ETV Bharat / business

ఎయిర్ ఇండియాపై కెయిర్న్‌ ఎనర్జీ దావా!

author img

By

Published : May 15, 2021, 10:34 PM IST

అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కోర్టు తీర్పులో చెప్పినట్లుగా 1.2 బిలియన్‌ డాలర్ల అవార్డును చెల్లించాల్సిందేనంటూ అమెరికా డిస్ట్రిక్ట్‌ కోర్టును ఆశ్రయించింది. ఆ మొత్తం చెల్లింపునకు ప్రభుత్వరంగ విమానయాన సంస్థ అయిన ఎయిర్​ ఇండియాను బాధ్యురాలిని చెయ్యాలని కోరుతూ కోర్టులో దావా వేసింది.

కెయిర్న్‌ ఎనర్జీ రెట్రోస్పెక్టివ్‌ (పాత తేదీల నుంచి విధించే) పన్ను వివాదం కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కోర్టు తీర్పులో చెప్పినట్లుగా 1.2 బిలియన్‌ డాలర్ల అవార్డును చెల్లించాల్సిందేనంటూ అమెరికా డిస్ట్రిక్ట్‌ కోర్టును ఆశ్రయించింది. ఆ మొత్తం చెల్లింపునకు ప్రభుత్వరంగ విమానయాన సంస్థ అయిన ఎయిర్​ ఇండియాను బాధ్యురాలిని చెయ్యాలని కోరుతూ కోర్టులో దావా వేసింది. బ్రిటన్‌తో కుదిరిన పెట్టుబడుల ఒప్పందాన్ని భారత్‌ ఉల్లంఘించిందని ఆ మేరకు నష్టపరిహారం చెల్లించాల్సిందేనని పిటిషన్‌లో ఆరోపించింది. ప్రభుత్వ యాజమాన్యంలో ఉన్న ఎయిర్​ ఇండియాను, ప్రభుత్వాన్ని వేరు చేసి చూడలేమని పేర్కొంది.

దీనిపై ఎయిర్​ ఇండియా ఇంకా స్పందించలేదు. కానీ, కేంద్ర ప్రభుత్వంలోని ఓ ఉన్నతాధికారి మాట్లాడుతూ.. ప్రభుత్వానికిగానీ, ఎయిర్​ ఇండియాకుగానీ ఇంకా ఎలాంటి నోటీసులు అందలేదని తెలిపారు. కెయిర్న్‌ చర్యను చట్టవిరుద్ధమని తెలిపిన ఆయన ప్రభుత్వం, ఎయిర్​ ఇండియా దీనిపై న్యాయపరంగా ముందుకు వెళతాయని పేర్కొన్నారు. అయితే, ఈ ఏడాది ఎయిర్​ ఇండియా ప్రైవేటీకరణ పూర్తి చేయాలన్న ప్రభుత్వ లక్ష్యానికి కెయిర్న్‌ దావా అడ్డుపడే అవకాశం ఉన్నట్లు సమాచారం.

ది హేగ్‌లోని అంతర్జాతీయ మధ్యవర్తిత్వ న్యాయస్థానం (ఆర్బిట్రేషన్‌ కోర్టు) ఆదేశాల మేరకు తమకు భారత ప్రభుత్వం నుంచి 1.2 బిలియన్‌ డాలర్లను ఇప్పించాలని కోరుతూ కెయిర్న్‌ ఎనర్జీ అమెరికాలోని న్యాయస్థానంలో తాజాగా దావా వేసింది. ఆర్బిట్రేషన్‌ తీర్పును గుర్తిస్తూ చక్రవడ్డీతో సహా పరిహారాన్ని ఇప్పించాలని అమెరికా సహా యూకే, నెదర్లాండ్స్‌లోనూ గతంలోనే పిటిషన్లు దాఖలు చేసింది. సొమ్ము చెల్లించకపోతే ఆయా దేశాల్లో ఉన్న భారత ఆస్తులను సీజ్‌ చేయించి మరీ వసూలు చేయాలని ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు గతంలోనే వార్తలు వచ్చాయి. ఆ మేరకు భారత ప్రభుత్వానికి విదేశాల్లో ఉన్న ఆస్తులను కెయిర్న్‌ ఎనర్జీ గుర్తించింది. అందులో భాగంగా తాజాగా ఎయిర్​ ఇండియాను ఈ వివాదంలోకి లాగింది.

ఇదీ కేసు నేపథ్యం...

