లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూకు చెందిన ద్విచక్ర వాహనాల విభాగం బీఎండబ్ల్యూ మోటరాడ్ భారత్లో రెండు కొత్త బైక్లను విడుదల చేసింది. ఆర్ 1250 జీఎస్, ఆర్1250 జీఎస్ అడ్వెంచర్ బైక్ల అప్డేటెడ్ వెర్షన్లను మార్కెట్లోకి తీసుకొచ్చింది.
ఆర్ 1250 జీఎస్ ధర రూ.20.45 లక్షలుగా నిర్ణయించింది కంపెనీ. మరో మోడల్ ఆర్ 1250 జీఎస్ అడ్వెంచర్ ధర రూ.22.4 లక్షలుగా తెలిపింది. (దిల్లీ ఎక్స్ షోరూం ధరలు)
ఈ బైక్లను గురువారం అధీకృత డీలర్షిప్ల ద్వారా బుక్ చేసుకోవచ్చని తెలిపింది బీఎండబ్ల్యూ మోటరాడ్. ఈ రెండు బైక్లు సాధారణ రోడ్లతో పాటు, ఆఫ్ రోడ్లోనూ మంచి రైడింగ్ అనుభూతినిస్తాయని వెల్లడించింది.
- 1,254 సీసీ ఇంజిన్ (100 కిలో వాట్స్ పవర్ ఉత్పత్తి సామర్థ్యం)
- రైడింగ్ మోడ్స్ సహా డైనమిక్ ట్రాక్షన్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి.