కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డ్ (సీబీడీటీ) ఛైర్మన్ ప్రమోద్ చంద్ర మోదీ (పీసీ మోదీ) పదవీకాలం మరో ముడు నెలలు పొడిగించింది కేంద్రం. కేంద్ర క్యాబినెట్ నియామక కమిటీ ఇందుకు ఆమోదం తెలిపింది.
![CBDT Chairman Pramod Chandra Mody](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10813762_pc.jpg)
పీసీ మోదీ పదవీ కాలం పొడిగింపు.. మార్చి 1 నుంచి మే 31 వరకు గానీ లేదా తదుపరి ఆదేశాలు వచ్చే వరకు గానీ అమలులో ఉండనుంది. ఈయన పదవీ కాలాన్ని 2020 ఆగస్టులో ఆరు నెలలు పొడిగించింది కేంద్రం. ఆ సమయమూ ముగుస్తుండటం వల్ల మరోమారు పొడింగించింది.
ఇదీ చదవండి:కొవిడ్ టీకా ధరలపై షా అసంతృప్తి!