2006లో కంపెనీ అంతర్గత పునర్‌వ్యవస్థీకరణ సమాచారాన్ని కోరుతూ కేంద్ర ప్రభుత్వ పన్నుల విభాగం కెయిర్న్‌‌ ఎనర్జీకి నోటీసులు జారీ చేసింది. వాటిని పరిశీలించిన అనంతరం 2015లో రూ.10,247 కోట్ల పన్నులు చెల్లించాలని కోరింది. పునర్‌వ్యవస్థీకరణ వల్ల వచ్చిన మూలధన రాబడిపై ఈ మేరకు పన్ను చెల్లించాలని తెలిపింది. ఇదిలా ఉండగా.. 2010-11లో కెయిర్న్‌‌ ఎనర్జీ భారత్‌లోని తన అనుబంధ సంస్థ 'కెయిర్న్‌‌ ఇండియా'ను వేదాంతకు విక్రయించింది. ఈ క్రమంలో వేదాంతలో ప్రిఫరెన్షియల్‌ షేర్లతో పాటు ఐదు శాతం వాటాలను ఇచ్చారు.

దీంతో వేదాంతలోని ఐదు శాతం కెయిర్న్‌‌ ఎనర్జీ షేర్లను భారత ప్రభుత్వం అటాచ్‌ చేసింది. అలాగే రూ.1,140 కోట్ల డివిడెండ్లు, రూ.1,590 కోట్ల ట్యాక్స్‌ రీఫండ్‌ను నిలిపివేసింది. తదనంతరం తమకు రావాల్సిన పన్ను వసూలు కోసం అటాచ్‌ చేసిన వేదాంత షేర్లను విక్రయించింది. దీంతో బ్రిటన్‌‌-భారత్‌ ద్వైపాక్షిక పెట్టుబడుల ఒప్పందం(బీఐటీ) కింద ఈ నోటీసులను సవాలు చేస్తూ కెయిర్న్‌ ఎనర్జీ ఆర్బిట్రేషన్‌ను ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన ఆర్బిట్రేషన్‌ ట్రైబ్యునల్‌ ద్వైపాక్షిక పెట్టుబడి పరిరక్షణ ఒప్పందాన్ని పన్ను నోటీసులు ఉల్లంఘించాయంటూ తీర్పునిచ్చింది. అలాగే నిలిపివేసిన డివిడెంట్లు, ట్యాక్స్ రీఫండ్‌, షేర్ల విక్రయం వల్ల వాటిల్లిన నష్టం నేపథ్యంలో తిరిగి భారత ప్రభుత్వమే కెయిర్న్‌‌ ఎనర్జీకి రూ.7,600 కోట్లు చెల్లించాలని ఆదేశించింది.

కెయిర్న్‌ ఎనర్జీ రెట్రోస్పెక్టివ్‌ (పాత తేదీల నుంచి విధించే) పన్ను వివాదం కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కోర్టు తీర్పులో చెప్పినట్లుగా 1.2 బిలియన్‌ డాలర్ల అవార్డును చెల్లించాల్సిందేనంటూ అమెరికా డిస్ట్రిక్ట్‌ కోర్టును ఆశ్రయించింది. ఆ మొత్తం చెల్లింపునకు ప్రభుత్వరంగ విమానయాన సంస్థ అయిన ఎయిర్​ ఇండియాను బాధ్యురాలిని చెయ్యాలని కోరుతూ కోర్టులో దావా వేసింది. బ్రిటన్‌తో కుదిరిన పెట్టుబడుల ఒప్పందాన్ని భారత్‌ ఉల్లంఘించిందని ఆ మేరకు నష్టపరిహారం చెల్లించాల్సిందేనని పిటిషన్‌లో ఆరోపించింది. ప్రభుత్వ యాజమాన్యంలో ఉన్న ఎయిర్​ ఇండియాను, ప్రభుత్వాన్ని వేరు చేసి చూడలేమని పేర్కొంది.

దీనిపై ఎయిర్​ ఇండియా ఇంకా స్పందించలేదు. కానీ, కేంద్ర ప్రభుత్వంలోని ఓ ఉన్నతాధికారి మాట్లాడుతూ.. ప్రభుత్వానికిగానీ, ఎయిర్​ ఇండియాకుగానీ ఇంకా ఎలాంటి నోటీసులు అందలేదని తెలిపారు. కెయిర్న్‌ చర్యను చట్టవిరుద్ధమని తెలిపిన ఆయన ప్రభుత్వం, ఎయిర్​ ఇండియా దీనిపై న్యాయపరంగా ముందుకు వెళతాయని పేర్కొన్నారు. అయితే, ఈ ఏడాది ఎయిర్​ ఇండియా ప్రైవేటీకరణ పూర్తి చేయాలన్న ప్రభుత్వ లక్ష్యానికి కెయిర్న్‌ దావా అడ్డుపడే అవకాశం ఉన్నట్లు సమాచారం.

