ETV Bharat / business

'పన్ను లెక్కల పూర్తికి మరింత గడువు కావాలి'

author img

By

Published : Mar 23, 2020, 9:43 PM IST

కరోనా వ్యాప్తి నేపథ్యంలో పన్ను సంబంధించి లెక్కలు పూర్తి చేసేందుకు తుది గడువును పెంచాలని ప్రభుత్వాన్ని ఐటీ శాఖ కోరింది. ఉద్యోగుల ఆందోళన నేపథ్యంలో వర్క్​ ఫ్రమ్​ హోమ్​కు అనుమతించాలని విజ్ఞప్తి చేసింది.

it dept
ఆదాయపు పన్ను శాఖ

పన్ను సంబంధిత పనులను పూర్తి చేయడానికి గడువు పొడిగించాలని ప్రభుత్వాన్ని కోరింది ఆదాయపు పన్ను శాఖ. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఈ ప్రతిపాదన చేసినట్లు భారత రెవెన్యూ సర్వీసెస్​ అఖిల భారత సంఘం తెలిపింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. మార్చి 31 వరకు పన్ను సంబంధిత పనులను పూర్తి చేయాల్సి ఉంటుంది.

ప్రభుత్వం జారీ చేసిన సామాజిక దూరం నిబంధనలను పాటించేలా ఐటీ అధికారులను వర్క్​ ఫ్రమ్​ హోంకు అనుమతించాలని కోరింది. క్షేత్ర స్థాయిలో పనిచేసే అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు ఐటీ శాఖ పేర్కొంది. ఈ నేపథ్యంలో మార్చి 31 గడువును సవరించాలని ప్రభుత్వాన్ని కోరాయి.

ఐటీ గెజిటెడ్​ అధికారుల సంఘం కూడా కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డును ఇదే తరహా డిమాండ్​ చేసింది. ఆస్తులకు సంబంధించి కేసులను పూర్తి చేసేందుకు మార్చి 31 గడువును పొడిగించాలని కోరింది.

పన్ను సంబంధిత పనులను పూర్తి చేయడానికి గడువు పొడిగించాలని ప్రభుత్వాన్ని కోరింది ఆదాయపు పన్ను శాఖ. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఈ ప్రతిపాదన చేసినట్లు భారత రెవెన్యూ సర్వీసెస్​ అఖిల భారత సంఘం తెలిపింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. మార్చి 31 వరకు పన్ను సంబంధిత పనులను పూర్తి చేయాల్సి ఉంటుంది.

ప్రభుత్వం జారీ చేసిన సామాజిక దూరం నిబంధనలను పాటించేలా ఐటీ అధికారులను వర్క్​ ఫ్రమ్​ హోంకు అనుమతించాలని కోరింది. క్షేత్ర స్థాయిలో పనిచేసే అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు ఐటీ శాఖ పేర్కొంది. ఈ నేపథ్యంలో మార్చి 31 గడువును సవరించాలని ప్రభుత్వాన్ని కోరాయి.

ఐటీ గెజిటెడ్​ అధికారుల సంఘం కూడా కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డును ఇదే తరహా డిమాండ్​ చేసింది. ఆస్తులకు సంబంధించి కేసులను పూర్తి చేసేందుకు మార్చి 31 గడువును పొడిగించాలని కోరింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.