పుడు ఆ దేశంపై అమెరిగా దాడులు చేయడం వల్ల... భారత్​లో చమురు ధరలు మరింత పెరిగే అవకాశం ముందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

ఇదీ చూడండి: అమెరికా వైమానిక దాడితో స్టాక్​మార్కెట్లకు నష్టాలు

Lucknow (UP), Jan 03 (ANI): While addressing a press conference on reports that 'SSP GautamBuddha Nagar wrote letter alleging some senior police officials are involved in transfer racket', Uttar Pradesh DGP OP Singh said that they are looking into the matter and calls it violation of service rules. "We are looking into this whole matter, but this is an unauthorized communication by SSP, its violation of service rules," said UP DGP
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.