ది హేగ్‌లోని అంతర్జాతీయ మధ్యవర్తిత్వ న్యాయస్థానం (ఆర్బిట్రేషన్‌ కోర్టు) ఆదేశాల మేరకు తమకు భారత ప్రభుత్వం నుంచి 1.2 బిలియన్‌ డాలర్లను ఇప్పించాలని కోరుతూ కెయిర్న్‌ ఎనర్జీ అమెరికాలోని న్యాయస్థానంలో తాజాగా దావా వేసింది. ఆర్బిట్రేషన్‌ తీర్పును గుర్తిస్తూ చక్రవడ్డీతో సహా పరిహారాన్ని ఇప్పించాలని అమెరికా సహా యూకే, నెదర్లాండ్స్‌లోనూ గతంలోనే పిటిషన్లు దాఖలు చేసింది. సొమ్ము చెల్లించకపోతే ఆయా దేశాల్లో ఉన్న భారత ఆస్తులను సీజ్‌ చేయించి మరీ వసూలు చేయాలని ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు గతంలోనే వార్తలు వచ్చాయి. ఆ మేరకు భారత ప్రభుత్వానికి విదేశాల్లో ఉన్న ఆస్తులను కెయిర్న్‌ ఎనర్జీ గుర్తించింది. అందులో భాగంగా తాజాగా ఎయిర్​ ఇండియాను ఈ వివాదంలోకి లాగింది.

ఇదీ కేసు నేపథ్యం...

2006లో కంపెనీ అంతర్గత పునర్‌వ్యవస్థీకరణ సమాచారాన్ని కోరుతూ కేంద్ర ప్రభుత్వ పన్నుల విభాగం కెయిర్న్‌‌ ఎనర్జీకి నోటీసులు జారీ చేసింది. వాటిని పరిశీలించిన అనంతరం 2015లో రూ.10,247 కోట్ల పన్నులు చెల్లించాలని కోరింది. పునర్‌వ్యవస్థీకరణ వల్ల వచ్చిన మూలధన రాబడిపై ఈ మేరకు పన్ను చెల్లించాలని తెలిపింది. ఇదిలా ఉండగా.. 2010-11లో కెయిర్న్‌‌ ఎనర్జీ భారత్‌లోని తన అనుబంధ సంస్థ 'కెయిర్న్‌‌ ఇండియా'ను వేదాంతకు విక్రయించింది. ఈ క్రమంలో వేదాంతలో ప్రిఫరెన్షియల్‌ షేర్లతో పాటు ఐదు శాతం వాటాలను ఇచ్చారు.

దీంతో వేదాంతలోని ఐదు శాతం కెయిర్న్‌‌ ఎనర్జీ షేర్లను భారత ప్రభుత్వం అటాచ్‌ చేసింది. అలాగే రూ.1,140 కోట్ల డివిడెండ్లు, రూ.1,590 కోట్ల ట్యాక్స్‌ రీఫండ్‌ను నిలిపివేసింది. తదనంతరం తమకు రావాల్సిన పన్ను వసూలు కోసం అటాచ్‌ చేసిన వేదాంత షేర్లను విక్రయించింది. దీంతో బ్రిటన్‌‌-భారత్‌ ద్వైపాక్షిక పెట్టుబడుల ఒప్పందం(బీఐటీ) కింద ఈ నోటీసులను సవాలు చేస్తూ కెయిర్న్‌ ఎనర్జీ ఆర్బిట్రేషన్‌ను ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన ఆర్బిట్రేషన్‌ ట్రైబ్యునల్‌ ద్వైపాక్షిక పెట్టుబడి పరిరక్షణ ఒప్పందాన్ని పన్ను నోటీసులు ఉల్లంఘించాయంటూ తీర్పునిచ్చింది. అలాగే నిలిపివేసిన డివిడెంట్లు, ట్యాక్స్ రీఫండ్‌, షేర్ల విక్రయం వల్ల వాటిల్లిన నష్టం నేపథ్యంలో తిరిగి భారత ప్రభుత్వమే కెయిర్న్‌‌ ఎనర్జీకి రూ.7,600 కోట్లు చెల్లించాలని ఆదేశించింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.